YS Jagan: జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ ఎప్పటి నుండో ఉంది. కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత వరకూ ఆ దిశగా అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో టికెట్ లు కేటాయించలేదు. కానీ మొదటి సారి ఏపీ రాజకీయాల్లో బీసీలకు అత్యధిక స్థానాలు దక్కుతున్నాయి. అధికార వైఎస్ఆర్ సీపీ రాబోయే ఎన్నికలకు అభ్యర్ధుల ఎంపికలో బీసీలకు పెద్ద వేస్తుంది.
అసెంబ్లీ స్థానాల విషయంలో సుమారు 50 శాతం బీసీ నేతలకు టికెట్ లు ఇస్తుండగా, లోక్ సభ స్థానాల విషయానికి వస్తే 50 శాతం పైగానే ఇస్తున్నట్లు కనబడుతోంది. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎటువంటి మొహమాటాలకు పోకుండా వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అభ్యర్ధుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో సొంత సామాజికవర్గం, సొంత మనుషులు, సీనియర్ లు అనేవి ఏవీ పట్టించుకోకుండా సర్వే రిపోర్టులు ఆధారంగా గెలుపు అవకాశం లేని వారిని పక్కన పెట్టేస్తున్నారు.
టికెట్లు దక్కని వారికి రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు ఇస్తామని పార్టీ హైకమాండ్ హామీలు ఇస్తొంది. కొందరు పార్టీ అధిష్టానం సూచనల మేరకు మెత్తబడుతున్నా కొందరు పక్క చూపులు చూస్తున్నారు. పార్టీ వీడుతున్న కొందరి విషయాన్ని లైట్ గా తీసుకుంటోంది. ఇప్పటి వరకూ 50 అసెంబ్లీ స్థానాలకు వైసీపీ సమన్వయకర్తల (ఇన్ చార్జి)లను ప్రకటించగా, ఎస్సీలు 14, ఎస్టీలు 3, బీసీలు 16, మైనార్టీలు 4, ఇతర వర్గాలు 13(రెడ్డి, కాపు, వైశ్య) మంది ఉన్నారు.
గతంలో అగ్రవర్ణాలకు చెందిన అభ్యర్ధులను పోటీ పెట్టిన ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఇప్పుడు అయిదు స్థానాల్లో బీసీ, రెండు స్థానాల్లో మైనార్టీ వర్గాలకు చెందిన వారిని ఇన్ చార్జిలుగా నియమించింది వైసీపీ. ఆరు శాసనసభ స్థానాలకు మహిళలను, 18 స్థానాల్లో యువతకు ఇన్ చార్జిలుగా నియమించింది పార్టీ. ఇప్పటి వరకూ ప్రకటించిన 50 అసెంబ్లీ స్థానాల్లో రిజర్వుడ్ స్థానాలు 17 తీసివేస్తే 33 స్థానాలకు 16 స్థానాలను బీసీలకు అవకాశం కల్పించింది.
లోక్ సభ స్థానాల విషయానికి వస్తే ఇప్పటి వరకూ 9 స్థానాలకు ఇన్ చార్జిలను నియమించగా, బీసీలకు 6, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక ఒసీ ఉన్నారు. అభ్యర్ధుల ఎంపిక విషయంలో సీఎం జగన్ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలు సీనియర్లు, రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
YSRCP: 21 మందితో వైసీపీ మూడో జాబితా విడుదల
Aa Okkati Adakku: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కామెడీ హీరోగా నట కిరీటి రాజేంద్రప్రసాద్ తర్వాత అంతటి ఇమేజ్ సంపాదించుకున్న… Read More
Jyothi Rai: జ్యోతి రాయ్.. టీవీ ప్రేక్షకులకు, సోషల్ మీడియా లవర్స్ కు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు… Read More
AP High Court: రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్ పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల… Read More
Kovai Sarala: కోవై సరళ.. సౌత్ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఒక మలయాళీ కుటుంబంలో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More
BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More
Nuvvu Nenu Prema:అరవింద ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని విక్కీ పద్మావతి ఇద్దరు బాధపడుతూ ఉంటారు విక్కీ అక్క ఇలా వెళ్ళిపోతుందని… Read More
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు గులాబీ పార్టీకి చాలా కీలకం గా మారాయి. ఎలాగైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో… Read More
ఏపీలో ప్రదాని నరేంద్రమోడీ ఆవేశంగా ప్రసంగాలు దంచి కొట్టారు. తమది కాని ప్రభుత్వం.. ఎక్కడ ఉన్నా .. ఆయనకు, బీజేపీ… Read More
ఎవరైనా వ్యక్తిని అడాప్ట్ చేసుకోవడం తప్పుకాదు. కానీ, దీనికి కూడా కొన్ని హద్దులు.. పద్దులు ఉంటాయి. వాటిని బేరీజు వేసుకోకుండా..… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది.… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరో నాలుగు రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది.… Read More
May 10: Daily Horoscope in Telugu మే 10 – వైశాఖ మాసం – శుక్రవారం - రోజు… Read More
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More