Aravind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింగ్ కేజ్రీవాల్ కు రెండు రోజుల క్రితం ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. సమన్ల ప్రకారం ఇవేళ (21వ తేదీ) ఈడీ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ హజరు కావాల్సి ఉంది. కానీ అరవింద్ కేజ్రీవాల్ నేటి ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. ఈ నెల 30వ తేదీ వరకూ పంజాబ్ లోని హోషియార్ పూర్ జిల్లాలోని అనంద్ గఢ్ గ్రామంలో జరిగే విపాసన కోర్సుకు ఆయన (సీఎం) హజరు కానున్నట్లు ఆప్ జాతీయ కన్వీనర్ తెలిపారు. కేజ్రీవాల్ పది రోజుల పాటు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటారని వెల్లడించారు.
నిజానికి ఈ విపాసన సెషన్ లో పాల్గొనేందుకు కేజ్రీవాల్ మంగళవారమే బయలుదేరాల్సి ఉండగా, ఇండియా కూటమి సమావేశం నేపథ్యంలో తన షెడ్యుల్ ను వాయిదా వేసుకున్నారని సమచారం. అంతకు ముందు కేజ్రీవాల్ కు ఈడీ నవంబర్ 2వ తేదీన విచారణకు హజరుకావాలని సమన్లు జారీ చేసింది. అయితే ఆ సమన్లు చట్టవిరుద్దంగా ఉన్నాయని పేర్కొంటూ ఆయన విచారణకు వెళ్లలేదు. తనకు సమన్లు వచ్చిన రోజే కేజ్రీవాల్ అరెస్టు కావొచ్చు అనే ఊహాగానాలు ఊపందుకోవడంతో ఈ సమన్ల వెనుక రాజకీయ ప్రేరణ ఉందని, వీటిని ఉపసంహరించుకోవాలని కూడా కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈడీ రెండో సారి ఆయనకు సమన్లు జారీ చేయడం జరిగింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ ఏడాది ఏప్రిల్ 16న కేజ్రీవాల్ ను సీబీఐ తొమ్మిది గంటలకుపైగా విచారించింది. ఈ కేసులో ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్ లను ఇప్పటికే అరెస్టు చేయగా, వారు ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అక్టోబర్ 4న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను ఈడీ అరెస్టు చేసింది.అదే రోజు ఆయన నివాసం సహా సంబంధించిన ఆస్తులపై సోదాలు జరిపింది. ఢిల్లీ డిప్యూటి సీఎం హోదాలో ఉన్న మనీశ్ సిసోడియా ను కూడా ఈడీ అరెస్టు చేసింది. దీంతో ఆయన అరెస్టు అయిన రెండు రోజులకు తన పదవికి రాజీనామా చేశారు.
ఢిల్లీ సర్కార్ 2022 లో నూతన మద్యం పాలసీని తీసుకువచ్చింది. ఈ విధానంలో భాగంగా కోట్లాది రూపాయలు చేతులు మరాయని ఆరోపణలు వచ్చాయి. ఆ డబ్బును గోవా సహా ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఫండ్ కోసం వినియోగించారని ఈడీ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను కేజ్రీవాల్ సర్కార్, ఆప్ ఖండిస్తొంది. అయితే ..విచారణకు అరవింద్ కేజ్రీవాల్ డుమ్మా కొట్టిన నేపథ్యంలో ఈడీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
AP Election 2024: జగన్ ఊహించినట్లుగానే .. ఏపీలో ఎన్నికలకు మూహూర్తం ఫిక్స్ ..ఢిల్లీ నుండి సంకేతాలు..?
YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More
Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More
AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More
Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More
Chhattisgarh: చత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా… Read More
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే… Read More
Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సీరియల్లో… Read More
EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More
Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More
Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More
Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More
Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More
Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More
తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More
Samyuktha Menon: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More