Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మీ వడ్డీస్తాను మీరు తినండి అమ్మ అని నీలా అంటుంది. పిల్లలు వచ్చాక తింటాను అని మనోహరీ అంటుంది. ఇంతకుముందు వాళ్లకి తిండి పెట్టొద్దు అన్నారు ఇప్పుడు మీరు వాళ్ళు వచ్చాక తింటానంటున్నారు మీరు అంటారు కానీ మీరు కూడా మారిపోయారు అని అంటుంది నీలా. నేనేమీ మారిపోలేదు నేను చెప్పిన మాటలకు వాళ్ళు మిస్సమ్మ మీద కోపంగా ఉన్నారు వాళ్లు దాన్ని ఆడుకోవడం నేను చూడాలి అని అంటుంది మనోహరి. భాగమతి నిర్మల తినడానికి వస్తారు. పిల్లలు కూడా వస్తారు. పిల్లలు ఎంత హాలిడేస్ అయితే మాత్రం ఇంత లేటుగా తింటారా రండి అని భాగమతి కుర్చీలను జరుగుతుంది. నీలా ఆ కుర్చీలో ఎలా ఉన్నాయో అలా పెట్టు అని అమ్ము అంటుంది.నీలా వెళ్లి ఆ కుర్చీలను జరుపుతుంది.
పిల్లలు వెళ్లి కూర్చొని తినడానికి సిద్ధంగా ఉంటే భాగమతి నీకు ఇష్టమైన ఇడ్లీలు చేశాను అమ్ము అని అంటుంది. నువ్వు పెడితే మేము తినము నీలా పెడితేనే తింటాము లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము అని అంటారు. నీలా వాళ్ళందరికీ వడ్డిస్తుంది పిల్లలు తిని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అర్థం చేసుకోవడానికి మాకే ఇంత టైం పట్టింది వాళ్ళకి కూడా కొంచెం టైం పడుతుంది నువ్వేమీ బాధపడకు మిస్సమ్మ అని నిర్మల అంటుంది. ఆంటీ చెప్పింది కదా అని పిల్లల్ని నీతో మాట్లాడతారు అని అనుకుంటే నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది మిస్సమ్మ వాళ్లు నిన్ను నమ్మరు నేను నమ్మనివ్వను అని మనోహరి అంటుంది. నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళను పక్కకు తప్పుకుంటే నేను గదిలోకి వెళ్తాను అని మిస్సమ్మ వెళ్ళిపోతుంది. దెబ్బ మీద దెబ్బ పడుతున్న మిస్సమ్మ ఎందుకని ఇంత పొగరుగా మాట్లాడుతుంది అని అనుకుంటుంది మనోహరి. గుప్తా అరుంధతిని తీసుకొని యమలోకానికి వెళ్తూ ఉండగా, అరుంధతి కళ్ళు తెరిచి మనం ఈ లోకానికి వెళ్తున్నామని సంతోషపడుతుంది.
నువ్వు నీ కుటుంబం గురించి ఆలోచించి బాధపడతావ్ అనుకుంటే ఇలా సంతోషంగా ఉన్నావేంటి అని అంటాడు గుప్త. మిస్సమ్మ కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటుంది ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా పిల్లలు ఆయన మిస్సమ్మని అర్థం చేసుకుంటారు అని అంటుంది అరుంధతి. నాది చివరి కోరిక ఉంది గుప్తా గారు తీరుస్తారా అని అడుగుతుంది అరుంధతి. చివరికి ఒకటే ఉంటుంది కానీ నువ్వు ఇన్ని కోరికలు కోరావు నేను నీ కోరిక తీర్చలేను అని అంటాడు గుప్తా. నేను భూలోకానికి తీసుకెళ్లాలి మా కుటుంబాన్ని చూడాలి అని అడగను అని అంటుంది అరుంధతి. అయితే ఏంటో చెప్పు నీ కోరిక అని అంటాడు గుప్తా. కాసేపు గాల్లోనే ఆపుతారా అని అంటుంది అరుంధతి. ఎందుకు ఇక్కడ ఆపమన్నావు అని అడుగుతాడు గుప్తా. నేను మేఘాలను ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు అని అరుంధతి వాటితో ఆడుకుంటుంది.రాథోడ్ అమర్ కార్లో వెళ్తుండగా, మధ్యాహ్నం కి భోజనం తేవాలా అని అడుగుతాడు రాథోడ్. ఆ మోసగత్తే ఇంట్లో ఉన్నంతవరకు నేను ఆ ఇంటికి వెళ్ళను దాని మొహం చూస్తే నాకు ఆ మోసమే గుర్తుకొస్తుంది నా రక్తమంతా మరుగుతుంది అని అమర్ అంటాడు.
మిస్సమ్మ ఎలాంటి పరిస్థితుల్లో మోసం చేయాల్సి వచ్చింది అని రాథోడ్ అంటాడు. కారణం ఉన్నంత మాత్రాన మోసం మంచిదైపోదు రాథోడ్ అని అమర్ అంటాడు. ఇంతలో మిస్సమ్మ రాథోడ్ కి ఫోన్ చేస్తుంది. రాథోడ్ ఫోన్ స్పీకర్ లో పెడతాడు. అసలు ఆయన ఏమనుకుంటున్నారు రాథోడ్ నేనేదో నా బ్యాడ్ టైం ఇలా ఉండాలని పెళ్లి చేసుకున్నాను కానీ అసలు ఎవరైనా ఆయన చేసుకుంటారా ఎప్పుడు మూతి ఉమ్మని పెట్టుకొని ఉంటారు ఏదో ఆంటీ చెప్పారు కదా అని ఎదురు వెళ్లాను నేనేదో కావాలని వచ్చాను అని నామీద కోపంగా ఉంటే నాకు కోపం
రాదా? అలా చేస్తే నేను ఊరుకోను ఏదో తెలిసి తెలియక తప్పు నా వైపు ఉందని అనుకుంటున్నాను లేకపోతే అసలు నేను ఏం చేసేదాన్నో నాకే తెలియదు అని మిస్సమ్మ అంటుంది. ఆయనేమన్న మా బావ మా అక్క చనిపోయింది అని నేను పెళ్లి చేసుకున్నానా అంత పొగరుగా ప్రవర్తిస్తున్నారు రాథోడ్ నీ పక్కన పామేమైనా ఉందా అలా బుస కొట్టే సౌండ్ వస్తుంది ఎందుకు అని భాగమతి అంటుంది. నువ్వు ఇలా మాట్లాడితే సార్ కి కోపం వస్తుంది మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. నేను మాట్లాడింది నువ్వు విన్నావు అంతేగాని ఆయన వినలేదు కదా అని మిస్సమ్మ అంటుంది.నువ్వేమైనా ఫోన్ స్పీకర్ లో పెట్టావా రాథోడ్ అని భాగమతి అంటుంది.
అవును మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు.అయితే నేను మీకు ఫోన్ చేయలేదు మీరేం వినలేదు అని మిస్సమ్మ ఫోన్ కట్ చేస్తుంది.రామ్మూర్తి మంగళ అమర్ వాళ్ళ ఇంటికి వస్తారు. ఏమైందయ్యా అలా చూస్తున్నావు అని అంటుంది మంగళ. ఇంతకుముందు ఇంటికి వచ్చినప్పుడు నన్ను నా కూతురు పలకరించినట్టు ఉండేది కానీ ఈరోజు ఏదో వెలితిగా ఉంది అని అంటాడు రామ్మూర్తి.