EC: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. జనసేన పార్టీకి కామన్ సింబల్ గా గ్లాసు గుర్తును కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్ లకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంతకు ముందు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ జాబితాలో పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో జనసేన అభ్యర్ధులు పోటీ చేయని స్థానాల్లో స్వతంత్ర అభ్యర్ధులు గ్లాసు గుర్తును పొందే అవకాశం ఉంటుంది. దీంతో జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితా నుండి తొలగించాలని కోరుతూ విజ్ఞప్తి పంపింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మరో వైపు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీకి కూడా అన్ని నియోజకవర్గాల్లో టార్చ్ లైట్ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
YS Sharmila: వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?