( న్యూస్ ఆర్బిట్ డెస్క్)
విజయవాడ: శాంతి భద్రతల పేరుతో శాంతియుతంగా చేస్తున్న ఆందోళనలను అణచివేయాలని చూస్తే మరింత రెచ్చిపోతామని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు.విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో వేదిక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అమరావతి పరిరక్షణ సమితి సమావేశంలో చంద్రబాబుతో పాటు వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజా రాజధాని కోసం తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాజధాని కోసం పోరాడుతూ ఇప్పటికే 11 మంది రైతులు గుండెపోటుతో చనిపోయారన్నారు. జెఏసి అడ్వకేట్లలో ఉత్సాహం కనబతుతోందని అన్నారు. సంఘటితంగా ఉద్యమాన్ని కొనసాగించడం ద్వారా ప్రభుత్వం గజగజ వణికే పరిస్థితి కొద్దిరోజుల్లోనే వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని ఇక్కడ నుండి తరలించమని ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకూ ఈ జెఏసి పని చేయాలన్నారు.
తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్మోహనరెడ్డిలు రాష్ట్రంలో పాదయాత్రలు చేసిన విషయాన్నిచంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు వారు ప్రవర్తించిన విధంగా తాను నాడు వ్యవహరించి ఉంటే పాదయాత్ర చేసేవారా అని ప్రశ్నించారు. శాంతి భద్రతల పేరుతో జెఏసి బస్సు యాత్రను అడ్డుకున్నారని విమర్శించారు. జగన్ పిరికి తనంతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నిన్న పోలీసులు మహిళలపై కూడా దారుణంగా ప్రవర్తించారని విమర్శించారు. నేడు ఒంగోలులో కూడా జెఏసి నాయకులను అరెస్టు చేసినట్లు తెలిసిందన్నారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తుంటే ఎక్కడికక్కడ నేతలను ప్రభుత్వం అరెస్టు చేయిస్తోందని విమర్శించారు.
పోలీసులు రాత్రి జెఏసి కార్యాలయానికి ఎందుకు తాళం వేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. జెఏసి నేతలు సాధారణంగా మీటింగ్ పెట్టుకోవడానికి వీలులేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతిలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు అన్ని సిద్ధంగా ఉన్నాయని చంద్రబాబు వివరించారు. ప్రజలు నమ్ముతారని ప్రతి రోజు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ అసత్య ప్రచారం చేయడం కాదు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
జెఏసి కన్వీనర్ శివారెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, టిడిపి నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, కనకమేడల రవీంద్ర, మాగంటి బాబు, కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ, జనసేన, కాంగ్రెస్, బిజెపి నేతలు సమావేశానికి హజరయ్యారు.
This post was last modified on January 9, 2020 1:59 pm
Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,… Read More
Blink OTT: తెలుగులో దసరా మూవీ బ్లాక్ పాస్టర్ హిట్ టాక్ను అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. నాచురల్… Read More
Megalopolis: ఓ సినిమా కోసం డైరెక్టర్లు ఏడాది లేదా రెండు సంవత్సరాలు తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. జక్కన్న లాంటి… Read More
Zee Mahotsavam OTT: తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ప్రేక్షకులకు వినోదం పంచుతూ అగ్రగామిగా నిలుస్తున్న చానల్లో జీ తెలుగు కూడా… Read More
Dakshina Trailer: కబాలి మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి సాయిధన్నిక. ఈ మూవీలో రజనీకాంత్ కూతురుగా యాక్షన్… Read More
Aquaman And The Lost Kingdom OTT: హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్… Read More
Maya Petika OTT: థియేటర్లలో రిలీజ్ అయిన సుమారు 11 నెలల అనంతరం మరో ఓటిటిలోకి వస్తుంది పాయల్ రాజ్… Read More
Allagadda: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడు నిఖిల్ పై హత్యాయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి… Read More
EC: ఏపీలో పోలింగ్ ముగిసినప్పటికీ పలు చోట్ల హింసాత్మక ఘటనలు చేలరేగాయి. తాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల, నరసరావుపేట ప్రాంతాల్లో ఇప్పటికీ… Read More
Comedian Srinu: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కమెడియన్స్ మరియు హీరో అదే విధంగా హీరోయిన్ కూడా అయ్యారు. అలా… Read More
Faima: జబర్దస్త్ కమెడియన్ ఫైమా మనందరికీ సుపరిచితమే. మొదట ఈ బ్యూటీ ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయినా పటాస్… Read More
Kajal Agarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బ్యూటీ ఇప్పటికే అనేక మంది స్టార్… Read More
OTT: 30 వెడ్స్ 21 అనే యూట్యూబ్ సిరీస్ తో పాపులర్ అయిన చైతన్య రావ్ మనందరికీ సుపరిచితమే. ఈయన… Read More
Sri Sathya: ప్రెసెంట్ ఉన్న సినీ తారలు కారులు కొనుగోలు చేయడంపై బిజీ అయిపోయారు. చిన్న యాక్టర్ పెద్ద యాక్టర్… Read More
NTR: ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో… Read More