YSRCP: రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధులను వైసీపీ ఖరారు చేసింది. రాజ్యసభ బరిలోకి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సోదరుడు రఘునాథరెడ్డి పేర్లను సీఎం వైఎస్ జగన్ ఖరారు చేశారు.
ప్రస్తుతం ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలు తామే దక్కించుకునేలా వైసీపీ చర్యలు తీసుకుంటోంది. త్వరలో మాక్ పోలింగ్ కూడా నిర్వహించనున్నారు. కాగా, ఈ రోజు నుండి 15వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు. అయితే ఈ నెల 12వ తేదీన వైసీపీ ముగ్గురు అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ నెల 27వ తేదీన మూడు రాజ్యసభ రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. కౌంటింగ్ కూడా అదే రోజు జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు.
ఈ సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసి వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి లు కృతజ్ఞతలు తలిపారు. ముగ్గురు రాజ్యసభ అభ్యర్ధులను సీఎం జగన్ అబినంధించారు.
వైవీ సుబ్బారెడ్డికి గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ సిట్టింగ్ స్థానాన్ని వదులుకున్న సందర్భంలోనే రాజ్యసభ హామీ ఇచ్చారు వైఎస్ జగన్. అయితే రెండు పర్యాయాలు టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగారు. 2019 ఎన్నికలకు ముందు వైవీకి ఇచ్చిన హామీ ఇప్పుడు నెరవేరుతోంది. పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గొల్ల బాబూరావు స్థానంలో వేరే నేతకు పార్టీ ఇన్ చార్జి గా నియమించిన నేపథ్యంలో ఆయనకు రాజ్యసభకు అవకాశం కల్పించారు.
రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి సోదరుడైన రఘునాథరెడ్డి తన 20 ఏళ్ల వయస్సులోనే బెంగళూరు కేంద్రంగా నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. 2006లో ఎంఆర్ కేఆర్ కన్ట్సక్షన్స్ డైరెక్టర్ గా నియమితులైయ్యారు. ప్రస్తుతం వ్యాపార రంగంలో కొనసాగుతున్నారు. టీడీపీ నుండి ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోతే వైసీపీ ముగ్గురు అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నిక అవుతారు.
Breaking: జగన్ పై హత్యాయత్నం కేసు .. కోడికత్తి శ్రీనుకు షరతులతో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More
Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More
Chhattisgarh: చత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా… Read More
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే… Read More
Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సీరియల్లో… Read More
EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More
Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More
Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More
Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More
Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More
Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More
తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More
Samyuktha Menon: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More
Karthika Deepam 2 May 10th 2024 Episode: కడియం దీపని కార్తీక్ గురించి అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని చూడగానే… Read More
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు లోక్ సభ ఎన్నికల వేళ… Read More