BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు ఇవేళ తీర్పు వెలువరించింది.
ప్రస్తుతం తీహార్ జైల్ లో ఉన్న కవిత .. ఈడీ, సీఐబీ కేసుల్లో వేరువేరుగా బెయిల్ పిటిషన్ లు దాఖలు చేశారు కవిత. ఎన్నికల నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ కు అర్హత ఉందని కవిత తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు.
ఎలాంటి ఆధారాలు లేకుండానే కవితను అరెస్టు చేశారని తెలిపారు. ఈడీ కస్టడీలో ఉండగా సీబీఐ అరెస్టు చేసిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఆమెకు బెయిల్ మంజూరు చేయవద్దని సీబీఐ, ఈడీ తరపు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. దర్యాప్తును కవిత ప్రభావితం చేయగలరని తెలిపారు.
ఈ కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నారని, సూత్రధారి, పాత్రధారి ఆమేనని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కావేరీ బవేజా బెయిల్ నిరాకరిస్తూ తీర్పు వెలవరించారు. కాగా, రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరించడంతో కవిత హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.
AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు