ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు గత రెండు వారాలుగా ఆందోళనలు చేస్తున్న వేళ.. రాయలసీమ నేతలు కొత్త డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు. ఇటీవలే వైసీపీ ఎమ్మెల్యే పీవీ సిద్దా రెడ్డి అనంతపురంలో అసెంబ్లీని ఏర్పాటు చేయాలని కోరితే.. తాజాగా కర్నూల్ జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత ఏకంగా తన నియోజకవర్గాన్ని కర్ణాటకలో కలిపేయాలని డిమాండ్ చేశారు. మూడు రాధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ నేత తిక్కారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధానుల పేరుతో ప్రజలను ముఖ్యమంత్రి ఆయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు. మూడు రాజధానులతో ప్రజలకు ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. జగన్కు పరిపాలన చేతకాక రాజధాని పేరుతో ప్రాంతాల వారీగా ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని విమర్శించారు. రాజధానిని విశాఖపట్టణానికి తరలిస్తే రాయలసీమ ప్రజలు అక్కడకు వెళ్లాలంటే 22 గంటల పడుతుందని, పూర్తి మెజారిటీ ఇచ్చినందుకు సీఎం జగన్ ఇష్టారాజ్యంగా చేస్తున్నారని మండిపడ్డారు.
ఒకప్పుడు కర్నూలు పార్లమెంటు స్థానం కర్ణాటకలో ఉండడంతో భాషాపరంగా బళ్లారి జిల్లాలో ఉన్న ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో కలిపితే సహకరించామని తెలిపారు. భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడక ముందు 1956లో తమ ప్రాంతం బళ్లారి జిల్లా ఆదోని తాలుకాలో ఉండేదని, ఇపుడు కర్నాటకలో కలిపేయాలని ఆయన డిమాండు చేశారు. తమ ప్రాంతంలో అంతా కర్ణాటక సంప్రదాయమే ఉందని, రాజధాని పేర్లతో కర్నూలు, హైదరాబాద్, అమరావతి, ఇప్పుడు విశాఖపట్నం తెరపైకి తేవడం జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. తక్షణమే మంత్రాలయం నియోజకవర్గాన్ని కర్ణాటకలో కలపాలని ఆయన డిమాండు చేశారు. అవసరమైతే కర్నూలు పార్లమెంట్ పరిధిలోని అన్ని పార్టీలను కలుపుకొని ఉద్యమాలు చేస్తామని తిక్కారెడ్డి స్పష్టం చేశారు.
కాగా, రాజధానిని విశాఖకు మారిస్తే తమకు మరింత ప్రయాణభారమవుతుందని, కర్నూలులో హైకోర్టు వల్ల తమకు ఒరిగేది ఏమీలేదని కొంత మంది రాయలసీమ నేతలు అభిప్రాయపడుతున్నారు. కర్నూలులో హైకోర్టు వల్ల ఒరిగేది ఏమీలేదని ఇప్పటికే మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ కూడా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, అదే కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మాత్రం ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
This post was last modified on January 1, 2020 7:35 pm
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,… Read More
Blink OTT: తెలుగులో దసరా మూవీ బ్లాక్ పాస్టర్ హిట్ టాక్ను అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. నాచురల్… Read More
Megalopolis: ఓ సినిమా కోసం డైరెక్టర్లు ఏడాది లేదా రెండు సంవత్సరాలు తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. జక్కన్న లాంటి… Read More
Zee Mahotsavam OTT: తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ప్రేక్షకులకు వినోదం పంచుతూ అగ్రగామిగా నిలుస్తున్న చానల్లో జీ తెలుగు కూడా… Read More
Dakshina Trailer: కబాలి మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి సాయిధన్నిక. ఈ మూవీలో రజనీకాంత్ కూతురుగా యాక్షన్… Read More
Aquaman And The Lost Kingdom OTT: హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్… Read More
Maya Petika OTT: థియేటర్లలో రిలీజ్ అయిన సుమారు 11 నెలల అనంతరం మరో ఓటిటిలోకి వస్తుంది పాయల్ రాజ్… Read More
Allagadda: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడు నిఖిల్ పై హత్యాయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి… Read More
EC: ఏపీలో పోలింగ్ ముగిసినప్పటికీ పలు చోట్ల హింసాత్మక ఘటనలు చేలరేగాయి. తాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల, నరసరావుపేట ప్రాంతాల్లో ఇప్పటికీ… Read More
Comedian Srinu: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కమెడియన్స్ మరియు హీరో అదే విధంగా హీరోయిన్ కూడా అయ్యారు. అలా… Read More
Faima: జబర్దస్త్ కమెడియన్ ఫైమా మనందరికీ సుపరిచితమే. మొదట ఈ బ్యూటీ ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయినా పటాస్… Read More
Kajal Agarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బ్యూటీ ఇప్పటికే అనేక మంది స్టార్… Read More
OTT: 30 వెడ్స్ 21 అనే యూట్యూబ్ సిరీస్ తో పాపులర్ అయిన చైతన్య రావ్ మనందరికీ సుపరిచితమే. ఈయన… Read More
Sri Sathya: ప్రెసెంట్ ఉన్న సినీ తారలు కారులు కొనుగోలు చేయడంపై బిజీ అయిపోయారు. చిన్న యాక్టర్ పెద్ద యాక్టర్… Read More
NTR: ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో… Read More