డీకే ఆదికేశవులనాయుడు భార్యగా ఆయన చనిపోయే వరకు కనీసం గడప కూడా దాటని సత్యప్రభ ఆదికేశువుల నాయుడు 2013 లో మృతి చెందిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు.
అప్పటివరకు కాంగ్రెస్ లో ఉన్న డీకే కుటుంబాన్ని చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. 2014 ఎన్నికల్లో చిత్తూర్ టీడీపీ టికెట్ను సత్యప్రభకు ఇచ్చారు. ప్రజారాజ్యం పార్టీలో 2009 లో ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయి, అనంతరం చంద్రబాబు టికెట్ హామీ మేరకు టీడీపీలోకి వచ్చిన ఆరని శ్రీనివాసులు (ప్రస్తుత చిత్తూర్ ఎమ్మెల్యే, వైస్సార్సీపీ) పార్టీ కోసం మొత్తం ఖర్చు పెట్టి , పోటీకి సిద్ధం అవుతున్న తరుణంలో చివరి నిమిషంలో ఆరని శ్రీనివాసులును పక్కన పెట్టి మరి తనకు టికెట్ వద్దు అంటున్న డీకే సత్యప్రభకు పట్టుబట్టి మరి టికెట్ ఇచ్చారు. గడప కూడా దాటని ఆమె కేవలం చంద్రబాబు రమ్మన్నారు అనే కోణంలో రాగ ఆమెను ప్రచారానికి భారీగా డబ్బు ఖర్చుపెట్టించారు. అప్పటి పొత్తు ఫలితాల వల్ల సత్యప్రభ గెలిచినా ఆమెకు సరైన న్యాయం చేయలేదు అనేది పార్టీ నాయకుల మాట. పార్టీ పదవి అప్పగించి , జిల్లాలో ఎలాంటి కార్యక్రమం జరిగిన డీకే కుటుంబంతో ఖర్చు చేయిస్తూ వాడుకున్నారు. కనీసం పొలిట్ బ్యూరోలోకి తీసుకోకుండా జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తగిలించి రాష్ట్ర స్థాయి కార్యక్రమాలకు, సంవత్సర విరాళాలకు మాత్రం భారీగా టీడీపీ పార్టీ దండుకుంది అనేది వారి డీకే అనుచరులు, వారి
కుటుంబ సభ్యులే చెప్పే మాట.
2019 ఎన్నికల్లో కుటుంబ సభ్యుల సూచన మేరకు సత్యప్రభ చిత్తూర్ అసెంబ్లీ కి పోటీ చేయాలనీ అధినేతకు విషయం చెప్పారు . మొదట చంద్రబాబు సరే అన్నారు. తర్వాత చిత్తూర్ లో టీడీపీ తరఫున పోటీచేసేందుకు బలమైన అభ్యర్థి లేకపోవడంతో ఇక డీకే సత్యప్రభ టీడీపీ అభ్యర్థి అవుతారని మీడియాలో చివరి వరకు ప్రచారం జరిగింది. అయితే అప్పటికి అప్పుడు సత్యప్రభను రాజంపేట ఎంపీ గా పోటీచేయాలని బాబు ఆదేశించారు. చిత్తూర్ టికెట్ కోసం అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చిన మనోహర్ ను పోటీ కి పెట్టారు . ఇదికూడా కేవలం ఎంపీగా ఎమ్మెల్యే లకు పెట్టాల్సిన ఖర్చు కోసమే ఆమెను అప్పటికి అప్పుడు స్థానం మార్చారు . ఎన్నికల్లో రాజంపేట కు బలమైన అభ్యర్థులు లేకపోవడం , రాజంపేట లోక్ సభ పరిధిలో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి సత్యప్రభ ఐతే ఆర్ధికంగా తమకు సాయాపడతారు అని కోరడంతో బాబు ఏమి చేయలేని స్థితిలో ఆమెను రాజంపేట ఎంపీగా పోటీ చేయించారు అనేది కాదనలేని వాస్తవం. 2019 ఎన్నికల్లో లోక్ సభ పరిధిలో అనధికారికంగా అధికంగా ఖర్చు చేసిన అభ్యర్థి సత్యప్రభ.
