Madhuranagarilo November 06 episode 202: వీళ్ళిద్దరూ ఎప్పుడు సంతోషంగా ఉండాలి వీళ్ళ మధ్య ఎప్పుడూ గొడవలు రాకూడదు అని మధుర అంటుంది. అమ్మ వెళ్లొస్తాను అని శ్యామ్ అంటా. టిఫిన్ చేసి వెళ్ళారా అని మధుర అంటుంది. అమ్మ నేను ఆఫీసులో తింటాను లేట్ అవుతుంది అని శ్యామ్ వెళ్లిపోతాడు. కట్ చేస్తే, రుక్మిణి వాళ్ళ ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో మురళి ఫోన్ చేసి ఏంటి రుక్మిణి ఇంకా బయలుదేర లేదా అక్కడే ఉన్నావా అని అంటాడు. లేదు నాన్న మా ఫ్రెండ్ వస్తానన్నది అందుకే ఇక్కడ నిలబడ్డాను కానీ పండు నన్ను చూసి పెద్దమ్మ అని పిలిచాడు నన్ను చూసి భయపడలేదు నాన్న అని రుక్మిణి అంటుంది. అవునా అమ్మ ఎంతైనా కన్నెపేగు ఎక్కడికి పోతుంది పండు ముందు ముందు నేను అమ్మా అని పిలుస్తాడు లే రాధా అన్నమాట నిలబెట్టుకుంది అని మురళి అంటాడు. రాధ కాదు నాన్న పండుని అలా మార్చింది రాధ వాళ్ళ ఆయన అలాంటి మంచి మనిషి దొరికినందుకు రాధ చాలా అదృష్టవంతురాలు ఆ ఎమ్మెస్ సుందరం గాని చేసుకుని నేను బాధపడుతున్నాను చెల్లి వాళ్ళ ఆయన చాలా మంచివాడు నాన్న అని రుక్మిణి అంటుంది.
అవునా అమ్మ సరేలే గాని నువ్వు త్వరగా వచ్చేయ్ అని మురళి ఫోన్ కట్ చేస్తా.శ్యామ్ ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడి ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయండి అని అంటాడు. సరే సార్ అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంతలో రాధా ఫోన్ చేసి ఫ్రీ గా ఉన్నారా అని అడుగుతుంది. ఇప్పుడే ఇంజనీరింగ్ తో మాట్లాడాను మీటింగ్ అయిపోయింది ఫ్రీ గానే ఉన్నాను చెప్పు రాదా అని శ్యామ్ అంటాడు. మీరు ఫ్రీగా ఉంటే మీకు కుదిరితే వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకొస్తారేమోనని ఫోన్ చేశాను అని రాదా అంటుంది. వీలు చేసుకొని మరీ తీసుకు వస్తాను అని శ్యామ్ అంటాడు. థాంక్యూ సార్ త్వరగా వచ్చేస్తారు కదూ అని రాదా అంటుంది. ఒక భార్య భర్త కి ఫోన్ చేసి మల్లెపూలు తెమ్మంది అంటే దాని అర్థం ఏంటి అని శ్యామ్ సంతోష పడిపోతాడు. కట్ చేస్తే రాదా ఇక్కడ శ్యామ్ కోసం అందంగా రెడీ అయి తనకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రాధా అలా అందంగా తయారవడం చూసినా మధుర ఏంటమ్మా కొత్త చీర చాలా బాగుంది అని అంటుంది.
