YSRCP: అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులు చేర్పుల్లో భాగంగా వైఎస్ఆర్ సీపీ ఇవేళ మూడో జాబితాను విడుదల చేసింది. ఆరు పార్లమెంట్ స్థానాలకు, 15 అసెంబ్లీ స్థానాలకు సమన్వయకర్తల పేర్లను పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం పెడన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జోగి రమేష్ కు పెనమలూరు అసెంబ్లీ ఇన్ చార్జిగా నియమించింది. ప్రస్తుతం పెనమలూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి కొలుసు పార్ధసారధిని పార్టీ పక్కన పెట్టింది. దీంతో పార్ధసారధి టీడీపీలో చేరేందుకు సన్నద్దం అయ్యారు.
శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ విజయకు ఇచ్చాపురం అసెంబ్లీ ఇన్ చార్జిగా నియమించిన వైసీపీ .. ఆమె స్థానంలో జడ్పీ చైర్మన్ గా ఇచ్చాపురం జడ్పీటీసీ ఉప్పాల నారాయణమ్మను నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. నిన్ననే టీడీపీకి రాజీనామా చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నానిని లోక్ సభ టికెట్ కన్ఫర్మ్ చేసింది వైసీపీ. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మూడో జాబితా వివరాలను మీడియాకు తెలిపారు.
నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలు వీరే
- శ్రీకాకుళం (ఎంపీ) – పేరాడ తిలక్
- విశాఖపట్నంల (ఎంపీ) – బొత్స ఝాన్సీ
- ఏలూరు (ఎంపీ) – కారుమూరి సునీల్ కుమార్ యాదవ్
- విజయవాడ (ఎంపీ) – కేశినేని నాని
- కర్నూల్ (ఎంపీ) – గుమ్మనూరు జయరామ్
- తిరుపతి (ఎంపీ – కోనేటి ఆదిమూలం
- ఇచ్చాపురం – విజయ( శ్రీకాకుళం జెడ్పీ చైర్మన్)
- టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్
- చింతలపూడి – కంభం విజయరాజు
- రాయదుర్గం – మెట్టు గోవింద్ రెడ్డి
- దర్శి – బోచేపల్లి శివప్రసాద్ రెడ్డి
- పూతలపట్టు – మౌతి రేవుల సునీల్ కుమార్.
- చిత్తూరు – విజయానంద్ రెడ్డి
- మదనపల్లి – అహ్మద్
- రాజంపేట – ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి.
- ఆలూరు – విరూపాక్ష
- కొడుమూరు – డాక్టర్ సతీష్
- గూడూరు – మురళి
- సత్యవేడు – గురుమూర్తి
- పెనమలూరు – జోగి రమేష్
- పెడన – ఉప్పల రాము
YSRCP: వైసీపీలో చేరిన తిరువూరు మాజీ ఎమ్మెల్యే నలగట్ల స్వామి దాసు