CM YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుతం ఫ్యామిలీతో యూకే పర్యటనలో ఉన్నారు. విదేశీ పర్యటన ముగించుకుని ఈ నెల 12న తిరిగి రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రానికి వచ్చిన తర్వాత కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తారనీ, ఆ సమావేశంలోనే అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. దాదాపుగా ఈ నెల 20వ తేదీ నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని అంటున్నారు.
జరగబోయే కేబినెట్ భేటీలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటారనీ, అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులపై చర్చించడంతో పాటు అసెంబ్లీ సమావేశాల తేదీని ఖరారు చేస్తారని భావిస్తున్నారు. ఈ సారి అసెంబ్లీ సమావేశాలు పది నుండి పదిహేను రోజుల పాటు నిర్వహించవచ్చని సమాచారం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సారిగా ఇన్ని రోజుల పాటు వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నారని తెలియడంతో ప్రాధాన్యత ఏర్పడింది.
అయితే ఈ సమావేశాల్లోనే చాలా కీలకమైన బిల్లులను వైసీపీ సర్కార్ ప్రవేశపెట్టనున్నదని ప్రచారం జరుగుతోంది. షెడ్యుల్ ప్రకారం అయితే సార్వత్రిక ఎన్నికలకు మరో ఎనిమిది నెలల సమయం ఉంది. కానీ జమిలి ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టినట్లయితే ఇవే చివరి ఏపీ అసెంబ్లీ సమావేశాలు అవుతాయని కూడా భావిస్తున్నారు. దీంతో వైసీపీ ఎన్నికలకు వెళ్లేందుకు సన్నద్దం అవుతూ ప్రజలకు మరింత మేలు చేసే పలు కొత్త పథకాలను తీసుకువచ్చే ఆలోచన చేస్తుంది. ఈ క్రమంలో అనేక కీలక బిల్లులను కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరో కీలక విషయం ఏమిటంటే .. న్యాయపరమైన చిక్కుల కారణంగా జగన్మోహనరెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానుల అంశం ఆలస్యం అవుతోంది.
విశాఖను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయరాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా చేయాలని జగన్ సర్కార్ కృత నిశ్చయంతో ఉంది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్టులో విచారణ పరిధిలో ఉండటం, డిసెంబర్ నెలలో విచారణ జరగనుండటంతో దానిపై ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే దానిపై కూడా కేబినెట్ లో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. రాబోయే ఎన్నికలకు మూడు ప్రాంతాల అభివృద్ధి, మూడు రాజధానుల అంశమే తమ ప్రధాన అజెండా అని ఇంతకు ముందే వైసీపీ పెద్దలు పలువురు పేర్కొన్నారు. మూడు రాజధానులపై హైకోర్టు వ్యతిరేక తీర్పు ఇచ్చిన నేపథ్యంలోనే సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా న్యాయపరమైన చిక్కులు రాకుండా వికేంద్రీకరణకు సంబంధించి మెరుగైన బిల్లు తీసుకువస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగా బిల్లు ప్రవేశపెట్టే అలోచన కూడా ఉందని అంటున్నారు.
అప్పట్లో శాసనమండలిలో వైసీపీకి బలం లేకపోవడంతో అక్కడ ఆమోదం పొందకపోయినా నేరుగా గవర్నర్ కు పంపి ఆమోదింపజేసుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేనందున మెరుగైన వికేంద్రీకరణ బిల్లును తీసుకువస్తారనే చర్చ జరుగుతుంది. ఒక వేళ అది సాధ్యం కాకపోతే పరిపాలన వికేంద్రీకరణ దిశగా తమ అడుగులు ఉన్నాయని చెప్పడం కోసం సీఎం క్యాంప్ కార్యాలయాన్ని విశాఖ కు షిప్ట్ చేసి సీఎం జగన్ అక్కడి నుండి పరిపాలన సాగించే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో విశాఖకు తన మకాంను జగన్ మార్చనున్నారని ఇప్పటికే వెల్లడించారు. కోర్టు తీర్పులు ఎలా ఉన్నా తాము చేయాలనుకున్నది చేసి తీరుతామ్, తర్వాత న్యాయపరమైన చిక్కులు వస్తే వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామ్ అనే రీతిలో ఉన్న వైసీపీ పెద్దలు మూడు రాజధానుల అంశంపై ఈ సమావేశాల్లోనే ఒక నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందని బలంగా వినబడుతోంది. చూడాలి ఏమి జరుగుతోంది.
Jio Air Fiber: జియో సిమ్ కార్డ్ వాడే ప్రతీ ఒక్కరూ చదవాల్సిన న్యూస్ ఇది !
YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More
Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More
AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More
Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More
Chhattisgarh: చత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా… Read More
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే… Read More
Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సీరియల్లో… Read More
EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More
Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More
Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More
Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More
Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More
Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More
తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More
Samyuktha Menon: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More