ప్రధానంగా కొత్త రెవెన్యూ చట్టం కేంద్రంగా అయితే, విమర్శల పరపంర కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాకముందు, గడిచిన 70 ఏళ్ళు నీళ్లు-నిధులు-కరెంట్ లేక ప్రజలు పడ్డ బాధలు మనం చూశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రజలు ఆశించిన పాలన జరగలేదని తలసాని ఆరోపించారు. బ్రిటిష్-నైజాం కాలంలో ఉన్న రెవెన్యూ చట్టం వల్ల ప్రజల్లో ఎప్పుడూ ఏదో సమస్య ఉండేదని తెలిపారు. 7 దశాబ్దాల కాలం నుంచి వస్తున్న బాధ కొత్త రెవెన్యూ చట్టంతో తొలిగిపోతుందని ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
ప్రభుత్వాలు-నాయకులు మారినా యంత్రాంగం మాత్రమే మారదని అది నాయకుల చిత్తశుద్ధిని బట్టి ఉంటుందని తలసాని చెప్పుకొచ్చారు. “దేశ రాష్ట్ర రాజకీయ అంచనాలను తారుమారు చేసి రెండోసారి అధికారం తెచ్చిన ఘనత కేసీఆర్ది. కొత్త రెవెన్యూ చట్టం గొప్పగా ఉంది కాబట్టే ప్రతిపక్షాలు సైతం ఒప్పుకోక తప్పలేదు. జీవో 58 తెచ్చి గ్రేటర్ ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం తెలంగాణ సీఎం కేసీఆర్ చూపించారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో తెలంగాణ ప్రజలకు గ్రామ స్వరాజ్యం తెచ్చిన ఘనత దేశంలో ఒక్క కేసీఆర్ కు మాత్రమే దక్కుతుంది. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉండటం హైదరాబాద్ ప్రజల అదృష్టం. హైదరాబాద్లో మెట్రో రైల్కు కాంగ్రెస్ అనుమతి ఇచ్చినా దాన్ని పూర్తి చేసిన ఘనత టీఆరెస్ ప్రభుత్వానిది. సైబరాబాద్లో ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ చుస్తే స్విట్జర్ ల్యాండ్ లో ఉన్నట్లు అనిపిస్తుంది.“ అని తలసాని చెప్పుకొచ్చారు.
కోవిడ్ సమయంలో గాంధీ హాస్పిటల్ తప్ప వేరే హాస్పిటల్ లేదని చెప్పిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ విషయాన్ని పక్కన పెట్టి గాంధీ ఆస్పత్రిపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. “ఆరోగ్య శ్రీ ముందు ఆయుష్మాన్ భారత్ పనికిరాదు. కేంద్ర బృందాలు సైతం కరొనా విషయంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్నాయి. పీపీఈ కిట్లు దాపెట్టుకున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలు వింటే నోవ్వొస్తుంది.“ అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కాళేశ్వరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే సినిమా అన్నారు కానీ ఇవ్వాళ సినిమా నిజం అయింది అని తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. రెవెన్యూ చట్టం ద్వారా చరిత్రలో కేసీఆర్ పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది అని తలసాని చెప్పారు. “ప్రతి యుగానికి ఒకరు పుడతారు అతనే యుగపురుషుడు అవుతారు..ఆయనే కేసీఆర్.“ అని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పుకొచ్చారు.
This post was last modified on September 13, 2020 2:43 pm
Karthika Deepam 2 April 27th 2024 Episode: దీప సాక్ష్యం చెప్పడంతో పోలీసులు జ్యోత్స్న అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు.… Read More
EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీకి సంబంధించి ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.… Read More
Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈ ఆరడుగుల అందాన్ని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన… Read More
Manipur: మణిపూర్ లో మరో సారి హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలోని నారసేన ప్రాంతంలో భద్రతా బలగాలపై సాయుధ మిలిటెంట్లు… Read More
Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైస్ చిత్రం… Read More
Jagadhatri April 27 2024 Episode 216: కేదార్ భయపడిపోయి జగదాత్రి చెయ్యి తన నెత్తి నుంచి తీసేస్తాడు. ఎందుకు… Read More
Paluke Bangaramayenaa April 27 2024 Episode 213: ఎలుక ఉందని భయపడిపోయిన స్వర పరిగెత్తుకొచ్చి అభి పక్కన బెడ్… Read More
Brahmamudi April 27 2024 Episode 395: దుగ్గిరాల ఇంట్లో రోజుకో రచ్చ జరుగుతూనే ఉంది. నిన్న కావ్య మీడియా… Read More
Naga Panchami: గరుడ రాజు తన గరుడ శక్తిని ఖరాలికి ఆవాహన చేస్తాడు. కరాలి ధన్యోస్మి గరుడ రాజా అంటుంది.… Read More
Mamagaru: అవును వదిన ఇక్కడ ఉంటున్నామనే కానీ తింటే తినబుద్ది అవదు పడుకుంటే పడకో బుద్ధి కాదు అక్కడ ఉంటే… Read More
Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతి గురించి విక్కి ఆలోచిస్తూ ఉంటాడు. అటుగా వచ్చిన ఆర్య రేపు… Read More
Krishna Mukunda Murari April 27 2024 Episode 456: కృష్ణ హాస్పిటల్ కి వెళ్లి నిజం తెలుసుకోవాలి అని… Read More
April 27: Daily Horoscope in Telugu ఏప్రిల్ 27 – చైత్ర మాసం – శనివారం - రోజు… Read More
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో 'పుష్ప 2' మూవీ తెరకెక్కుతోంది. 2021లో వచ్చిన… Read More
Lok sabha Elections 2024: లోక్సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన… Read More