Baahubali: పాన్ ఇండియా సినిమా అంటే ఏంటో తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేసిన రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాలకి దారి చూపాడు జక్కన్న. ఇది బాహుబలి, బాహుబలి 2 కింద కూడా వచ్చింది. ఇక వాటికి ఫ్రీక్వెల్ గా వస్తున్న కథ. ఇందులో కట్టప్ప విలన్ కాగా రక్తదేవ్ అనే శత్రువు సైన్యానికి సైన్యాధిపతిగా ఉన్న ఈ కట్టప్పను ఎదుర్కోవడానికి బాహుబలి మరియు బాలల దేవా చేతులు కలుపుతారు. కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బాహుబలి మూవీ ద్వారా రాజమౌళి పరిచయం చేసిన రాజ్యం మాహిష్మతి. ఇప్పుడు కల్పిత సామ్రాజ్యం మరో శత్రువుతో పోరాడుతుంది.
ఆ శత్రువు పేరు రక్తదేవ్. అతని సైన్యానికి అధిపతి కట్టప్ప. తనకు శిక్షణ ఇచ్చిన వ్యక్తిపైనే మన సైన్యం ఎలా గలుస్తుందంటూ నేరుగా బాహుబలి.. బల్లాల దేవే రంగంలోకి దిగుతారు. ఈ సరికొత్త కథతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రూపొందించిన ఓ యానిమేషన్ సిరీస్ రాబోతుంది. ఈ యాక్షన్ సిరీస్ హాట్ స్టార్ లో మే 17 నుంచి అందుబాటులో ఉండనుంది. ఆ బాహుబలి కి రాజమౌళి దర్శకుడుగా పనిచేయగా ఈ బాహుబలికి అతడు ప్రొడ్యూసర్ గా ఉన్నారు. జీవన్ జే కాంగ్, నవీన్ జాన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సిరీస్ ట్రైలర్ను గురువారం అనగా నేడు హాట్ స్టార్ రిలీజ్ చేసింది. ఇందులో అమరేంద్ర బాహుబలిని బాలల దేవుడు వెన్నుపోటు పొడవడానికి ముందు కొత్త శత్రువుతో మాహిష్మతి చేసిన పోరాటాన్ని చూపించారు.
బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ అనే టైటిల్ తో ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన జీవితం మొత్తం మాహిష్మతికే అంకితం చేసిన కట్టప్ప ఈ సరికొత్త కథతో అదే మహిష్మతి పై పోరాటం చేయడం ఇంట్రెస్టింగ్ పాయింట్ గా నిలబడింది. బాహుబలి ప్రపంచాన్ని యానిమేషన్ లో చూడాలనుకునే వారికి ఈ కొత్త సిరీస్ మంచి అనుభూతిని ఇస్తాయని చెప్పవచ్చు. ఈ షో క్రియేటర్ అండ్ ప్రొడ్యూసర్ రాజమౌళి. ఈ బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ పై తజాకా స్పందించారు. ” బాహుబలి ప్రపంచం చాలా పెద్దది. దీనిని ఫిలిం ఫ్రాంచైజీ బాగా పరిచయం చేసింది. అయినా ఆ ప్రపంచంలో చూడడానికి ఇంకా చాలానే ఉంది. అక్కడి నుంచి వచ్చేదే ఈ బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్. బాహుబలి, బల్లాల దేవుడి జీవితాల్లోని ఓ రహస్యాన్ని... ట్విస్టులను ఇది ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
ఈ కొత్త కథను ఆనిమేటెడ్ రూపంలో బాహు అభిమానుల ముందుకు తీసుకురావడం చాలా ఉత్సాహంగా ఉంది ” అంటూ రాజమౌళి పేర్కొన్నారు. ఇక ఈ సరికొత్త బాహుబలి పై సిల్వర్ స్క్రీన్ బాహుబలి ప్రభాస్ కూడా స్పందించారు. ” ఇప్పటివరకు ఎవరు చూడని ఈ బాహుబలి ప్రయాణంలో బాహుబలి, బాలల దేవుడు కలిసి రావడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సినిమాలో చూపించిన దాని కంటే ముందు జరిగిన స్టోరీయే ఈ బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్. బాహు, బలాల జీవితాల్లోని ముఖ్యమైన అధ్యాయం ఉంది. దీనిని యానిమేటెడ్ ఫార్మాట్లో తీసుకురావడం చాలా బాగుంది. బాహుబలి ప్రయాణంలోని ఈ కొత్త ప్రణయాన్ని చూడాలని ఎంతో ఆశగా ఉంది ” అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్. ప్రస్తుతం రాజమౌళి అండ్ ప్రభాస్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.