పబ్ జి ఆట:
దక్షిణ కొరియా కి చెందిన పబ్జి కార్పొరేషన్, ఈ గేమింగ్ యాప్ ను 2017 లో విడుదల చేసింది. మొబైల్ లో యాప్ ను ఇన్స్టాల్ చేసి లాగిన్ అయ్యాక ఫేస్బుక్ లేదా మరేదైనా సోషల్ అకౌంట్తో లాగిన్ అయ్యాక ఆట మొదలుపెట్టవచ్చు. 8X8 కిలోమీటర్ల యుద్ధ భూమిలో పలు భవనాలు, శిథిలాలు, వాహనాలు, ఆయుధాలు, ఇతర ప్లేయర్స్ ఉంటారు. విమానం నుంచి ప్యారాషూట్ ద్వారా యుద్ధభూమిలో అడుగుపెట్టిన యువత ఆయుధాల్ని, మెడికల్ కిట్స్ ను సేకరిస్తూ అవతలి వారిని చంపుతూ తాము చావకుండా రక్షించుకోవడమే ఈ ఆట. గేమ్లో రెడ్ జోన్, నీలి మేఘాలు తరుముకుంటూ వస్తాయి.రెడ్ జోన్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి. గేమ్లో సూచించిన సర్కిల్ లోనే గేమ్ ఆడాలి.గేమ్లో సర్కిల్ చిన్నదవుతూ మిగిలిన ప్రత్యర్థులను దగ్గర చేస్తూ ఉంటుంది. దీంతో గేమ్ కష్టతరంగా మారుతుంది. ఈ ఆటను ఒంటరిగా అయినా, ఒక టీం ల అయినా ఆడవచ్చు.ముక్కూమొహం తెలియకున్నా, ఆన్లైన్లో గేమ్ ఆడుతూ, వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ శత్రువులను చంపే వెసులుబాటు ఈ యాప్లో ఉంటుంది. గేమ్ లో గరిష్టంగా వంద మంది అడగలుగుతారు. యుద్ధంలా సాగే ఈ క్రీడలో గాయపడితే మెడికల్ కిట్లు, అవతలి వారిని చంపడానికి ఆయుధాలు ఉంటాయి. గెలిస్తే చికెన్ డిన్నర్లు కూడా ఉంటాయి.
పబ్ జి వ్యసనం:
ఎవరి ఫోన్లో చూసినా ఈ గేమే కనిపించేది. ఈ ఆటకు పిల్లలు, యువత వ్యసనపరులు అయిపోయారు. ఆన్లైన్ పబ్జీ గేమ్ ఉచ్చులో పడి పబ్జీ మొబైల్ అకౌంట్ను అప్గ్రేడ్ చేసుకునేందుకు రూ.16 లక్షలు ఖర్చు చేశాడు ఒక్క బాలుడు. అదే తరహాలో పబ్జీ ఆడడం కోసం రెండు నెలల్లో తన తాత పెన్షన్ ఖాతా ద్వారా అకౌంటు నుంచి 30 లావాదేవీల రూపంలో రూ.2 లక్షలు కాజేశాడు 15 సంవత్సరాల బాలుడు. ఇది ఇలా ఉంటె పబ్ జి పిచ్చి తో ప్రాణాలని సైతం పోగొట్టుకున్నారు కొంత మంది, ముంబైలో ఓ యువకుడు పబ్జీ గేమ్ ఆడేందుకు మొబైల్ కొనివ్వాలని పేరెంట్స్ని అడిగాడు. కానీ వారు ఒప్పుకోకపోవడంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కాశ్మీర్లో పబ్జీకి బానిసైన ఓ ఫిటెనెస్ ట్రైనర్, గేమ్లో ఓటమితో మానసికంగా కుంగిపోయాడు. కొన్ని రోజుల తర్వాత పిచ్చోడిగా మారి. తనను తాను తీవ్రంగా గాయపరచుకున్నాడు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ గేమ్ కు అడిక్ట్ అయిపోయిన ఒక యువకుడు, పబ్జీ ఆడేందుకు ఫోన్ బ్యాటరీ అయిపోవడం, ఛార్జర్ దొరక్క లేదన్న కోపంతో సొంత బావపైనే కత్తితో దాడికి దిగబడ్డాడు. మరొకచోట ఓ యువకుడు పబ్జీ గేమ్లో మునిగిపోయి దాహమేస్తే నీళ్లు అనుకొని యాసిడ్ తాగేశాడు. 18 ఏండ్ల టీనేజ్ కుర్రాడు, 12 సంవత్సరాల పిల్లవాడు పబ్ జి గేమ్ ఆడటానికి, తల్లితండ్రులు మంచి మొబైల్స్ కొన్ని ఇవ్వలేదు అన్ని మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారు. పబ్ జీ ఆడనివ్వడం లేదని ఒక యువకుడు ఏకంగా తన తండ్రినే హత్య చేశాడు. తనకు ఎదురు చెబుతున్నాడనే అక్కసుతో ఆ యువకుడు.. కత్తి తీసుకుని తలపై ఒక్క వేటు వేయడంతో ఆ తండ్రి మరణించాడు. టైమ్పాస్ కోసం ఆడే.. ఆన్లైన్ గేమ్స్ వ్యసనంగా మారి, లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నారు యువత, పిల్లలు. ఆన్లైన్ గేమ్లకు అడిక్ట్ అవడం, గేమ్ ఆడుతున్న సమయంలో ఎవరినీ పట్టించుకోకపోవడం. మరీ ఈ పబ్జీ గేమ్ అయితే, గేమ్ నుంచి పక్కకు చూస్తే గేమ్లో శత్రువులు మన మీద దాడి చేసి చంపేస్తారనే భయంతో పరిసరాలను సైతం మరిచిపోయి ఆటలో మునిగిపోయారు. ఎంతా అడిక్ట్ అంటే ఫోన్ చేసినా ఎత్తరు, పిలిచినా పట్టించుకోరు. బలవంతంగా మాట్లడిస్తే అసహనం ప్రదర్శిస్తారు. కొన్ని సందర్భాల్లో అయితే కోపంలో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తించారు.ఆట ఆడలేకపోతున్నాం అన్నే కోపం తో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కొంత మంది అయితే, కుటుంబ సభ్యుల ప్రాణాలు తీసిన వాళ్ళు మరికొంతమంది.
పబ్ జి బ్యాన్:
ఇటీవల కాలం లో యూజర్ల డేటా, సెక్యూరిటీ ఆందోళనల కారణంగా భారత ప్రభుత్వం మొత్తం 118 చైనా యాప్స్పై నిషేధం విధించింది. వాటిలో పబ్జీ మొబైల్, పబ్జీ మొబైల్ లైట్ యాప్స్ ని కూడా కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఈ ఆన్లైన్ గేమింగ్ యాప్ దక్షిణ కొరియాది అయినప్పటికీ చైనా కి సంబందించిన సంస్థ దీనిలో భాగం అవడమే ఈ గేమ్ బ్యాన్ చేయడానికి కారణం అయింది. అక్టోబర్ 30 న ఇండియాలో పబ్ జి కి సంబందించిన పూర్తి సేవల్ని నిలిపివేసింది,టెన్సెంట్ గేమ్స్ . అయితే అంతకుముందే దేశం లోని కొన్ని రాష్ట్రాలు, ఈ గేమ్ వల్ల పిల్లలు, యువత ఎక్కువ ప్రభావితం అవుతున్నారని, వారు చెడు దారిలో వెళ్తున్నారని మానసిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలోనే ఈ గేమ్ను నిషేధించాయి.
పబ్ జి బ్యాక్:
అయితే మళ్ళీ పబ్ జి గేమ్ భారత్ దేశం లో అందుబాటులోకి రానున్నది. భారతదెశ యూజర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త వెర్షన్గా ‘పబ్జీ మొబైల్ ఇండియా’ పేరుతో త్వరలోనే లాంచ్ చేయనున్నామని పబ్జీ కార్పొరేషన్ మాతృ సంస్థ క్రాఫ్టన్ తెలిపింది.ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సురక్షితమైన ఆరోగ్యకరమైన కొత్త వెర్షన్ గేమ్ప్లేను వినియోగదారులకు అందిస్తామని కంపెనీ తెలిపింది. డేటాను సురక్షితంగా ఉంచారని నిర్ధారించుకోవడానికి భారతీయ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని నిల్వ చేసే నిల్వ వ్యవస్థలపై క్రమం తప్పకుండా ఆడిట్లు మరియు ధృవీకరణలు ఉంటాయని ఈ గేమింగ్ కార్పొరేషన్ పేర్కొంది. డెవలపర్లు వారు ఆటలోని కంటెంట్ను మెరుగుపరుస్తారని మరియు “స్థానిక అవసరాలను ప్రతిబింబించేలా” అనుకూలీకరించారని కూడా పంచుకున్నారు. ఇది యువ ఆటగాళ్లకు ఆట సమయాన్ని పరిమితం చేయడానికి ఒక లక్షణాన్ని కూడా జోడిస్తుంది. గేమ్ డెవలప్మెంట్, వ్యాపార విస్తరణకు సంబంధించి దేశీయంగా 100 మందికి పైగా ఉద్యోగులను కూడా నియమించుకోనుంది. అయితే గేమ్ రిలీజ్ డేట్ ఎపుడు అనేది కంపెనీ చెప్పలేదు.
ఎంతో మంది పిల్లలు, యువత జీవితాలని నాశనం చేసిన పబ్ జి ఆట, మళ్ళీ ఇండియా లో ప్రవేశ పెడ్తున్న సమయం లో, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాల్ని తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది
This post was last modified on November 14, 2020 10:19 am
YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More
Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More
AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More
Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More
Chhattisgarh: చత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా… Read More
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే… Read More
Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సీరియల్లో… Read More
EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More
Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More
Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More
Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More
Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More
Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More
తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More
Samyuktha Menon: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More