Paluke Bangaramayenaa november 08 episode 68: తప్పంతా నాదే ఝాన్సీని సేప్ ప్లేస్ లో ఉంచాల్సింది అని అభిషేక్ స్లాప్ మీదికి వెళ్లి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఝాన్సీ వచ్చి ఏంటి అబి ఏం చేస్తున్నావు అంటుంది. నేను ఒక విషయం చెప్పాలి అని అభిషేక్ ఝాన్సీ వంక చూస్తూ ఝాన్సీ నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే ఇన్ని రోజులు చెబుదామనుకొని చెప్పలేకపోయాను ఝాన్సీ సీతా రాముడిలా విల్లు విరువ లేకపోయినా విశ్వమంత ప్రేమను నీకు పంచి ఇస్తాను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను నువ్వు ఎప్పుడూ నాకు తోడుగా ఉంటావా ఝాన్సీ ఐ లవ్ యు అని అభిషేక్ అంటాడు . కొద్దిసేపు ఆలోచించిన తరువాత ఐ లవ్ యు టూ అని ఝాన్సీ అంటుంది. థాంక్యూ థాంక్యూ సో మచ్ ఝాన్సీ నా లవ్ నువ్వు యాక్సెప్ట్ చేస్తావో చేయవో అనుకున్నాను అని అభిషేక్ అంటాడు. అభి ఏం ఆలోచిస్తున్నావు ఇందాక నీకు ఒక విషయం చెప్పాలి అన్నావు అలాగే ఆగిపోయావు ఏంటి అని ఝాన్సీ గట్టిగా అంటుంది
. కలలో జరిగిందంతా నిజంగా నీకు చెప్తే నువ్వు ఒప్పుకుంటే ఎంత బాగుంటుంది ఝాన్సీ అని అభిషేక్ తన మనసులో అనుకుంటాడు. ఏమీ లేదు ఝాన్సీ స్వర వాళ్ళ అమ్మ చనిపోయింది కేసు ని ఎలా పూర్తి చేద్దామని ఆలోచిస్తున్నాను అని అంటాడు అభిషేక్. అవును పాపం స్వర ఎలా ఉంటుందో ఏమో అని ఝాన్సీ అంటుంది. కట్ చేస్తే బావ కాఫీ తాగు అని వైజయంతి నాయుడుని అంటుంది. తాగుతాను గాని స్వర లేచిందా ఈ పేపర్ కాస్త చదువు పెట్టు అని నాయుడు అంటాడు. అలాగే బావ అని వైజయంతి పేపర్ తీసుకొని చూస్తే, అందులో అంతా నాయుడు తప్పు చేయలేదు కాబట్టే తన పదవికి రాజీనామా చేశాడు తన మహోన్నతమైన వ్యక్తిత్వానికి పొంగిపోయిన కార్యకర్తలు అని రాసి ఉంటుంది. ఇది చదివితే బావకి శాసనసభలో మంచి పేరు ఉందని అనుకుంటాడు పేపరు చదవడం మానేస్తే బెటర్ అని వైజయంతి ఈ పేపర్ లో ఏముంది లే బావ అని వైజయంతి పేపర్ ని పక్కన పడేస్తుంది.