ఐతే 2019 ఎన్నికల తర్వాత డీకే కుటుంబంలో టీడీపీ తీరు పట్ల అసంతృప్తి వచ్చింది. ముఖ్యంగా ఇద్దరు అల్లుళ్ళు అధికార పార్టీ వైస్సార్సీపీ వైపు చూసారు. దానివల్ల అన్ని రకాలుగా ప్రయోజనం ఉంటుంది అని, రాజకీయంగా దన్ను ఉంటుంది అనే కోణంలో వైస్సార్సీపీ జిల్లా పెద్ద పెద్ది రెడ్డి తోను మంతనాలు సాగించారు. రెండు మూడు సార్లు వివిధ సందర్భాల్లో సైతం వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు 5 మంది వరకు సత్యప్రభ ఇంట్లో విందు సమావేశాలు జరిపారు. ఇక డీకే ఫామిలీ టీడీపీను వీడుతుంది అనే ప్రచారం విస్తృతంగా జరిగిన నేపథ్యంలో చంద్ర బాబు మల్లి డీకే సత్యప్రభ, ఆమె కుటుంబ సభ్యులతో విడిగా మాట్లాడారు. కొన్ని రోజులు ఓపిక పట్టాలని చెప్పిన ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలతో డీకే కుటుంబం అధికపార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించింది.. ఈ సమయంలోనే సత్యప్రభ మృతి చెందటంతో వారి కుటుంబం భవిష్యత్తు లో రాజకీయ పడవ ఎక్కుతారా..? లేక వ్యాపారంలో ఉండిపోతారు అనే దానిపై చర్చ సాగుతోంది.
EC: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. జనసేన పార్టీకి కామన్ సింబల్… Read More
YS Sharmila: వైఎస్ఆర్ ప్రజాదర్భార్ పెట్టి ప్రజల మధ్యే ఉండే వారు..జగన్ పాలనలో మంత్రులకే అపాయింట్మెంట్ దొరకలేదు..వైఎస్ఆర్ పాలన..జగన్ పాలనకు… Read More
TDP: సీఎం వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడైన కోడి కత్తి శ్రీను టీడీపీలో చేరాడు. ముమ్మడివరంలో ఆదివారం… Read More
Anand Devarakonda: రౌడీ హీరో అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్… Read More
Pokiri: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ సూపర్ హిట్గా నిలిచిన సినిమాలలో పోకిరి కూడా ఒకటి. 2006… Read More
Main Released Movies In OTT: ఏప్రిల్ నెలలో అనేక సినిమాలు ఓటీటీలోకి వచ్చి సందడి చేశాయి. ముఖ్యంగా తెలుగు… Read More
Samantha Movie Poster: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా… Read More
Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో… Read More
Lineman OTT: ప్రస్తుత కాలంలో ఓటీటీ సినిమాలన్నీ సైలెంట్ గా స్ట్రీమింగ్ కు వచ్చేస్తూ ఫాన్స్ కి బిగ్ షాక్… Read More
Agent OTT: కామన్ గా మంచి విజయాలు అయినా సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు… Read More
YSRCP: ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5… Read More
Geetu royal: బిగ్ బాస్ ద్వారా మంచి పేరు ప్రక్షాతలు సంపాదించుకున్న నటీనటులు ఎందరో ఉన్నారు. వారిలో గీతు రాయల్… Read More
Kumkumapuvvu: ప్రస్తుత కాలంలో అనేకమంది సీరియల్ ఆర్టిస్టులకు మరియు స్టార్ హీరో మరియు హీరోయిన్స్ కి పరిచయం మరియు ఇతర… Read More
Sudigali Sudheer: తెలుగు బుల్లితెర ఆడియన్స్ కే కాదు.. వెండితెర ఆడియన్స్ కి కూడా సుపరిచితమైన సుడిగాలి సుదీర్ గురించి… Read More
Brahmamudi: తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి.… Read More