Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టికెట్ లు ఆశించి భంగపడిన నాయకులు పార్టీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు నేతలు ప్రత్యర్ధి పార్టీల్లో చేరిపోతుండగా, మరి కొందరు తీవ్ర మనస్థాపానికి గురవుతూ ఆందోళన చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుండి చేరిన వారికి చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఖరారు చేయడంతో అప్పటి వరకూ తమకే టికెట్ వస్తుందని అశించిన వారు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. ఒ నాయకుడు అయితే మనస్థాపానికి గురై ఏకంగా పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జిగా ఉన్న కాసుల బాలరాజు టికెట్ ఆశించారు. అయితే పార్టీ అధిష్టానం ఆయనకు కాకుండా బీజేపీ నుండి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏనుగు రవీంద్ర రెడ్డికి టికెట్ ఖరారు చేసింది. దీంతో మనస్థాపానికి గురైన బాలరాజు ఈ ఉదయం నుండి నిరాహార దీక్ష చేపట్టారు. మధ్యహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమించడంతో బాలరాజును నిజామబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాలరాజు 2009 లో పీఆర్పీ తరపున పోటీ చేసి ఓటమి పాలైయ్యారు.
ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన బాలరాజు 2014,2018 ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలైయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఖరారు అయిన ఏనుగు రవీందర్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన రవీందర్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. దశాబ్దాకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న తనను కాదని రీసెంట్ గా బీజేపీ నుండి చేరిన రవీందర్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇవ్వడంతో బాలరాజు పురుగు మందు తాగాడు. కాగా బాలరాజును బీఆర్ఎస్, బీజేపీ నేతలు పరామర్శించారు.
AP CID: సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ లు పెడుతున్నారా..? జర జాగ్రత్త .. హెచ్చరించిన ఏపీ సీఐడీ