YSRCP: వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీని వీడుతున్నట్లు మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. విజయవాడలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన ప్రకటించారు. వైసీపీ ప్రాధమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవులకీ రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇవేళ సాయంత్రం మంగళగిరిలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జయహో బీసీ సభలో ఆ పార్టీలో చేరనున్నట్లు గుమ్మనూరు జయరాం తెలిపారు.
ఈ సందర్భంలో గుమ్మనూరు జయరాం కీలక కామెంట్స్ చేశారు. సీఎం జగన్ విగ్రహంలా మారిపోయారని అన్నారు. ఆయన ఏమీ మాట్లాడరని, విగ్రహానికి పూజారులుగా ధనుంజయరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారని, వారి వారసులకు (వర్గీయులకే) న్యాయం చేస్తారు కానీ భక్తులకు న్యాయం చేయరని అన్నారు. తనకు అన్యాయం జరిగిందన్నారు. జిల్లాలో ఇద్దరం మంత్రులుగా ఉంటే మరో మంత్రి ప్రాతినిధ్యం వహించే డోన్ లో అభివృద్ధి జరిగింది గానీ తన నియోజకవర్గం అభివృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రిగా ఉండి తాను చేసేది ఏమి చేయలేక పోయానని అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరగకపోవడం అవమానంగా భావిస్తున్నానన్నారు. వైసీపీకి కరుడుగట్టిన తీవ్ర వాదిగా పని చేశానని, తాను ఎక్కడ ఉన్న కరుడు గట్టిన తీవ్రవాదిగానే పని చేస్తానన్నారు. జిల్లాలో అభివృద్ధి జరగని వెనుకబడిన నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది ఆలూరేనని చెప్పారు. తన నియోజకవర్గానికి, తనకు పార్టీలో అన్యాయం జరిగినందు వల్లనే బయటకు వస్తున్నట్లుగా చెప్పారు.
ఇప్పటి వరకూ పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వైసీపీ వీడగా, అయిదేళ్ల పాటు మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కీలక నేత పార్టీ వీడి బయటకు రావడం ఇదే ప్రధమం. గుమ్మనూరు జయరాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరు నియోజకవర్గానికి పార్టీ ఇన్ చార్జిగా జడ్పీటీసీ విరూపాక్ష ను పార్టీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి జయరాం పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
అయితే జయరాంకు కర్నూలు పార్లమెంట్ ఇన్ చార్జిగా పార్టీ నియమించినా ఆయన లోక్ సభకు పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ క్రమంలో పార్టీ మార్పునకు నిర్ణయం తీసుకున్నారు. జయరాం గుంతకల్లు టికెట్ ఆశిస్తుండగా, టీడీపీ నుండి సానుకూల సంకేతాలు వచ్చినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలోనే టీడీపీలో చేరేందుకు ఇవేళ జయరాం విజయవాడ చేరుకున్నారు. ఆలూరు నుండి భారీ కాన్వాయ్ తో విజయవాడకు మంత్రి గుమ్మనూరు జయరాం సోదరులు బయలుదేరారు.
గుమ్మనూరు జయరాం టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2001 లో ఏదూరు గ్రామ టీడీపీ ఎంపీటీసీగా పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. 2005 లో చిప్పగిరి మండల జడ్పీటీసీ గా గెలుపొందారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున అలూరు నుండి పోటీ చేసి ఓటమి పాలైయ్యారు.
జయరాం దాదాపు 37వేలకుపైగా ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. 2011లో వైసీపీలో చేరిన గుమ్మనూరు జయరాం 2014,2019 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కేవలం 2వేల ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచిన జయరాం..గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి కోట్ల సుజాతమ్మపై దాదాపు 39వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు. జగన్ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
Elon Musk: ఎలాన్ మస్క్ కు షాక్ ఇచ్చిన మాజీ ఉన్నతోద్యోగులు .. వెయ్యి కోట్లకు దావా
YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More
Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More
AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More
Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More
Chhattisgarh: చత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా… Read More
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే… Read More
Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సీరియల్లో… Read More
EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More
Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More
Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More
Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More
Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More
Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More
తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More
Samyuktha Menon: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More