Gannavaram: కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రీసెంట్ గా వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించిన కేసిడీసీ మాజీ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు ఇవేళ హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇటీవల యార్లగడ్డ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలోనే చంద్రబాబు అపాయింట్మెంట్ కోరుతున్నానని, గన్నవరం అభ్యర్ధిత్వం ఖరారు చేస్తే టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తానని తెలిపారు. ప్రస్తుతం గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ధీటైన అభ్యర్ధి టీడీపీలో లేకపోవడంతో యార్లగడ్డ చేరికను స్వాగతిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణాజిల్లాలో కొనసాగుతుండగా, 22 వతేదీ గన్నవరంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ తరుణంలోనే యార్లగడ్డ వెంకట్రావు ఇవేళ చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గన్నవరం లో జరిగే బహిరంగ సభలోనే యార్లగడ్డ వెంకట్రావు లోకేష్ సమక్షంలో టీడీపీ లో చేరనున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తొంది. అయితే యార్లగడ్డ తో పాటు వైసీపీ నుండి ఎవరెవరు టీడీపీలో చేరతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. యార్లగడ్డ టీడీపీలో చేరుతున్న నేపథ్యంలో విజయవాడ, గన్నవరం నియోజకవర్గాల్లో టీడీపీ నుండి పలువురు నేతలను వైసీపీలో చేర్చుకుని కౌంటర్ ఇవ్వాలన్న రీతిలో ఆ పార్టీ ఉంది.
యార్లగడ్డ వెంకట్రావు గత ఎన్నికల్లో గన్నవరం నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి నాటి టీడీపీ అభ్యర్ధి వల్లభనేని వంశీ పై కేవలం 990 ఓట్ల తేడాతో పరాజయం పాలైయ్యారు. టీడీపీ నుండి గెలిచిన వల్లభనేని వంశీ ఆ తర్వాత వైసీపీకి దగ్గర కావడంతో నియోజకవర్గంలో వంశీ వర్సెస్ యార్లగడ్డ గా మారింది. ఆ నేపథ్యంలో తొలుత యార్లగడ్డ కు కేడీసీసీ చైర్మన్ గా అవకాశం కల్పించారు సీఎం జగన్. అయితే పలు జిల్లాల సహకార బ్యాంక్ చైర్మన్ ల పదవీ కాలం పూర్తి అయినా మరో సారి ఎక్స్ టెన్షన్ ఇచ్చి తనకు మాత్రం ఆ అవకాశం ఇవ్వకపోవడంతో యార్లగడ్డ అసంతృప్తికి గురి అయ్యారు. దానికి తోడు నియోజకవర్గంలో వంశీ పెత్తనం కొనసాగుతుండటంతో తన వర్గీయులకు అన్యాయం జరుగుతుండటంతో ఏమి చేయలేని పరిస్థితిలో కొద్దిరోజులు సైలెంట్ గా ఉన్నారు. నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు.
మరో పది నెలల్లో ఎన్నికలు రానుండటంతో యార్లగడ్డ యాక్టివ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుండి పోటీ చేస్తానని చెప్పారు. సన్నిహితులతో మంతనాలు, ఆత్మీయ సమావేశాల్లో వారి అభిప్రాయాలను తీసుకుని పార్టీ వీడేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే కొందరు స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేయాలని సూచించగా, మరి కొందరు ప్రతిపక్ష టీడీపీలో చేరాలని సూచించారు. మెజార్టీ సన్నిహితుల అభిప్రాయం మేరకు టీడీపీలో చేరేందుకు యార్లగడ్డ నిర్ణయం తీసుకున్నారు. మరో పక్క ఇప్పటి వరకూ గన్నవరం నియోజకవర్గంలో వంశీ కి వ్యతిరేకంగా యార్లగడ్డకు అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన సీనియర్ నేత డాక్టర్ దుట్టా రామచంద్రరావు ఈ పరిణామాల క్రమంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. దుట్టా వైసీపీలోనే కొనసాగుతారా లేక యార్లగడ్డ కు మద్దతు తెలియజేస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.
YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More
Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More
AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More
Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More
Chhattisgarh: చత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా… Read More
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే… Read More
Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సీరియల్లో… Read More
EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More
Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More
Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More
Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More
Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More
Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More
తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More
Samyuktha Menon: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More