నిన్న చోటుచేసుకున్న ప్రణబ్ ముఖర్జీ అకాల మరణం యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ తన చిన్నతనంలో ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగాడు. పశ్చిమ బెంగాల్ కు చెందిన రాజకీయ కుటుంబంలో ప్రణబ్ జన్మించారు. అతని తల్లిదండ్రులు కమదా కింకర్ ముఖర్జీ, రాజ్యలక్ష్మి ముఖర్జీ. ప్రణబ్ ముఖర్జీని ముద్దుగా ‘దాదా’ అని పిలిచేవారు.
ప్రణబ్ ముఖర్జీ తండ్రి భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పని చేశారు. 1952 నుండి 1964 మధ్యలో పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్సీ గా సేవలందించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ తన చిన్నతనంలో ఎంతో కష్టపడ్డారు. బెంగాల్ లోని ఓ మారుమూల గ్రామంలో జన్మించిన ఆయన అప్పుట్లో స్కూల్ కి వెళ్ళడం కోసం రోజు 10 కిలోమీటర్లు నడిచేవారు. వెళ్ళడానికి 10 కిలోమీటర్లు రావడానికి పది కిలోమీటర్లు అన్నమాట, అప్పట్లో వారికి ఎటువంటి రవాణా సౌకర్యాలు ఉండేవి కాదని చిన్నతనంలోనే చదువు కోసం తాను అంత దూరం నడిచి వెళ్ళే వాడిని ఒకసారి ప్రణబ్ తెలిపారు.
ఇన్ని రోజులు ఈ విషయం బయటకు రాలేదు. ఆయన చనిపోయిన తర్వాత ఈ విషయాన్ని అందరూ గుర్తు చేసుకుని అతను విద్యను అభ్యసించడానికి ఎంత కష్టపడ్డాడో తెలుసుకుంటున్నారు. మామూలుగా రాజకీయవేత్తలకు విద్యతో సంబంధం లేదని అంటారు. కానీ ప్రణబ్ మాత్రం చిన్నతనంలోనే రవాణా సౌకర్యాలు ఏమీ లేని కాలంలోనే ఇలా విద్య కోసం పాటుపడ్డాడు. ఇక వర్షాకాలంలో అయితే పరిస్థితి దారుణంగా ఉండేదని.. బురదలో నడిచి స్కూల్ కి వెళ్లే పరిస్థితి తాను అనుభవించాలి అని దాదా అన్నారు. బట్టలన్నీ బురదతో నిండిపోయేవని ఆయన చెప్పడం గమనార్హం. అంత కష్టపడి ఈ స్థాయికి చేరుకోవడం వల్లనే అతనికి ఇప్పుడు ఇంత మంది నీరాజనాలు పలుకుతున్నారు