AP Politics: ఏపి రాజకీయ వర్గాల్లో ప్రధాన పార్టీల మధ్య పొత్తుల అంశం హాట్ టాపిక్ గా ఉంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు వేరువేరుగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలక మూలంగా అధికార వైసీపీకే లాభం చేకూరుతుందనే మాట వినబడుతోంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటానికి జనసేనతో జత కట్టాలనీ టీడీపీ, టీడీపీతో కలిసి పోటీ చేయాలని జనసేన భావిస్తున్నా బీజేపీ ప్రతిబంధకంగా తయారు అయ్యింది. కేంద్రంలో అధికారంలో ఉండటం, వ్యవస్థల తోడ్పాటు ఉండటం మూలంగా బీజేపీతో కయ్యం పెట్టుకోవడానికి రాష్ట్రంలోని అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సిద్దంగా లేవు. బీజేపీతో మరో సారి పొత్తు పెట్టుకోవాలని టీడీపీ ఆశపడుతున్నా ఆ పార్టీ సిద్దంగా లేదు. ఏపి బీజేపీ నేతలు పలువురు ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. టీడీపీతో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నర్శింహరావు తదితరులు పదేపదే ఈ విషయాన్ని చెబుతున్నారు. అధికార వైసీపీ మాత్రం బీజేపీకి పరోక్షంగా సహకారం అందించేందుకు, పరోక్షంగా సహకారం పొందే ప్రయత్నంలో ఉంది.
2014 ఎన్నికల పొత్తులు (టీడీపీ జనసేన బీజేపీ) పునరుద్దరణకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తామని చెబుతున్నారు. ఒక వేళ బీజేపీ కలిసి రాకపోతే, టీడీపీతో కలిసి వెళ్లడానికైనా పవన్ సిద్దపడుతున్నారనేది టాక్. బీజేపీ నేతలు మాత్రం తాము జనసేనతో తప్ప ఏ ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోమని చెబుతోంది. ఇది ఆ పార్టీలోని కొందరు నేతలకు నచ్చడం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క స్థానాన్ని గెలుచుకునే పరిస్థితి లేదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా తామే అధికారంలోకి వచ్చేది తామే అంటూ బీజేపీ నేతలు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కైవశం చేసుకోలేకపోయింది.
ఈ పరిణామాల నేపథ్యంలో కొందరు బీజేపీ నేతలు వేచి చూసే ధోరణిలో ఉన్నారని అంటున్నారు. టీడీపీ, జనసేనతో పొత్తు కుదరకపోతే తమ రాజకీయ భవిష్యత్తు కోసం కొందరు కీలక నాయకులు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, లేదా జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారన్న టాక్ వినబడుతోంది. బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జనసేనలో చేరే అవకాశం ఉందన్న వార్తలు బలంగా వినబడుతున్నాయి. విశాఖ నుండి బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు టీడీపీలో చేరి ఆయన కానీ ఆయన కుమారుడు గానీ విశాఖ నార్త్ నుండి పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం విశాఖ నార్త్ టీడీపీ ఎమ్మెల్యే గా ఉన్న గంటా శ్రీనివాసరావు తమ రాజకీయ ఎత్తులు, సంప్రదాయాన్ని అనుసరించి వేరే నియోజకవర్గాని మారతారని అంటున్నారు. ప్రస్తుతం రాజకీయంగా క్రియాశీలకంగా లేకపోయినా మంత్రిగా పని చేసిన బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ కూడా ఆ పార్టీలో కొనసాగే అవకాశం లేదని పేర్కొంటున్నారు.
వీళ్లతో పాటు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బీజేపీ నేత భూమా కిషోర్ రెడ్డి ఆ పార్టీలో కొనసాగే అవకాశం లేదు. ఆయన ఆళ్లగడ్డ టీడీపీ టికెట్ ఆశిస్తున్నారుట. అదే విధంగా సత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి ( గోనుగుంట్ల సూర్యనారాయణరెడ్డి) కూడా బీజేపీ నుండి టీడీపీలో చేరే అవకాశం ఉంది. అదే విధంగా జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వీళ్లతో పాటు టీడీపీ రాజ్యసభ సభ్యులుగా గెలిచి బీజేపీలో చేరిన టీజీ వెంకటేశ్, సీఎం రమేష్, సుజనా చౌదరిలు కూడా ఆ పార్టీ కొనసాగడం అనుమానమేనంటున్నారు. ఇలా కీలక నేతలు గుడ్ బై చెబితే బీజేపీలో ఆర్ఎస్ఎస్ భావజాలంతో మొదటి నుండి ఆ పార్టీలో ఉన్న సోము వీర్రాజు, జీవిఎల్ నర్శింహరావు లాంటి వారు మాత్రమే మిగులుతారనేది నిర్వివాదాంశం.
Jyothi Rai: జ్యోతి రాయ్.. టీవీ ప్రేక్షకులకు, సోషల్ మీడియా లవర్స్ కు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు… Read More
AP High Court: రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్ పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల… Read More
Kovai Sarala: కోవై సరళ.. సౌత్ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఒక మలయాళీ కుటుంబంలో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More
BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More
Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More
ఏపీలో ప్రదాని నరేంద్రమోడీ ఆవేశంగా ప్రసంగాలు దంచి కొట్టారు. తమది కాని ప్రభుత్వం.. ఎక్కడ ఉన్నా .. ఆయనకు, బీజేపీ… Read More
ఎవరైనా వ్యక్తిని అడాప్ట్ చేసుకోవడం తప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హద్దులు.. పద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More
May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More