YSRCP: వైఎస్ఆర్ సీపీ పార్లమెంట్, అసెంబ్లీ ఇన్ చార్జిల మార్పులు, చేర్పులపై సీఎం జగన్ కసరత్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నాలుగు విడతలుగా 59 అసెంబ్లీ, తొమ్మిది ఎంపీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ.. త్వరలో అయిదవ జాబితా ప్రకటనకు సిద్దం అవుతోంది. మరో రెండు మూడు రోజుల్లో ఇన్ చార్జిల జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తొంది.
ఈ క్రమంలో తాడేపల్లి సీఎంవో నుండి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపు రాగా, వారు సీఎం క్యాంప్ ఆఫీసుకు క్యూ కట్టారు. ఈ సారి జాబితాలో ఎంత మంది టికెట్లు గల్లంతు అవుతాయి, ఎంత మందికి స్థాన చలనం కల్గిస్తారనే దానిపై నేతల్లో ఆందోళన నెలకొంది. కాగా తాడేపల్లి చేరుకున్న వైసీపీ నేతలతో జగన్ చర్చిస్తున్నారు. ముందుగా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డిలు నేతలతో చర్చలు జరుపుతున్నారు.
మంత్రులు గుడివాడ అమరనాథ్, ఉషశ్రీ చరణ్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్, రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు తదితరులు తాడేపల్లికి చేరుకోగా.. సజ్జల, ధనుంజయరెడ్డి చర్చలు జరిపారు.
మరో పక్క సీఎం జగన్ ఆదేశాలతో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నేతలకు అందుబాటులో ఉన్నారు. విజయవాడలోని ఓ హటల్ లో బాలినేని బస చేయగా, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన వద్దకు వెళ్లి ఒంగోలు లోక్ సభ అభ్యర్ధి ఎంపిక విషయంపై చర్చించినట్లు తెలుస్తొంది.
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించడంతో పాటు ఒంగోలు లోక్ సభ ఇన్ చార్జి గా ప్రకటించే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా బాలినేనిని గిద్దలూరు నుండి పోటీ చేయాలని పార్టీ పెద్దలు సూచించినట్లుగా తెలుస్తొంది. ఒకటి రెండు రోజుల్లోనే ఈ నియోజకవర్గాలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
AP Jobs: ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More
Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More
AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More
Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More
Chhattisgarh: చత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా… Read More
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే… Read More
Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సీరియల్లో… Read More
EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More
Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More
Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More
Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More
Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More
Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More
తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More
Samyuktha Menon: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More