అవునత్తయ్య అని సిగ్గుపడుతూ రాదా సమాధానం చెబుతుంది. ఏంటి కొత్త చీర కట్టుకున్నావు ఏమైనా స్పెషలా అని మధుర అంటుంది. అత్తయ్య ఆయన బయటికి వెళ్దామన్నారు అందుకని చీర కట్టుకున్నాను అని రాదా అంటుంది. మీరిద్దరూ బయటికి వెళ్తున్నరా అవిషయం నాకు ముందు చెప్పారా అత్తగారికి చెప్పాల్సిన అవసరం లేదా నేనైతే మా అత్త గారితో అన్ని చెప్పేదాన్ని నీలాంటి వాళ్లే అన్ని విషయాలు దాస్తారు అని మధుర కోపంగా అంటుంది. సారీ అత్తయ్య అని రాధా వినయంగా అంటుంది. ఏంటి సారీ రాదా నేను అందరిలాంటి అతను కాదు వాడు నిన్ను బాధపెట్టిన నాకు చెప్పాలి నేను ఊరుకోను అని మధుర అంటుంది. మీ అబ్బాయి బాధపెట్టే రకం కాదులే అత్తయ్య అ రాదా ఉంటుంది. అబ్బో మీ ఆయన చాలా వెనకేసుకొస్తున్నావే అని మధుర అంటుంది. కట్ చేస్తే శ్యామ్ రోడ్డు పక్కన కారు ఆపుకొని మల్లెపూలు దగ్గరికి వెళ్లి నిలబడతాడు.
ఏంటి సార్ ఏం కావాలి మల్లెపూలు కావాలా రోజా పూలు కావాలా అని పూల అమ్మాయి అడుగుతుంది. మల్లెపూలు కావాలి ఒక నాలుగు కేజీలు ఇవ్వండి అని శ్యామ్ అంటాడు శ్యామ్. కేజీల లెక్క అమ్మరు సార్ మూరలు లెక్క తీసుకువెళ్లండి అని పూల అమ్మాయి అంటుంది. అయితే ఒక 100 మూరలు ఇవ్వండి అని శ్యామ్ అంటాడు. ఏంటి సార్ మొదటిసారి మీ భార్యకి పూలు తీసుకెళుతున్నారా 100 మూరలు వద్దు కానీ నాలుగు మూరలు తీసుకెళ్లండి సరిపోతాయి అని పూల అమ్మాయి అంటుంది. అలాగే నాలుగు మూరలే ఇవ్వండి అని శ్యామ్ అంటాడు. పూల అమ్మాయి నాలుగు మూరలు ఇస్తుంది. శ్యామ్ మల్లెపూలు తీసుకుంటూ ఉండగా రుక్మిణి వాళ్ళ ఫ్రెండ్ స్కూటీ ఎక్కి వెళ్ళిపోతూ ఉండగా కొంచెం దూరం వెళ్లగానే స్కూటీ ఆగిపోతుంది. పూలు తీసుకొని కారు దగ్గరికి వచ్చిన శ్యామ్ కి రుక్మిణి కనపడుతుంది.
ఇంతలో స్కూటీ స్టార్ట్ అవుతుంది వాళ్లు వెళ్లిపోతారు. తనని చూసిన కోపంలో శ్యామ్ తన చేతిలో మల్లెపూలు నలిపేసి కింద పడేసి ఇంటికి వెళ్ళిపోతాడు. రాధా తన కోసం ఎదురు చూస్తూ నాకు ఆయన మీద కోపం పోయిందని తెలిస్తే చాలా సంతోషపడతారు అని రాధా అనుకుంటూ ఉండగా ఇంతలో శ్యామ్ ఇంటికి వస్తాడు.ఏంటండీ మల్లెపూలు తీసుకు రాలేదా సరే మనం బయటికి వెళ్తున్నాం కదా అక్కడ కొనుక్కుందాంలే మీరు వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యి రండి అని రాదా అంటుంది.
రాధా తనకు రుక్మిణి లాగా కనపడుతుంది ఏ నన్ను కాసేపు ప్రశాంతంగా ఉండనిస్తావా అని తన చేయి పక్కకు నెట్టేసి కోపంగా అంటాడు శ్యామ్. శ్యామ్ సార్ ఏమైంది అని రాదా బాధతో అంటుంది. సారీ రాదా నేను ఇప్పుడు మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాను సారీ నేను ఎక్కడికి రాలేను అని శ్యామ్ లోపలికి వెళ్ళిపోతాడు..దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది