YS Sharmila: వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, కడప లోక్ సభ అభ్యర్ధి వైఎస్ షర్మిల మరో లేఖ సంధించారు.
నవ సందేహాల పేరుతో షర్మిల ఇప్పటికే జగన్ కు రెండు లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేశారంటూ మొదటి సారి, మధ్య నిషేదంపై రెండో సారి లేఖ రాసిన షర్మిల.. తాజాగా రాష్ట్ర అభివృద్ధి పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ మూడో సారి లేఖ రాశారు.
మూడో లేఖ లోని నవ సందేహాలు ఇవే
- స్మార్ట్ సిటీ, హెరిటేజ్ సిటీ గా కేంద్రం గుర్తించిన రాజధాని అమరావతిని మూడు రాజధానుల వాదనతో ఎందుకు విధ్వంసం చేశారు? పోనీ .. విశాఖలో అయినా ఎందుకు మౌలిక సదుపాయాలు కల్పించలేదు ? కర్నూల్ లో ఏం నిర్మాణాలు జరిపారు?
- రాష్ట్ర విభజన నాడు రెవెన్యూ రాబడులు తెలంగాణకు రూ.51 వేల కోట్లు, ఏపీకి రూ.65 వేల కోట్లు ఉంటే.. తెలంగాణ రాబడులు రూ.1.59 లక్షల కోట్లకు పెరిగాయి.. ఏపీ రూ.1.58 లక్షల కోట్ల మద్య ఉన్న వాస్తవాన్ని కాదనగలరా..?
- రాష్ట్రంలో 5 ఏళ్లలో మౌలిక సదుపాయాల కల్పన ఎందుకు చేయలేదు..?
- ఐటీ రంగాన్ని పూర్తిగా ఎందుకు నిర్లక్ష్యం చేశారు..? ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ రూ.1.81 లక్షల కోట్లు సాధిస్తే .. ఏపి కేవలం రూ.962 కోట్లా..?
- విశాఖ రైల్వే జోన్ ప్రకటన జరిగినా..అమలు కాలేదు అంటే మీరు భూ కేటాయింపు చేయలేదు.. దీనికి నైతిక బాద్యత మీది కాదా..?
- పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేవలం కక్ష్య, నిర్లక్ష్యంతో వదిలేసిన మాట వాస్తవం కాదా..?
- కనిగిరి, ఏర్పాడు లో నిమ్జ్ అనుమతులు వస్తే ..25వేల ఎకరాల భూ కేటాయింపులు జరపని మాట వాస్తవం కాదా..?
- విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్ ను ఎందుకు నిర్లక్ష్యం చేశారు..?
- వెనుక బడిన ప్రాంతాలకు ప్రత్యేకంగా మీరు ఎం చేశారు..? కేంద్రం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీని ఎందుకు సాధించలేకపోయారు..?
Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?