Sai Pallavi: నాచురల్ బ్యూటీ సాయి పల్లవి.. పేరుకు మలయాళం బ్యూటీ అయినప్పటికీ తెలుగులో స్థిరపడింది. మలయాల్లో ఈమెకి ఎంత పాపులారిటీ ఉందో చెప్పలేమేమో కానీ మన తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఈమెకు ఉన్న క్రేజ్ మరే హీరోయిన్ కి ఉండదనే చెప్పొచ్చు. కొందరు హీరోయిన్లు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి టెంపరరీగా మిగిలిపోతూ ఉంటారు. అదే సాయి పల్లవి మాత్రం నిత్యం పర్మినెంట్. తన ఎక్స్ప్రెషన్స్ మరియు డాన్స్ తో ప్రతి ఒక్కరిని ఆకర్షించిన సాయి పల్లవి ప్రస్తుతం తన ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ పై ఇంట్రెస్ట్ పెట్టింది.
ఒకపక్క చదువుకుంటూనే మరో పక్క యాక్టింగ్ లో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ త్వరలోనే అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పనున్నట్లుగా తెలుస్తుంది. మరి ఆ గుడ్ న్యూస్ ఏంటి? ఏం చెబుతుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ లోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రతిష్టాత్మమైన ప్రాజెక్టులలో భాగం కానుంది అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా త్వరలో వీటిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుంది అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. భారతీయ సంస్కృతిని పెంచి సాటి స్త్రీ మరియు పురుషుడు ఎలా ఉండాలో చెప్పిన రామాయణం ఆధారంగా బాలీవుడ్ లో బిగ్ ప్రాజెక్టు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నితేష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఎందరో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ మూవీలో రాముడు గా టాలెంటెడ్ హీరో రణబీర్ నటించబోతున్నట్లు తెలుస్తుంది.
ఇక సీతగా సాయి పల్లవి ని ఎంచుకున్నట్లు సమాచారం. ఇదే వార్త కొన్ని నెలలుగా సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇక దీనిపై ఇంకా అఫీషియల్ ప్రకటన రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ వార్త వైరల్ గా మారింది. బాలీవుడ్ నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ ఈ ప్రతిష్టాప్తమైన ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. ప్రెసెంట్ దీనికి సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ మూవీలో రావణుడిగా కన్నడ అగ్ర హీరో యష్.. హనుమంతుడిగా సన్నీ డియోల్.. సూర్పనక్క గా రకుల్ ప్రీత్ సింగ్ నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఏప్రిల్ మాసంలో శ్రీరామనవమి రోజున ఈ ప్రాజెక్టు గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనున్నట్లు తెలుస్తుంది.