Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం పదోవారం గేమ్ సాగుతోంది. ఈ వారంలో మొదట నామినేషన్ ప్రక్రియ జరగగా మంగళవారం నుండి.. ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయింది. ఈ క్రమంలో హౌస్ లో సభ్యులు చాలా వారాల తర్వాత కుటుంబ సభ్యులను చూడటంతో భావోద్వేగానికి గురవుతున్నారు. మంగళ, బుధవారాలలో శివాజీ, ప్రియాంక, అమర్, అర్జున్, అశ్విని, గౌతమ్… కుటుంబ సభ్యులు రావడం జరిగింది. గురువారం కూడా ఫ్యామిలీ ఎపిసోడ్ జరగనుంది. ఇదిలా ఉంటే పదవ వారంలో ఐదుగురు నామినేట్ కావటం తెలిసింది. శివాజీ, యావర్, గౌతమ్, రాధిక, బోలె. సీజన్ సెవెన్ లో ఈ ఐదుగురు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ లు.
ఒక్క రతికా మినహా మిగతా నలుగురు ఓటింగ్ పరంగా గేమ్ పరంగా అన్ని రకాలుగా అద్భుతమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో పదో వారం ఓటింగ్ చాలా హోరా హోరీగా సాగింది. అయితే తాజాగా ఓటింగ్ పోల్స్ బట్టి చూస్తే ఈసారి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా గౌతమ్ తక్కువ ఓట్లతో అట్టడుగు స్థానంలో ఉన్నాడు. హౌస్ లో మొదటి నుండి గౌతమ్ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శిస్తూ ఉన్నాడు. అయినా గాని అతనికి తక్కువ ఓట్లు పడుతూ ఉన్నాయి. గౌతమ్ కి పైన రతిక ఉంది.
ఈ క్రమంలో ఇదే ఓటింగ్ ప్రక్రియ కొనసాగితే పదో వారం వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతివారం రెండు రోజులు నామినేషన్ ప్రక్రియ సాగేది. కానీ పదో వారం ఒక్కరోజేలో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. దీంతో సోమవారం రాత్రి నుండి ఓటింగ్ పోల్స్ నమోదు కాగా.. శివాజీ అందరికంటే ఎక్కువ ఓట్లు రాబడుతూ అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత రెండో స్థానంలో యావార్, మూడో స్థానంలో బోలే … నాలుగో స్థానంలో రతిక ఐదో స్థానంలో గౌతమ్ కొనసాగుతున్నాడు. మరో రెండు రోజులు ఓటింగ్ ప్రక్రియ ఉన్న నేపథ్యంలో.. డేంజర్ జోన్ లో ప్రస్తుతం గౌతమ్ ఉన్నారు.