Mega Star Chiranjeevi: ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. గెలుపు కోసం పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటిగా ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓటమి పాలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి కూటమి అభ్యర్ధిగా పిఠాపురం బరిలో ఉన్నారు. పవన్ గెలుపునకు ఎన్డీఏ కూటమి, మెగా ఫ్యామిలీ కష్టపడుతుంటే .. పవన్ ను ఈ సారి కూడా ఓడించే లక్ష్యంతో వైసీపీ వ్యూహాలు అమలు చేస్తొంది.
ఈ క్రమంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలుపునకు అన్నయ్య చిరంజీవి రంగంలోకి దిగడంతో జనసైనికులు, పవన్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ ను గెలిపించాలంటూ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు చిరంజీవి. దాదాపు పదేళ్లుగా ఏ రాజకీయ పార్టీకి బహిరంగంగా మద్దతు తెలియజేయని చిరంజీవి తొలి సారిగా తన తమ్ముడిని గెలిపించాలంటూ పిఠాపురం ఓటర్లను కోరుతూ వీడియో విడుదల చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని వీడియోలో వివరించారు చిరంజీవి. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టిన కళ్యాణ్ ది సేవ చేసే మనస్థత్వమని అన్నారు. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారని, కానీ పవన్ కళ్యాణ్ తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టారన్నారు. సరిహద్దుల దగ్గర ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తంలో సాయం చేయడంతో పాటు.. అనేక మందికి పవన్ కల్యాణ్ చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుందని తెలిపారు.
ఒక రకం గా చెప్పాలేంటే పవన్ సినిమాల్లోకి బలవంతంగా వచ్చాడని కానీ రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంగా వచ్చాడని చెప్పారు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండే తరుక్కుపోతుందని ఆలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుందని అన్నారు. కొడుకు కోసం బాధపడుతున్న తన తల్లికి ఈ అన్నయ్య ఒక మాట చెప్పానని, నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, వాళ్ల బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్దమని తెలిపానన్నారు. ఇది మన భాధ కంటే ఎంతో గొప్పది అని తన తల్లికి చెప్పానని చిరంజీవి అన్నారు.
అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచి వాళ్లతోనే ప్రజాస్వామ్యానికి మరింత నష్టమని.. జనం కోసం జనసైనికుడు అయ్యాడని అన్నారు. బలంగా తాను నమ్మిన సిద్దాంతం కోసం జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన శక్తిశీలి పవన్ అని కీర్తించారు. ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలంటే చట్టసభల్లో ఆయన గొంతు ఉండాలన్నారు. జనమే జయం అని నమ్మే జనసేనాని ఏమి చేయగలరో చూడాలంటే పిఠాపురం ప్రజలు కళ్యాణ్ ను గెలిపించాలన్నారు. మీకు సేవకుడిగా సైనికుడిగా అండగా నిలబడతాడని, మీ కోసం అవసరమైతే కనలబడతాడని, మీకల నిజం చేస్తాడని చిరంజీవి తెలిపారు. గాజు గ్లాసు గుర్తుకు మీ ఓటు వేసి పవన్ ను గెలిపించాలని పిఠాపురం ప్రజలను చిరంజీవి కోరారు.
YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల
జనమే జయం అని నమ్మే జనసేనాని ని గెలిపించండి. pic.twitter.com/zifXEqt30t
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 7, 2024