ఏపీ అధికార పార్టీ వైసీపీ నుంచి సస్పెండ్కు గురైన నలుగురు ఎమ్మెల్యేల వ్యవహారం.. మరోసారి ఆసక్తిగా మారింది. ఇప్పటికి 4 సార్లు.. వీరు స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశాలను ధిక్కరించారు. ఆయన వీరిని ఆ నాలుగు సార్లు తన చాంబర్కు వచ్చి వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. అయితే, వారు డుమ్మా కొట్టారు. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. దీంతో వీరిపై చర్యలు తప్పవనే సంకేతాలు అసెంబ్లీ సెక్రటేరియెట్ నుంచి వచ్చాయి. కానీ, ఇది మొన్నటి మాట. కానీ, ఇప్పుడు వ్యూహం యూటర్న్ తీసుకుంది. దీంతో ఆ నలుగురు సేఫ్ అయిపోయారని అంటున్నారు.
విషయం ఏంటంటే.. వైసీపీ టికెట్పై గెలిచిన.. ఆనం రామనారాయణ రెడ్డి(వెంకటగిరి), కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి(నెల్లూరు రూరల్), ఉండవల్లి శ్రీదేవి(తాడికొండ), మేకపాటి చంద్రశేఖర్రెడ్డి(ఉదయగిరి) లపై అనర్హత వేటు వేయాలని వైసీపీ సర్కారు చీఫ్ విప్ ప్రసాదరాజు స్పీకర్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే పలు దఫాలుగా వారికి నోటీసులు ఇచ్చారు. అయితే.. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించినా.. అక్కడ ఊరట లభించలేదు. అయినప్పటికీ.. మరోసారి వచ్చి కలవాలని స్పీకర్ వారిని కోరారు.
ఈ క్రమంలోనే నాలుగు సార్లు రావాలని సూచించారు. నిర్దేశిత సమయం గడిచిపోయినప్పటికీ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరుకాని పరిస్థితి నెలకొంది. అయితే .. ఇలా విచారణకు గైర్హాజరు కావడంతో స్పీకర్ తీసుకునే నిర్ణయం ఉందంటూ.. వార్తలు మొన్నటి వరకు హల్చల్ చేశాయి. దీంతో రాజకీయంగా దుమారం రేగుతుందని.. రెబల్స్పై వేటుఖాయమని అందరూ అనుకున్నారు. కానీ, ఇప్పుడు అనూహ్యంగా వారు సేఫ్ అయిపోయారు. ఇక, వారిపై ఈగైనా వాలే పరిస్థితి ఉండదు.
దీనికి కారణం.. రాజ్యసభ కు ఎన్నికలు లేకపోవడమే. ఈ నెల 27 న రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాల కు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు పాల్గొని.. ఈ మూడు స్థానాలకు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. కానీ, ఎందుకో.. టీడీపీ అధినేత పోటీకి దూరంగా ఉన్నారు. దీంతో ఎలాంటి పోటీ లేకుండానే.. వైసీపీ నుంచి ఎంపికైన వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబూరావులు.. ఏకగ్రీవంగా పెద్దల సభకు ఎన్నికయ్యారు.
దీంతో ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఫలితంగా వైసీపీ రెబల్స్ వ్యవహారం.. లైట్ అయిపోయింది. వారిపై ఇక ఎలాంటి చర్యలు ఉండబోవని.. ప్రభుత్వం కూడా పట్టించుకోదని పరిశీలకులు చెబుతున్నారు.
Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More
Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More
Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More
Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More
Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More
తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More
Samyuktha Menon: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More
Karthika Deepam 2 May 10th 2024 Episode: కడియం దీపని కార్తీక్ గురించి అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని చూడగానే… Read More
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు లోక్ సభ ఎన్నికల వేళ… Read More
Aa Okkati Adakku: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కామెడీ హీరోగా నట కిరీటి రాజేంద్రప్రసాద్ తర్వాత అంతటి ఇమేజ్ సంపాదించుకున్న… Read More
Jyothi Rai: జ్యోతి రాయ్.. టీవీ ప్రేక్షకులకు, సోషల్ మీడియా లవర్స్ కు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు… Read More
AP High Court: రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్ పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల… Read More
Kovai Sarala: కోవై సరళ.. సౌత్ సినీ ప్రియులకు అత్యంత సుప్రసిద్ధురాలు. తమిళనాడులోని కోయంబత్తూరు లో ఒక మలయాళీ కుటుంబంలో… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో… Read More
BrahmaMudi:రాజ్ రేపటిలోగా తన నిర్ణయం చెప్పకపోతే, తన ఇంట్లో నుంచి వెళ్లడం కాదు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని… Read More