నీ మనస్తత్వం ఏంటో తెలుసుకోవాలనే నేను పేపర్ చదవమన్నాను వై జయంతి అని నాయుడు తన మనసులో అనుకుంటాడు. ఇంతలో ఆర్య వచ్చి నాన్న నువ్వు రాజీనామా చేసావంట పెద్దమ్మయ్యది నాన్న కనిపించట్లేదు అంటూ పైకి చూస్తాడు. ఇదేంటి నాన్న పెద్దమ్మ ఫోటో గోడకు తగిలిచ్చింది పెద్దమ్మ చనిపోయిందా నాకు ఒక మాట అన్న చెప్పలేదు ఏంటి అని అంటాడు. అంతా మన దురదృష్టం నాన్నా మన చేతిలో ఏముంది అని నాయుడు అంటాడు.అక్క ఎక్కడుంది నాన్న నేను అక్క ని చూడాలి అని ఆర్య పైకి వెళ్ళబోతుండగా. అక్కకి అమ్మవారి పోసింది నాన్న నువ్వు వెళ్ళకూడదు అని నాయుడు అంటాడు. ఏం పర్వాలేదు నేను చూసి మాట్లాడి వస్తాను అని ఆర్య వెళ్ళిపోతాడు. స్వర గదిలోకి వెళ్లి ఆర్య అక్క ఏంటి అక్క ఇలా జరిగింది పెద్దమ్మ ఎలా చనిపోయింది అక్క అని అంటాడు. అంతా దైవ నిర్ణయం తమ్ముడు దానికి మనమేం చేస్తాం చెప్పు నువ్వెప్పుడొచ్చావురా అని స్వర అంటుంది. అక్క నిన్ను చూడాలి ఒక్కసారి బయటికి రా అని ఆర్య అంటాడు. వద్దు తమ్ముడు చూడలేవు భయపడతావు అని స్వర అంటుంది.
బయటికి వచ్చిన ఆర్య అక్కకు విపరీతంగా అమ్మవారు పోసింది తను ఎవరు చూసుకుంటారు అబి సార్ కి ఫోన్ చేస్తే హెల్ప్ చేస్తాడేమో అని అనుకుంటాడు. కట్ చేస్తే, అభి వాళ్ళ ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తారు. మీరు కూడా రండి తిందాము అని ఝాన్సీ చందనాన్ని పిలుస్తుంది. ఝాన్సీ అలా అనగానే వాళ్ల బామ్మ పకపక నవ్వుతూ అరుణోదయం కాకముందే ఆరు దోశలు తింటారు ఇంకా ఇప్పుడేం తింటారు లే అమ్మ అని ఎగతాళి చేస్తుంది. ఇంట్లో తినడం కూడా తప్పే అని చందన కోపంగా వెళ్ళిపోతుంది. ఇంతలో ఆర్యా అబిషేక్ కి ఫోన్ చేసి సార్ మా అక్కకి అమ్మవారు పోసింది మీరు త్వరగా రండి సార్ అని అంటాడు. ఏంటి అభి ఎవరు అని ఝాన్సీ అంటుంది. స్వరకి అమ్మవారు పోసిందంట నేను వెళ్తున్నాను అని అభిషేక్ అంటాడు. నేను వస్తాను అని ఝాన్సీ అంటుంది.
నన్ను తీసుకెళ్లండి అని కీర్తి అంటుంది. వాళ్లు ముగ్గురు వెళ్లిపోతారు. కట్ చేస్తే, ఈ స్వరకి విపరీతంగా అమ్మవారు పోసింది ఇప్పుడు దానికి నేను సేవలు చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది వైజయంతి. ఇంతలో విశాల్ కళ్యాణి వస్తారు. కరెక్ట్ టైం కు వచ్చావు కళ్యాణి నీ చేత స్వరకి సేవలు చేయిస్తాను అని తన మనసులో అనుకుంటుంది. నాన్న ఏంటి నాన్న ఇలా జరిగింది మన ఇంటికి ఏమైంది నాన్న పెద్దమ్మ చనిపోవడం నువ్వు రాజీనామా చేయడం అక్కకి అమ్మవారు పోయడం మన ఇంటికి ఏదో కీడు జరుగుతుంది నాన్న అని ఆర్య బాధపడతాడు. కట్ చేస్తే, పాప స్వరకి అమ్మవారు పోసిందంట అత్తయ్య తనకు తల్లి కూడా లేదు ఎవరు దగ్గర ఉండి చూసుకుంటారో ఏమో అని యశోద అంటుంది. అవునమ్మా ఆ వైజయంతి అసలే తనను పట్టించుకోదు ఈ పరిస్థితుల్లో తనకు దగ్గర ఉండి సేవలు చేసే వాళ్ళు కావాలి అని వాళ్ళ అత్తయ్య అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది