ఏపిలో రాజధాని తరలింపు, సిఆర్ డిఎ చట్టం రద్దుపై స్టేటస్ కోను హైకోర్టు మరో సారి పొడిగించింది. సెప్టెంబర్ 21వ తేదీ వరకూ స్టెటస్ కోను పొడిగిస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లోపుగా కౌంటర్ లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాజధాని పిటిషన్ లపై రోజు వారి విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది. కాగా ఈ అంశంపై హైకోర్టు ఇచ్చిన స్టెటస్ కో ను ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఫలితం లభించలేదు.
విశాఖ నగరంలో ప్రభుత్వ గెస్ట్ హౌస్ నిర్మాణంపై హైకోర్టులో దిక్కార పిటిషన్ దాఖలు అయ్యింది. దీనిపై విచారణ సమయంలో రాష్ట్రపతి భవనం అయిదు ఎకరాల్లో ఉండగా…కాపులుప్పాడులో 30 ఎకరాల్లో ప్రభుత్వ గెస్ట్ హౌస్ ను ఎలా కడతారనీ, ఒక వైపు స్టేటస్ కో అమలులో ఉండగా గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన ఎలా చేస్తారని న్యాయవాది నితీష్ గుప్తా ప్రశ్నించారు. వాదనలు విన్న అనంతరం దీనిపై వచ్చె నెల పదవ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.
తూర్పు గోదావరి జిల్లాలో ఆవ భూములను ఇళ్ల స్థలాలుగా కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు అయిన పిటిషన్ పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. భూముల కొనుగోలులో భారీ ఎత్తున అవినీతి జరిగిందనీ, కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో విచారణ కు ఆదేశించాలనీ పిటిషనర్ ల తరపున న్యాయవాది కోరారు. వరద వచ్చినప్పుడు మునిగిపోయే భూములను ఇళ్ల స్థలాలకు కొనుగోలు చేశారని న్యాయవాది వివరిస్తూ ఆవ భూముల ముంపునకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై హైకోర్టు సిబిఐకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
సిఎం జగన్, మంత్రులు బొత్స, బుగ్గనలకు నోటీసులు
రాజధాని అమరావతి కేసులో ఎపి హైకోర్టు గురువారం సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, మంత్రులు బొత్సా సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. దురుద్దేశపూర్వకంగా రాజధాని తరలింపునకు చట్టాలు చేశారని అమరావతి ప్రాంత రైతులు దాఖలు చేసిన పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. రైతుల తరపున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్నధర్మాసనం సిఎంతో సహా మంత్రులకు నోటీసులు జారీ చేసింది.
రెండు రోజుల్లో రైతులకు కౌలు చెల్లించాలి
అమరావతి ప్రాంతంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం రెండు రోజుల్లో కౌలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం కౌలు చెల్లించకపోవడంపై దాఖలు అయిన పిటిషన్ పై గురువారం విచారణ జరిపిన హైకోర్టు పై విధంగా ఆదేశాలు ఇచ్చింది.
This post was last modified on August 27, 2020 3:08 pm
Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More
తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More
Samyuktha Menon: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More
Karthika Deepam 2 May 10th 2024 Episode: కడియం దీపని కార్తీక్ గురించి అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని చూడగానే… Read More
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు లోక్ సభ ఎన్నికల వేళ… Read More
Aa Okkati Adakku: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కామెడీ హీరోగా నట కిరీటి రాజేంద్రప్రసాద్ తర్వాత అంతటి ఇమేజ్ సంపాదించుకున్న… Read More
Jyothi Rai: జ్యోతి రాయ్.. టీవీ ప్రేక్షకులకు, సోషల్ మీడియా లవర్స్ కు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు… Read More
AP High Court: రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్ పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల… Read More
Kovai Sarala: కోవై సరళ.. సౌత్ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఒక మలయాళీ కుటుంబంలో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More
BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More
Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More
ఏపీలో ప్రదాని నరేంద్రమోడీ ఆవేశంగా ప్రసంగాలు దంచి కొట్టారు. తమది కాని ప్రభుత్వం.. ఎక్కడ ఉన్నా .. ఆయనకు, బీజేపీ… Read More
ఎవరైనా వ్యక్తిని అడాప్ట్ చేసుకోవడం తప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హద్దులు.. పద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More