చంద్రబాబు ప్రభుత్వంలో ఆ ఇద్దరూ కీలక మంత్రులుగా పని చేసారు. అమరావతి రాజధానిగా ఖరారు చేసిన సమయం నుండి అధికారం కోల్పోయే వరకూ వారిద్దరే అమరావతి శిల్పులుగా కలరింగ్ ఇచ్చారు. రైతుల నుండి భూ సమీకరణ నుండి…అధికారులకు ఎవరితో ఎలా డీల్ చేయాలో అదే చేసారు. చంద్రబాబు సైతం వీరిద్దరికే అమరావతి పూర్తి బాధ్యతలు అప్పగించారు. చంద్రబాబు రాజధాని పైన ఏర్పాటు చేసిన కమిటీలోనూ కీలక పాత్ర పోషించారు. ఇక, చంద్రబాబు శైలి బాగా తెలిసిన వారిద్దరూ ఆయనను మెప్పించటం కోసం తెగ ప్రయత్నాలు చేసేవారు. అయితే, ఇప్పుడు ఆ ఇద్దరూ పత్తా లేకుండా పోయారు. రాజధాని పైన రగడ సాగుతున్న సమయంలో నాడు కీలకంగా వ్యవహరించిన ఆ ఇద్దరు మాజీ టీడీపీ మంత్రులు ఏమయ్యారు. వారి మీద ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు ఉండటంతో ఈ మొత్తం వ్యవహారానికి దూరమయ్యారా..లేక ఇప్పటికే వైసీపీ చేతికి చిక్కారా..చంద్రబాబు కు సైతం వారు అందుబాటులోకి రావటం లేదని ప్రచారం సాగుతోంది. ఇంతకీ వారిద్దరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు…
2014 ఎన్నికల్లో టీడీపీ గెలుపుతో వారిద్దరూ చంద్రబాబు కేబినెట్ లో మంత్రులయ్యారు. కీలక పోర్టుఫోలియోలు దక్కించుకున్నారు. ఒకరు చిలకలూరిపేట నుండి గెలిచిన ప్రత్తిపాటి పుల్లారావు కాగా..మరొకరు ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి దక్కించుకున్న నారాయణ. విద్యా సంస్థల అధినేత గా ఉంటూ టీడీపీకి చేసిన ఆర్దిక సాయానికి ప్రతిఫలంగా ఆయనకు కీలకమైన మున్సిపల్ శాఖ దక్కింది. దీంతో..రాజధాని కమిటీ ఆయన నాయకత్వంలోనే ప్రభుత్వానికి నివేదికలు సమర్పించింది. తన శాఖకు సంబంధించిన అంశాల కంటే అమరావతి..సింగపూర్ మధ్యే నారాయణ మంత్రి హోదాలో ఎక్కువగా పర్యటనలు చేయటం..రాజధానిలో ప్రతీ నిర్ణయం వెనుక నారాయణ కీలకంగా వ్యవహరించారు. తాత్కాలిక భవనాలకు టెండర్లు ఖరారు చేయటంలోనూ…రేట్ ఫిక్స్ చేయటంలో ఫైనల్ డెసిషన్ చంద్రబాబుదే అయినా వాటిని ఆ రకంగా సిద్దం చేసింది మాత్రం నారాయణ. ఇక, లాండ్ పూలింగ్ లో బుజ్జగింపులు..బెదిరింపులతో జిల్లా మంత్రి పుల్లారావు మంత్రిగా తన సామర్ద్యం ఏంటో అక్కడి రైతులకు చూపించారు. అదే విధంగా ఎడాపెడా వారికి హామీలు గుప్పించారు. అమరావతిలో అంత క్రియాశీలకంగా వ్యవహరించిన ఆ ఇద్దరు మంత్రులు ఇప్పుడు ఏమయ్యారు. రాజధానుల వివాదం..అమరావతి నుండి పాలనా రాజధాని తరలింపు.. రాజధానిలో చేసిన ఖర్చు పైన ఇంతగా రచ్చ జరుగుతున్నా..టీడీపీ అధినేత సవాళ్లు చేస్తున్నా..ఈ ఇద్దరు మాత్రం జోక్యం చేసుకోవటం లేదు. చంద్రబాబుకు అందుబాటులోకి రావటం లేదని సమాచారం.
