Dasara special 5th day దేవీ నవరాత్రులలో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టంమైన ప్రసాదములను తయారు చేసి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. రేపు ఐదవ రోజు అమ్మవారు లలితా దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు కావున లలితా దేవి అమ్మవారికి నైవేద్యంగా పెట్టే అల్లం గారెలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..!
అల్లం గారెలు తయారీకి కావలసిన పదార్ధాలు :
మినపప్పు- 2 కప్పులు
అల్లం – చిన్న ముక్క
పచ్చిమిరప కాయలు – 6
జీలకర్ర -1/4 స్పూన్
ఉప్పు -రుచికి తగినంత
కరివేపాకు -కొద్దిగా
కోత్తమిర -తగినంత
నూనె – గారెలు వేగడానికి సరిపడినంత..
తయారు చేసే విధానం :
ముందుగా మినపప్పును బాగా కడిగి ఒక ఆరు గంటల పాటు నానపెట్టుకుని ఉంచుకోవాలి. అలా కాకుండా ముందు రోజు రాత్రి నానపెట్టుకుంటే పొద్దునకల్లా పప్పు బాగా నానుతుంది.నానిన మినపప్పును ఒక రెండు సార్లు. కడిగి గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలి.పప్పు కాస్త నలిగిన తరువాత ఉప్పు సన్నగా తరిమిన అల్లం,పచ్చిమిరప కాయ ముక్కలు కూడా వేసి రుబ్బాలి. ఇప్పుడు ఆ పిండిలో సన్నగా తరిమిన కరివేపాకు, కోత్తమిర, జీలకర్ర వేసి పక్కన పెట్టుకోండి.. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో నిండుగా నూనె పోసి బాగా కాగ నివ్వాలి. కాగిన నూనెలో ఈ మినపిండిని కొద్దిగా చేతిలోకి తీసుకొని గారెలుగా చేసుకుని మెల్లగా నూనెలో వేయాలి. దోరగా వేగిన తరువాత గరిట సహాయంతో ఒక గిన్నెలోకి తీసేయాలి. గారెలు రెడీ అయ్యాక శ్రీ లలితాదేవికి ఆరాధించి నైవేద్యం పెట్టి అమ్మవారి కృపకు పాత్రులు అవ్వండి.