Mohan Babu: గత కొద్ది రోజులుగా ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబం వివాదాల్లో చిక్కుకుంటోంది. వాళ్లు చేసుకున్న తప్పులు, వాళ్లు చేసుకున్న స్వయంకృతాపరాథం, వాళ్ల అతిశయోక్తులు, వాళ్ల సెల్ప్ డబ్బాలు సోషల్ మీడియాకు బూస్టింగ్ అయ్యాయి. సోషల్ మీడియాకు విపరీతంగా దొరికిపోతున్నారు. సన్ ఆఫ్ ఇండియా సినిమా ఫ్లాప్ అయ్యింది. కలెక్షన్ లు దారుణంగా వచ్చాయి. పది లక్షల కూడా రాలేదు. దాని ఫ్రస్టేషన్ తో పలు సోషల్ మీడియాలకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు లీగల్ నోటీసులు కూడా ఇచ్చారు. అక్కడ కూడా తప్పుకు దొరికారు. ఆ తరువాత కూడా సోషల్ మీడియాలో ఆ కుటుంబంపై ట్రోలింగ్స్ ఆగలేదు. అది అలా కొనసాగుతుండగా.. తాజాగా మంచు విష్ణు ఆఫీసులో పని చేసే హెయిర్ డ్రస్సర్ పై రూ.5లక్షల విలువైన వస్తువులు దోచుకువెళ్లాడంటూ కేసు పెట్టారు. దీంతో పెద్ద వివాదం మోహన్ బాబు ఫ్యామిలీకి చుట్టుకుంది. వాళ్లు రాజకీయంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్లను కాపాడేపరిస్థితి లేదు.
Mohan Babu: హెచ్ఆర్సీ ని ఆశ్రయించిన నాయి బ్రాహ్మణ సంఘం పెద్దలు
బీసీ సామాజికవర్గంలో అనేక వెనుకబడిన కులాలు ఉన్నాయి. అందులో నాయి బ్రాహ్మణ కులం ఒకటి. నాయి బ్రాహ్మణ కులస్తుడైన నాగ శ్రీనును తీవ్రంగా అవమానించడమే కాక అక్రమంగా దొంగ తనం నేరం అంటగట్టే ప్రయత్నం చేసిన మోహన్ బాబు కుటుంబంపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ను నాయి బ్రాహ్మణ సంఘం పెద్దలు ఆశ్రయించారు. ఆ సంఘం అధ్యక్షుడు పాల్వాయి శ్రీనివాస్ మరి కొందరు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంలో సంఘ నేత శ్రీనివాస్ మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వాతంత్ర్యం అనంతరం కూడా కులాలపై దాడులు జరుగుతున్నాయనీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరిగానే తమకు కూడా ఒక చట్టం తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
Mohan Babu: మోహన్ బాబుకు, నాగ శ్రీనుకు లై డిటెక్టర్ పరీక్షలు
మోహన్ బాబు ఇంట్లో నాగ శ్రీను అనే వ్యక్తి 11 సంవత్సరాలుగా నమ్మకంగా హెయిర్ డ్రస్సర్ గా పని చేస్తున్నారనీ, అన్ని సంవత్సరాలుగా లేనిది ఇప్పుడు రూ.5 లక్షల విలువైన వస్తువులు దొంగిలించినట్లు తప్పుడు కేసులు బనాయించి కులం పేరుతో దూషించడం చాలా అమానుషమని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణులు మొత్తం పెద్ద ఎత్తున దర్నాలు, ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. వాస్తవంగా మోహన్ బాబు ఆరోపణలో నిజం ఉంటే మోహన్ బాబుకు, నాగ శ్రీనుకు లై డిటెక్టర్ పరీక్షలు చేయించండి, లేదా నార్కో టెస్ట్ లు చేయండి అలా చేస్తే ఎవరు అబద్దం చెబుతున్నారో ఎవరు నిజం చెబుతున్నారో తెలుతుందని నాయి బ్రాహ్మణ సంఘం డిమాండ్ చేస్తోంది. ఓ పక్క పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడంతో పాటు హెచ్ఆర్సీలోనూ పిర్యాదు చేశారు.
రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
నాయి బ్రాహ్మణ సంఘం వారం రోజులు డెడ్ లైన్ విధించింది. నాగ శ్రీను పై పెట్టిన తప్పుడు కేసు వెనక్కు తీసుకోవడం తో పాటు మోహన్ బాబు కుటుంబం క్షమాపణ చెప్పాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని సంఘం నేతలు హెచ్చరించారు. సహజంగానే కుల సంఘాలు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తే ప్రభుత్వాలు కూడా చేతులు ఏత్తేసే పరిస్థితి ఏర్పడుతుంది. సున్నితమైన సమస్య అవుతుంది. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది.. మోహన్ బాబు ఫ్యామిలీ ఏమైనా ఒ మెట్టు దిగి వస్తుందా..సినిమా ఫ్లాప్ అయిన ఫ్రెస్టేషన్ లో వీళ్లపై ఆ ప్రభావాన్ని చూపి వివాదాన్ని కొనసాగిస్తుందా.. ఏమి జరుగుతుందో వేచి చూద్దాం.