వైసీపీ చాలా కాలంగా ఆరోపిస్తున్న అమరావతి భూముల వ్యవహారంలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో ఈ ఇద్దరి పేర్లను బయట పెట్టారు. మంత్రిగా పని చేసిన నారాయణ బినామీల పేర్లతో అమరావతిలో దాదాపు 3129 ఎకరాలు కొనుగోలు చేసారనేది వైసీపీ ఆరోపణ. నారాయణ వద్ద పని చేసే పలువురు దాదాపు 432 కోట్లు ఖర్చు చేసి ఆ భూములు కొనుగోలు చేసారు. అయితే, అవి బినామీల పేర్లతో నారాయణే కొనుగోలు చేసారని..ఆయన వద్ద పని చేసే వారికి అంత ఆర్దిక స్థోమత లేదనేది వైసీపీ ఆరోపణ. ఇక, మరో మాజీ మంత్రి పుల్లారావు సైతం అసైన్డ్ భూములతో కలిపి దాదాపు 196 ఎకరాల భూమిని కొనుగోలు చేసారని..అందుకోసం సుమారు 39 కోట్లు వెచ్చించారని వైసీపీ ఆరోపించింది. అయితే, అప్పట్లో శాసనసభలో ఇదే అంశం పైన చర్చ జరిగినప్పుడు వారిద్దరూ ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినట్లు ఆధారాలు చూపిస్తే వారిని కేబినెట్ నుండి డిస్మిస్ చేస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి భూస్కాం పైన విచారణ చేస్తోంది. కొందరు అధికారులతో సహా మరి కొందరిని అరెస్ట్ చేసింది. దీంతో..అమరావతి మొత్తం ఎపిసోడ్ లో కీలకంగా వ్యవహరించిన ఈ ఇద్దరు మాజీ మంత్రులు వైసీపీతో రాజీ ఫార్ములా కోసం ప్రయత్నం చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. ఇప్పుడు వైసీపీలో చేరటం ఖాయమనే ప్రచారం సాగుతున్న మాజీ మంత్రి గంటాకు ..నారాయణ వియ్యంకుడు. పుల్లారావు క్లాస్ మేట్..అత్యంత సన్నిహితుడు. దీంతో..వీరిద్దరూ కేసులు లేకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే మౌనంగా..టీడీపీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on August 7, 2020 1:27 pm
AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)లో ఊరట కలిగింది. ఏబీ… Read More
AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తారీకు పోలింగ్. వచ్చే సోమవారమే… Read More
Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. నిజానికి మంగళవారం అనగా మే… Read More
Heeramandi: హెరామండి వెబ్ సిరీస్ లో ఫరీదన్ అనే వేశ్య పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా. మే… Read More
Project Z OTT: యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ పేరే ప్రాజెక్ట్… Read More
Aavesham OTT: తమిళ్ స్టార్ నటుడు ఫాహిద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన ఆవేశం చిత్రం బ్లాక్ బస్టర్ అయిన… Read More
Adah Sharma Bastar OTT: అదాశర్మ ప్రధాన పాత్ర పోషించిన బస్తర్ ది నక్సల్ స్టోరీ సినిమా వివాదాస్పదమైనది. సుదీప్తో… Read More
Niharika Latest Post: మెగా డాటర్ నిహారిక మనందరికీ సుపరిషతమై. మొదటిగా హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… Read More
Karthika Deepam: సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ పౌచ్ బాధలు ఒక వెండి ధర నటీనటులే కాదు బుల్లితెర వారు కూడా… Read More
Aadapilla: పూర్వకాలంలో భార్య మరియు భర్తల మధ్య జరిగిన గొడవలను కేవలం నాలుగు గోడలకి మాత్రమే పరిమితం చేసేవారు. ఇక… Read More
Shoban Babu: ఆనాటి సోగ్గాడు శోభన్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. శోభన్ బాబుకి మరియు కృష్ణరాజుకి… Read More
Siri Hanumanthu: టెలివిజన్ పరిశ్రమలో.. ఎంటర్టైనింగ్ ఇండస్ట్రీలో సిరి గురించి తెలియని వారు అంటే ఉండరు అనే చెప్పుకోవచ్చు. బుల్లితెర… Read More
Tasty Teja: బిగ్బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతోమంది పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అలా ఈ కార్యక్రమం ద్వారా… Read More
వైసీపీ అగ్ర నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోటరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పుంగనూరు సహా.. పీలేరు,… Read More
మెగా కుటుంబంలో భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం.. ఆయన పోటీ చేస్తున్న ఉమ్మడి తూర్పు… Read More