Nindu Noorella Saavasam November 9th Episode 76: అమరేంద్ర అరుంధతి ఫోటో పట్టుకొని తను బ్రతికి ఉన్నప్పుడు చేసిన బర్త్ డే గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. అమరేంద్ర అలా బాధపడుతూ ఉంటే తట్టుకోలేని అరుంధతి బయటి నుంచి గబగబా లోపలికి పరిగెత్తుకొచ్చి ఏమండీ మీరు ఏడవకండి నేను తట్టుకోలేక పోతున్నాను అని అంటుంది. అమరేంద్ర ఆ ఫోటోని చూస్తూ ఆరు నీ కళ్ళల్లోకి చూస్తూ హ్యాపీ బర్త్డే చెప్పాలని అనుకున్నాను కానీ నీ ఫోటో చూస్తూ హ్యాపీ బర్త్డే చెప్పే రోజు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు ఐ లవ్ యు ఆరు ఐ మిస్ యు ఆరు అంటూ గుండెలకు ఫోటోని హత్తుకొని ఏడుస్తూ ఉంటాడు. అయ్యో ఇప్పుడు ఎలా ఆయనను ఊపించలేకపోతున్నానే అని అరుంధతి బాధపడుతుంది. కట్ చేస్తే, ముoపాయి సంవత్సరాల క్రితం జరిగిన దాని తలుచుకుంటూ ఎందుకు నాన్న బాధపడతారు మీరు ఎలాంటి వారో నాకు తెలుసు నాయనమ్మ అలా చేస్తుందని నువ్వు మాత్రం కలగన్నావా ఏంటి ఊరుకో నాన్న అని భాగమతి అంటుంది.
లేదమ్మా ఆ ఒక్కరోజు నా కూతురు బ్రతికి ఉన్నదా లేదా అని చూసి ఉంటే ఇంతలా బాధపడే వాని కాదు కదా ఎవ్వరూ లేని దానిలా అనాధల హాస్టల్ లో పెరిగి కష్టాలు పడుతుంది, మన అందరితో కలిసి సంతోషంగా ఆనందంగా ఉండే నా కూతురు ఎక్కడో అనాధ ఆశ్రమంలో పెరుగుతుంది ఈ తండ్రి గుండె తట్టుకోలేకపోతుందమ్మా అంటూ బాధపడతాడు వాళ్ళ నాన్న. ఇప్పుడు అక్క ఆచూకీ ఎలా తెలుసుకోవడం నానా అని భాగమతి అంటుంది. అక్కను వదిలేసిన హాస్టల్ దగ్గరికి వెళ్తే సరస్వతి అనే ఆవిడ దగ్గర పెరుగుతుందని చెప్పిందమ్మా ఆవిడ ఎక్కడ ఉంటుందో అని ఎన్ని ఊర్లు వెతికినా ఆవిడ నాకు దొరకలేదు అని వాళ్ళ నాన్న ఏడుస్తాడు. అంటే ఆ సరస్వతి ని పట్టుకుంటే ఈయన కూతురు ఎక్కడ ఉందో తెలుస్తుంది ఎంత కష్టమైనా సరే ఆ సరస్వతి వెతికి పట్టుకుంటాను అని వాళ్ల పిన్ని అనుకుంటుంది.
పంతులుగారు కొన్ని మంచినీళ్లు ఇస్తారా అని భాగమతి అడుగుతుంది. పంతులుగారు కొన్ని మంచినీళ్లు ఇస్తారు వాళ్ళ నాన్నకి తాగించి, ఏంటి పంతులుగారు ఈ సంచి ఇందాకటి నుంచి ఇక్కడే ఉంది ఎవరిది మరిచిపోయారు అనుకుంటా అని అంటుంది. ఎవరో గుడికి వచ్చిన వాళ్ళు పెట్టి మరిచిపోయి ఉంటారు అమ్మ అక్కడికి వెళ్లి అడిగి ఇవ్వు అని పూజారి అంటాడు. ఆ సంచి నాదే అని తెలిస్తే నా కూతురు బాధపడుతుంది ఇప్పుడు ఏం చేయాలి అని భాగీ పక్కన తెలిసిన వాళ్లు వచ్చారు వాళ్ళని కలిసి మాట్లాడి వస్తానమ్మా అని తన చేతిలో ఉన్న భాగమతికిచ్చి భాగమతి చేతిలో ఉన్న సంచి అతను తీసుకుని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, నాన్న ఈరోజు అమ్మ బర్త్డే కదా ఫోటో చూసి విషెస్ చెప్పి వెళ్ళిపోతాము ఒకే ఒక్కసారి చూపించండి నాన్న అని అమ్ము అంటుంది.
