TDP: సీఎం వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడైన కోడి కత్తి శ్రీను టీడీపీలో చేరాడు. ముమ్మడివరంలో ఆదివారం టీడీపీ అభ్యర్ధి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో శ్రీను ఆ పార్టీలో చేరారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం అయిదేళ్లు జైల్ లో మగ్గానని ఆవేదన వ్యక్తం చేశాడు.
విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై కోడి కత్తితో చేసిన దాడి కేసులో ఇటీవలే శ్రీను బెయిల్ పై విడుదల అయిన విషయం తెలిసిందే. శ్రీను బెయిల్ కోసం తల్లి సోదరుడు పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేశారు. జైలు నుండి తన విడుదల కోసం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే తాను వైసీపీని ఎంతగానో అభిమానించానని.. కానీ తాను జైలు నుండి విడుదలయ్యేందుకు ఆ పార్టీ నుండి కనీసం ఏ ఒక్కరూ సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జైలు నుండి తన విడుదలకు కారణమైన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా శ్రీను ధన్యవాదాలు తెలిపారు. తాను బతికి ఈ రోజు ఇలా ఉండటానికి ప్రతిపక్షాలు, ఎస్సీ సంఘాలే కారణమని అన్నారు. ఇక ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా తాను బరిలో దిగాలని తొలుత నిర్ణయించుకున్నాననీ, కానీ పరిస్థితులు అందుకు అనుకూలించలేదని తెలిపారు.
Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు