NewsOrbit
టాప్ స్టోరీస్

మా నియోజకవర్గాన్ని కర్ణాటకలో కలిపేయండి: టీడీపీ నేత

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు గత రెండు వారాలుగా ఆందోళనలు చేస్తున్న వేళ.. రాయలసీమ నేతలు కొత్త డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు. ఇటీవలే వైసీపీ ఎమ్మెల్యే పీవీ సిద్దా రెడ్డి అనంతపురంలో అసెంబ్లీని ఏర్పాటు చేయాలని కోరితే.. తాజాగా కర్నూల్ జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత ఏకంగా తన నియోజకవర్గాన్ని కర్ణాటకలో కలిపేయాలని డిమాండ్ చేశారు. మూడు రాధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ నేత తిక్కారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధానుల పేరుతో ప్రజలను ముఖ్యమంత్రి ఆయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు. మూడు రాజధానులతో ప్రజలకు ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. జగన్‌కు పరిపాలన చేతకాక రాజధాని పేరుతో ప్రాంతాల వారీగా ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని విమర్శించారు. రాజధానిని విశాఖపట్టణానికి తరలిస్తే రాయలసీమ ప్రజలు అక్కడకు వెళ్లాలంటే 22 గంటల పడుతుందని, పూర్తి మెజారిటీ ఇచ్చినందుకు సీఎం జగన్ ఇష్టారాజ్యంగా చేస్తున్నారని మండిపడ్డారు.

ఒకప్పుడు కర్నూలు పార్లమెంటు స్థానం కర్ణాటకలో ఉండడంతో భాషాపరంగా బళ్లారి జిల్లాలో ఉన్న ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కలిపితే సహకరించామని తెలిపారు. భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడక ముందు 1956లో తమ ప్రాంతం బళ్లారి జిల్లా ఆదోని తాలుకాలో ఉండేదని, ఇపుడు కర్నాటకలో కలిపేయాలని ఆయన డిమాండు చేశారు. తమ ప్రాంతంలో అంతా కర్ణాటక సంప్రదాయమే ఉందని, రాజధాని పేర్లతో కర్నూలు, హైదరాబాద్‌, అమరావతి, ఇప్పుడు విశాఖపట్నం తెరపైకి తేవడం జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. తక్షణమే మంత్రాలయం నియోజకవర్గాన్ని కర్ణాటకలో కలపాలని ఆయన డిమాండు చేశారు. అవసరమైతే కర్నూలు పార్లమెంట్ పరిధిలోని అన్ని పార్టీలను కలుపుకొని ఉద్యమాలు చేస్తామని తిక్కారెడ్డి స్పష్టం చేశారు.

కాగా, రాజధానిని విశాఖకు మారిస్తే తమకు మరింత ప్రయాణభారమవుతుందని, కర్నూలులో హైకోర్టు వల్ల తమకు ఒరిగేది ఏమీలేదని కొంత మంది రాయలసీమ నేతలు అభిప్రాయపడుతున్నారు. కర్నూలులో హైకోర్టు వల్ల ఒరిగేది ఏమీలేదని ఇప్పటికే మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ కూడా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, అదే కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మాత్రం ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment