ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఏపీ అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలకు సరిగ్గా వారం రోజుల సమయం ఉన్న నేపథ్యంలో… పెను ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా టిడిపి నేత వర్మ ప్రచారం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు మరవక ముందే సీన్ లోకి మహాసేన రాజేష్ రంగంలోకి దిగాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కట్టప్ప గా మారిపోయాడు మహాసేన రాజేష్. జనసేన ఎక్కడ పోటీ చేసినా కూడా తాము ఓడిస్తామని ప్రకటించేశారు. పవన్ కళ్యాణ్ కంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి చాలా బెటర్ అని… 100 రేట్లు చాలా మంచోడు అంటూ కితాబ్ ఇచ్చారు. దీంతో మహాసేన రాజేష్ వ్యవహారం కూటమికి తలపోటుగా మారిపోయింది. మొన్నటి వరకు కూటమికి అనుకూలంగా పనిచేసిన మహాసేన రాజేష్… ఎన్నికల కంటే ముందే యూటర్న్ తీసుకున్నాడు.
మొన్న ప్రధాని నరేంద్ర మోడీ సభలో… జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మహాసేన రాజేష్ కు నచ్చలేదట. తమ దళిత వర్గాన్ని నొప్పించేలా పవన్ కళ్యాణ్ మాట్లాడారట. దళితులకు అన్యాయం చేస్తున్న బిజెపికి 400 పైగా సీట్లు వచ్చేలా తాను కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడం మహాసేన రాజేష్కు ఏమాత్రం నచ్చలేదట. దీంతో దళిత వర్గాలకు కీలక పిలుపు ఇచ్చాడు రాజేష్. జనసేన అభ్యర్థులు ఎక్కడ ఉన్న అక్కడ దళితులందరూ కలిసి ఓడించాలని పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఓ వీడియో కూడా విడుదల చేశాడు మహాసేన రాజేష్. పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకున్న తర్వాత టిడిపి గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని… 144 సీట్లు గెలవాల్సిన టిడిపి.. ఇప్పుడు ఓడిపోయే పరిస్థితి ఉన్నట్లు రాజేష్ చెప్పబచ్చారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రమాదకరమంటూ వ్యాఖ్యానించారు. అయితే దీన్ని వైసిపి మాత్రం చాలా డిఫరెంట్ గా ప్రచారం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ ఏపీలో ఓడిపోయే పరిస్థితి నెలకొందని… అందుకే నారా లోకేష్ ఇలాంటి నాటకాలు ఆడిస్తున్నాడని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది వైసిపి.
ఇప్పటినుంచే జనసేన పైన నేరం మోపాలనే ఉద్దేశంతో… మహాసేన రాజేష్ తో ఈ నాటకాలు ఆడిస్తున్నారని ప్రచారం చేస్తోంది. ఒకవేళ ఎన్నికల తర్వాత తెలుగుదేశం కూటమి ఓడిపోయిన కూడా… జనసేన కారణంగా ఓడిపోయిందని నెట్టి వేయచ్చనే ఉద్దేశంతో… ఇలా వీడియోలు చేపిస్తున్నారని వైసీపీ జోరుగా ప్రచారం చేస్తోంది. ఏది ఏమైనా తాజాగా మహాసేన రాజేష్ చేసిన వీడియో పవన్ కళ్యాణ్ పార్టీకి తీవ్ర దెబ్బ అని చెప్పవచ్చు. ఓవరాల్ కూటమి కి కూడా నష్టం చేకూర్చుతుందని అంటున్నారు. మరి దీన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా తీసుకుంటారో చూడాలి.