నిన్న మొన్నటి వరకు వైసిపి లోనే ఉన్న సదరు ఎమ్మెల్యే ఇప్పుడు నియోజకవర్గంలో అదే వైసీపీని ఖాళీ చేసే పనిలో ఉన్నారు. తన నియోజకవర్గంలో ఉన్న వైసిపి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు పలువురు కీలక నేతలను కలుపుకుని ఈరోజు హైదరాబాదులో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. వసంత కృష్ణ ప్రసాద్ కుటుంబానికి గతంలో తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉంది. ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు ఎన్టీఆర్ మంత్రివర్గంలో పనిచేశారు. ఆ తర్వాత రాజకీయ కారణాలతో తెలుగుదేశం పార్టీకి దూరమై కాంగ్రెస్లో చేరారు.
2019 ఎన్నికలలో మైలవరం నుంచి పోటీ చేసి అప్పటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై విజయం సాధించారు. ఐదేళ్లుగా కృష్ణ ప్రసాద్ వైసీపీలో ఎంత మాత్రం ఇమడలేకపోయారు. వ్యక్తిగతంగా ఆయనకు మంచి పేరు ఉన్నా పార్టీ అధిష్టానం నుంచి సరైన మద్దతు లేకపోవడంతో మైలవరం నియోజకవర్గాన్ని అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారు. అనూహ్యంగా ఇప్పుడు కృష్ణ ప్రసాద్ టిడిపిలో చేరుతుండడంతో అక్కడ టిడిపి నుంచి బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సీటు వస్తుందా ? రాదా అన్న సందిగ్ధత నెలకొంది.
ఈరోజు నందిగామ నియోజకవర్గంలోని తన స్వగ్రామం అయిన ఐతవరం నుంచి 100 కారులతో ర్యాలీగా బయలుదేరి హైదరాబాద్ వెళ్లి అక్కడ చంద్రబాబు సమక్షంలో కృష్ణ ప్రసాద్ టిడిపిలో చేరుతున్నారు. కృష్ణ ప్రసాద్ తనతో పాటు మైలవరం నియోజకవర్గంలోని ప్రధాన వైసీపీ క్యాడర్ను అంతా ఖాళీ చేసి మరి సైకిల్ ఎక్కేస్తుండటం విశేషం. కృష్ణ ప్రసాద్ పార్టీకి దూరమవుతారన్న సంకేతాలు వచ్చిన వెంటనే వైసీపీ అధిష్టానం మైలవరం జడ్పిటిసిగా ఉన్న సర్నాల తిరుపతిరావు యాదవ్ను మైలవరం అసెంబ్లీ సమన్వయకర్తగా ఎంపిక చేసింది.
తిరుపతి రావు యాదవ్ అసెంబ్లీకి పోటీ చేసే అంత సత్తా ఉన్న నేత అయితే కాదు. కేవలం డమ్మీగా మాత్రమే జగన్ తిరుపతిరావును సమన్వయకర్తగా ఎంపిక చేశారని ఫైనల్ గా మైలవరం నుంచి వైసీపీ తరఫున మరో నేత పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎంపీ కేశినేని నాని లేదా ఆయన కుమార్తె కేశినేని శ్వేత లేదా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, జోగి రమేష్ పేర్లు వైసిపి రేసులో వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మైలవరం నియోజకవర్గంలో బలమైన నేతలుగా ఉన్న దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు, ప్రస్తుత ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వీళ్లంతా తెలుగుదేశంలో ఉండడంతో వైసిపి దిక్కుతోచని స్థితిలో ఉందన్నమాట వాస్తవం.
YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More
Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More
AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More
Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More
Chhattisgarh: చత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా… Read More
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే… Read More
Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సీరియల్లో… Read More
EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More
Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More
Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More
Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More
Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More
Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More
తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More
Samyuktha Menon: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More