ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయడంలో ముందుండే కొడాలి నాని కామెంట్లు ఇటీవల సొంత పార్టీకి సైతం షాక్గా మారుతున్నాయనే టాక్ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఆయన చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు స్వపక్షాన్ని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయనే చర్చ జరుగుతున్న సమయంలోనే తాజాగా మరో వివాదంలో ఆయన పేరు వినిపిస్తోంది.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ సహా బాబు కోటరీపై మంత్రి కొడాలి నాని అంతెత్తున ఫైర్ అవుతారు. చంద్రబాబు సహా టీడీపీలో తనకు గిట్టని వారిని ఓ రేంజ్లో టార్గెట్ చేస్తుంటారు. వైసీపీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కొడాలి నానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు. దీంతో తనకు అప్పగించిన బాధ్యతల ప్రకారం తన గళాన్ని నాని మరింత వినిపిస్తున్నారు. అయితే, అది కాస్త రూట్ మారింది.
ఆదిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మనసు గెలుచుకునే రీతిలో కొడాలి నాని కామెంట్లు ఉన్నాయంటున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు మూడు రాజధానుల అంశానికి మద్దతు తెలియజేసే విషయంలో తటపటాయించారు. స్థానికుల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అని సైలెంట్గా ఉన్నారు. ఇక్కడి ఓట్లతో గెలిచి ఇక్కడి నుంచి హైకోర్టు, సెక్రటేరియట్ తరలించడానికి మద్దతు ఇవ్వడం ఎలా అని వారు తర్జన భర్జన పడ్డారు. అయితే మంత్రి కొడాలి మూడు రాజధానులకు మద్దతు తెలియజేశారు. ఈ ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు తటపటాయిస్తున్న సమయంలో ఆయన వైసీపీ ప్రభుత్వం నిర్ణయాన్ని బాహాటంగానే సమర్థించి జగన్ మనసు గెలుచుకున్నారు. అయితే, తర్వాతే పరిణామాలు మారిపోయాయని అంటున్నారు.
తిరుమలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిక్లరేషన్ సమర్పించడం అనే అంశంలో కొడాలి నాని తీరు చర్చనీయాంశంగా మారిందంటున్నారు. ఏ గుడికి, మసీదుకి, చర్చికి లేని డిక్లరేషన్ తిరుమలలో ఎందుకని కొడాలి నాని ప్రశ్నించారు. సీఎం హోదాలో వెళ్లే వారిని డిక్లరేషన్ అడిగే హక్కు లేదన్న ఆయన ఎక్కడలేని సంప్రదాయం తిరుమల లో మాత్రం ఎందుకు!? దాన్ని తీసేయాలని అన్నారు. సంతకం పెట్టకుండా శ్రీవారి గుడికి వెళ్తే తిరుమల అపవిత్రం అవుతుందా!? అని నాని ప్రశ్నించారు. నిజమైన హిందు వాదులు, మతం కోసం జీవితాలను ఇచ్చిన వారి నుంచి అభ్యంతరాలు లేవని అయన అన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి పేరును సైతం ప్రస్తావించారు.
ఇలా మంత్రి కొడాలి నాని పేరు విపక్షాలు విపులంగా ప్రచారంలో పెట్టిన సమయంలో తాజాగా ఆయన ఇలాకాలో జరుగుతున్న పరిణామాలపై మీడియాలో కొత్త వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మంత్రి ఇలాఖాలో..దసరా మామూళ్లు ఇవ్వాలంటూ డప్పు చాటింపు అంటూ కొన్ని మీడియా సంస్థల్లో ప్రచారం జరిగింది. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో దసరా సందర్భంగా కార్డుదారులందరూ రేషన్ బియ్యానికి వచ్చేటప్పుడు రూ.20 చొప్పున దసరా మామూళ్లు ఇవ్వాలంటూ చాటింపు వేశారని ఆ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. కార్డుదారులందరూ రూ. 20 వంతున దసరా మామూళ్లు తెచ్చి ఇవ్వాలంటూ టముకు వేయాల్సిందిగా గ్రామంలోని కొందరు వ్యక్తులు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై టాంటాం వేసే ప్రభాకరరావుతో చెప్పారని, దీంతో అతడు శనివారం ఉదయం గ్రామంలోని ప్రతి వీధిలో తిరిగి ఆ మేరకు చాటింపు వేశాడని ఆ మీడియా సంస్థలు పేర్కొన్నారు. అది విన్న గ్రామస్థులు, కార్డుదారులు విస్తుపోతున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గంలో ఈ ఘటన జరగటంతో మరింత చర్చనీయాంశమైంది. ఈ ప్రచారంపై తహసీల్దార్ ఆంజనేయులు స్పందనను సదరు మీడియా సంస్థలు కోరగా చాటింపు వేయించినట్లు తమ పరిశీలనలో తేలిందని.. వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారని ఆ కథనాల్లో ప్రస్తావించారు. మొత్తంగా ఈ కొత్త వివాదంతో కొడాలి నానిపై విపోఆలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సింది.
This post was last modified on October 5, 2020 10:45 am
YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఆమె సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై… Read More
Vijay Deverakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కెరియర్ ఎత్తుపల్లాల గుండా వెళ్తూ ఉంది. గత ఏడాది "ఖుషి" సినిమాతో… Read More
AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి… Read More
Balagam: మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి అనంతరం పెద్దయ్యగా స్టార్ హీరోయిన్గా ఎదగడం ప్రస్తుత కాలంలో చాలా… Read More
Chhattisgarh: చత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అయిదుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని పిడియా… Read More
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్.. ఈ పేరు ఒకానొక సమయంలో ఎవరికీ తెలియక పోయినప్పటికీ ప్రస్తుత కాలంలో మాత్రం బాగానే… Read More
Trinayani: జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ ఏ విధమైన ఆదరణ దక్కించుకుంటుందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సీరియల్లో… Read More
EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి… Read More
Ma Annayya: ప్రస్తుత కాలంలో సీరియల్ ఇండస్ట్రీకి చెందినవారు సైతం స్టార్ హీరో మరియు సీరియల్స్ లో నటించే హీరోలతో… Read More
Kasturi: సీరియల్స్ అంటేనే ఏడుపుగొట్టుది. అవేం చూస్తారు రా బాబు? అంటూ పెదవి విరుస్తూ ఉంటారు కొంతమంది. ఆ మాట… Read More
Mamagaru: ప్రస్తుత కాలంలో వరుస పెట్టి బుల్లితెర నటీనటులు పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో బుల్లితెర జంటలు సైతం… Read More
Vijayashanti - Anushka Shetty: రెండు దశాబ్దాల క్రిందట సౌత్ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అనగానే అందరికీ… Read More
Nayanthara: దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో నయనతార దే అగ్రస్థానం. గత కొన్ని ఏళ్ల… Read More
తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద… Read More
Samyuktha Menon: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ గ్లామరస్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకటి.… Read More