ఈరోజు మొదటి రోజు కదా స్కూల్ కి వెళ్ళేది,మీ అమ్మని చూస్తే డిస్టర్బ్ అవుతారు రోజంతా దాన్నే తలుచుకుంటూ బాధపడతారు ఏమి అవసరం లేదు స్కూల్ కి వెళ్ళండి బాగా చదువుకోండి అని అమరేంద్ర అంటాడు. డాడీ అమ్మ పెళ్లి రోజు పుట్టినరోజు ఒకేసారి వచ్చిందని అమ్మ సంతోష పడుతూ మనకు చెప్తూ ఉండేది అమ్మను చూడలేకపోయినా తన ఫోటోకి ఒక్కసారి విషెస్ చెప్పి వెళ్ళిపోతాం నాన్న ప్లీజ్ నాన్న అని అమ్ము బతిమిలాడుతుంది. వాళ్ల బాధని అర్థం చేసుకున్న అమరేంద్ర అరుంధతి ఫోటో టేబుల్ మీద పెట్టి పక్కకు నిలబడతాడు. వాళ్ళ అమ్మ ఫోటో చూసుకుంటూ పిల్లలు ఐ లవ్ యు అమ్మ ఐ మిస్ యు అమ్మ అని ఫోటోని గుండెలకు హత్తుకొని వెక్కివెక్కి ఏడుస్తారు. రేయ్ అమ్ము ఏడవకండి రా అలా బాధపడకండి రా నేను ఇక్కడే ఉన్నాను రా మి బాధను చూసి నేను తట్టుకోలేక పోతున్నాను అని అరుంధతి అక్కడే కూర్చుని అంటుంది.
ఇంట్లో నిర్మల మనోహరి శివరాం రాథోడ్ అందరూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. కట్ చేస్తే, ఇంతలో భాగమతి గబగబా వచ్చి రాథోడ్ గారు లేట్ అయిపోయింది సారీ అండి పిల్లలు ఎక్కడ ఉన్నారు నేను పిల్లని తీసుకొని వస్తాను స్కూల్ కి వెళ్దాం పదండి అని అంటుంది. పిల్లలు సార్ రూమ్ లో ఉన్నారమ్మ అని రాథోడ్ అంటాడు. సార్ కూడా వస్తున్నారా పిల్లలతో పాటు అదేంటండీ ఈరోజు అందరూ అదోలా ఉన్నారు ఏమి మాట్లాడరేంటి ఏడుస్తూ ఉన్నారు ఏంటి అని భాగమతి అంటుంది.ఈరోజు మేడం పుట్టినరోజు అమ్మ అని రాథోడ్ ఏడుస్తూ అంటాడు. చనిపోయిన ఆవిడదా అని భాగమతి అంటుంది. ఇంతలో పిల్లల్ని తీసుకొని అమరేంద్ర కిందికి వచ్చి రాథోడ్ పిల్లలు ఫస్ట్ డే కదా స్కూల్ కి వెళ్లడం అక్కడే ఉండి వాళ్ళని చూసుకో అని అమరేంద్ర అంటాడు.సారీ అండి ఈరోజు మేడం బర్త్డే అంట కదా ఇప్పుడే రాథోడ్ గారు చెప్పారు అని భాగమతి అంటుంది. పర్వాలేదు పిల్లల్ని స్కూల్ కి తీసుకు వెళ్ళండి అని అమరేంద్ర అంటాడు.
రాథోడ్ గారు అంజు పాప ఎక్కడ అని భాగమతి పైకి వెళ్లి చూస్తే, అంజు వేసిన డ్రాయింగ్ పట్టుకొని అమ్మ నీ ఫోటో చూడొద్దంట కదా నీ ఫోటో చూడకపోతే నేమమ్మ నీకు ఇష్టమైన ఈ డ్రాయింగ్ చూసుకుంటూ నీకు హ్యాపీ బర్త్డే చెప్తాను అమ్మ మమ్ములను వదిలిపెట్టి ఎందుకమ్మా అప్పుడే వెళ్లిపోయావు నిన్ను చూడాలని ఉంది అమ్మ నీతో మాట్లాడాలని ఉందమ్మా అని అంజు ఏడుస్తూ, అమ్మ నేను ఏడవట్లేదు చూడు నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావు కదా ఏదైనా కష్టం వస్తే అడగకూడదు ధైర్యంగా ఎదుర్కోవాలని నేను ఏడవట్లేదు అమ్మ కానీ ఈరోజు ఏడవకుండా ఉండలేకపోతున్నాను అని అంజు బాధపడుతుంది. అక్కడే నిలబడి భాగమతి చూస్తూ ఉంటుంది. బయట కిటికీలో నుంచి చూస్తూ అరుంధతి అంజూని అంజు పాపా నేనంటే నీకు అoత ఇష్టమా అని బాధపడుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది