Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం “పుష్ప 2” సినిమా చేస్తున్నారు. ఇటీవల రామోజీ ఫిలిం సిటీ లో బిగ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతూ ఉంది. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా అల్లు అర్జున్ వెన్ను నొప్పికి గురి కావడం జరిగింది అంట. దీంతో “పుష్ప 2” షూటింగ్ ఆపేయడం జరిగిందంట. ఈ క్రమంలో హాస్పిటల్లో జాయిన్ అవ్వగా వైద్యులు.. మొత్తం పరీక్షలు చేసి ఏమీ ప్రమాదం లేదని తెలిసి చెప్పారు అంట. గత కొంతకాలంగా ఎలాంటి విరామం లేకుండా షూటింగ్ లలో పాల్గొంటూ ఉండటంతో కాస్త విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని సూచించారట. అంతే తప్ప పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారట.
రామోజీ ఫిలిం సిటీలో దాదాపు నెల రోజుల నుండి షూటింగ్ జరుగుతూ ఉంది. మొన్నటి వరకు జాతరలో ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరించారు. తర్వాత జాతర సాంగ్ తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు షెడ్యూల్స్ లో అల్లు అర్జున్ రెస్ట్ లేకుండా కష్టపడుతూ ఉండటంతో వెన్ను నొప్పికి గురయ్యారట. అయితే రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని వైద్యులు చెప్పడంతో పుష్ప 2 షూటింగ్ ఆగిపోవడం జరిగిందంట. డిసెంబర్ రెండో వారం నుండి మళ్లీ షూటింగ్ మొదలుకానున్నట్లు సమాచారం. 2021 డిసెంబర్ నెలలో విడుదలైన “పుష్ప” మొదటి భాగం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. పాన్ ఇండియా నేపథ్యంలో బన్నీ మరియు సుకుమార్ కలిసి చేసిన ప్రయోగం మ్యాజిక్ సృష్టించింది.
“పుష్ప” డైలాగులు పాటలు అన్నీ కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ముఖ్యంగా దేశంలోనే కాకుండా విదేశాలలోనూ… ఆకట్టుకోవడం జరిగింది. సినిమాలో తగ్గేదేలె డైలాగ్… ప్రపంచంలోనే ట్రెండ్ సెట్ గా నిలిచింది. “పుష్ప” సినిమాకి సంబంధించి పాటలు డైలాగులు స్టెప్పులు సోషల్ మీడియాలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు వీడియోలు చేయడం జరిగింది. ఈ రకంగా ప్రపంచాన్ని ఎంటర్టైన్మెంట్ చేసిన “పుష్ప” అల్లు అర్జున్ కి ఉత్తమ జాతీయ నటుడు అవార్డు వచ్చేలా చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు “పుష్ప” సెకండ్ పార్ట్ నీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని షూటింగ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15వ తారీకు “పుష్ప” రెండో భాగం విడుదల కాబోతోంది. మొదటి భాగం కంటే రెండో భాగం ఎక్కువ భాషలలో విడుదల చేయబోతున్నారు.