Murder In Mahim OTT: ఓటీటీలలో క్రైమ్ థ్రీల్లర్ వెబ్ సిరీస్ లు చాలానే వస్తున్న సంగతి తెలిసిందే. ఓటిటిలలో ఈ జోనర్ కు మంచి క్రేజ్ కూడా ఉంది. ఇందువల్లే క్రైమ్ మరియు ఇన్వెస్టిగేషన్, ఉత్కంఠంతో ఉండే ఈ జోనర్ సినిమాస్ ను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఇక ఇదే క్రమంలో తాజాగా మర్డర్ ఇన్ మహీమ్ పేరుతో మరో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తుంది. విజయ్ రాజ్, అషుతోశ్ రాణా, శివాని రాఘవంసి ఈ సిరీస్లో ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారు అయింది. ఈ సిరీస్ మే 10 వ తారీకున జియో సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇక ఈ విషయంపై అధికారక ప్రకటన కూడా వచ్చింది.
ఇటీవలే వచ్చిన టీజర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఈ సిరీస్ పై ఎంతో ఆసక్తి నెలకొంది. మర్డర్ ఇన్ మహీమ్ సిరీస్ ఆరు భాషల్లో మే 10న స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. హిందీ తో పాటు తెలుగు, కన్నడ, తమిళ్, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి వస్తుంది. మారడార్ ఇన్ మహీమ్ సిరీస్ కో రాజ్ ఆచార్య దర్శకత్వం వహించారు. ముంబైలోని మహిమ్ అనే రైల్వే స్టేషన్ లో జరిగే మర్డర్ మిస్టరీని ఛేదించడం చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. 2013 బ్యాక్ డ్రాప్ లో ఈ సిరీస్ రూపొందాయి.
ఇక ఈ హత్య కేసును విచారించే పీటర్ ( అషుతోశ్ ) కుమారుడే ఈ కేసులో అనుమానితుడిగా ఉంటాడు. ఇక ఈ మర్డర్ మిస్టరీ ఏంటనేది ఈ సిరీస్లో ఉంటుంది. మర్డర్ ఇన్ మహీమ్ సిరీస్లో విజయ్ రాజ్, రాణా, శివాని తో పాటు శివాజీ సతమ్, స్మిత తదితరులు కీలక పాత్రలు పోషించారు. జిగ్షా పిక్చర్స్ ప్రొడక్షన్స్, టిప్పింగ్ ప్యాయింట్ సిరీస్ బ్యానర్ల పై ప్రొడ్యూస్ చేయబడింది ఈ సిరీస్. అజిత్ అంధారే నిర్మాతగా వ్యవహరించారు. ఇక జియో సినిమా ఓటిటి ప్లాట్ఫామ్ ఇటీవల రెండు కొత్త ప్రీమియం ప్లాంట్స్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. 29కే నెలవారీ ప్లాన్ లాంచ్ చేసింది. ఈ ప్లాన్ తీసుకుంటే జియో సినిమాలో ప్రీమియం కంటెంట్ను చూడవచ్చు.
ఇక ఈ ప్లాన్ ద్వారా ఒక డివైజ్ లు చూడవచ్చు. అదేవిధంగా 89 నెలవారి ప్లాన్ ను కూడా జియో సినిమా ప్రకటించింది. ఈ ప్లా న్ సబ్స్క్రైబ్ చేసుకుంటే 4 డివైస్లలో యాక్టివ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఈ ప్లాన్ ను తీసుకుంటే సినిమాలు మరియు వెబ్ సిరీస్ లను యాడ్స్ లేకుండా చూడగలిగే విసులుబాటు కూడా ఉంది. ఇక ఇప్పుడు జియో సినిమాలో ఐపీఎల్ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇందువల్ల జియో సినిమా ప్రేక్షకులు ఎక్కువగా పెరిగారు. ఈ నేపథ్యంలోనే తమ సబ్ స్క్రిప్షన్ కొత్త ధరలను కూడా ప్రకటించి మరింత తమ ప్లాట్ఫామ్ ను ముందుకు సాగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.