Prema Entha Madhuram October 21 Episode 1079: దివ్యా చాలు ఆపవే రాక రాకా వాడు ఇంటికి వస్తే ఆవి ఏ మాటలు మనిషి ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు అంటారు వాడు ఈ ఇంటిని ఆధుకుందామనే వెళ్ళాడు కానీ దేవుడు వాడిని చిన్న చూపు చూసాడు దానికి వాడేదో నేరం చేసినట్టు మాట్లాడతావ్ ఏంటి ఉష నువ్వు అన్నయ్యని లోపలికి తీసుకువెళ్ళు అని సుగుణ అంటుంది. అన్నయ్య ఇదిగో ఇదే ని గది ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి రా అని ఉష అంటుంది. కట్ చేస్తే అను సుగుణ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఆంటీ మీ అబ్బాయి వచ్చాడా అని అంటుంది అను. వచ్చాడమ్మా అప్పుడే పని కూడా మొదలు పెట్టాడు హోటల్ వాడే నడిపిస్తున్నాడు అను నువ్వు పిల్లలు టిఫిన్ చేసి స్కూల్ దగ్గర పిల్లలని డ్రాప్ చేసి రా అని సుగుణ అంటుంది.
అయ్యో ఆంటీ నాకు టిఫిన్ ఏమి అక్కర్లేదు అని అను అంటుంది. పర్వాలేదండి టిఫిన్ మా అన్నయ్య చాలా బాగా చేస్తాడు ఒకసారి టేస్ట్ చేయండి అని ఉష టిఫిన్ పెడుతుంది. టిఫిన్ తింటున్నా అని అవును నిజంగానే మీ అన్నయ్య బాగా చేశాడు అని అంటుంది. ఉష అన్నయ్యని వెళ్లి పిలుచుకు రా అనురాధ వాళ్లకు పరిచయం చేద్దామని సుగుణ అంటుంది. కరెంట్ ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి నాలుగు ప్లేట్లు బోండాలు పట్టుకు రమ్మంటే అన్నయ్యను పంపించాను అమ్మ అని ఉష అంటుంది.అవునా అను అయితే నువ్వు పిల్లలని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి రా మా అబ్బాయిని పరిచయం చేస్తాను అని సుగుణ అంటుంది. వాళ్ళనే గమనిస్తున్న దివ్య జ్యోతి ఈవిడ ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నాము అమ్మను కాపాడింది అని ఒకే ఒక కారణంతో ఏమీ అనలేకపోతున్నాము అని దివ్య అంటుంది.
ఇప్పుడు అవన్నీ ఎందుకే తింటే తినని ఎంతైనా అమ్మని కాపాడింది కదా అందుకే అమ్మ ఆవిడ మీద ప్రేమ చూపిస్తుంది అని జ్యోతి అంటుంది. ఆంటీ ఇక మేము వెళ్ళొస్తాము అనే పిల్లల్ని తీసుకొని అను బయలుదేరుతూ ఉండగా. ఒరేయ్ పిల్లలు నాయనమ్మకు వెళ్ళొస్తానని చెప్పరా అని సుగుణ అంటుంది. ఎందుకు చెప్పము నాయనమ్మ వెళ్ళొస్తాం అని పిల్లలిద్దరూ అంటారు. వెళ్ళొస్తాను కాదు నాయనమ్మకి ఇవ్వాల్సిన మామూలు ఇచ్చి వెళ్ళండి అని సుగుణ అంటుంది. ఏంటి నానమ్మ అనే ఆకాంక్ష అంటుంది.ఏమీ లేదమ్మా నాయనమ్మకు కావాల్సింది మీ చిన్న ముద్దు ఒకటే అని వాళ్ళిద్దరి నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్లి రండి అని సాగనంపుతుది సుగుణ. బాయ్ నాయనమ్మ మళ్లీ రేపు కలుద్దాం టాటా అనుకుంటూ పిల్లలు ఇద్దరు వెళ్ళిపోతారు.
ఇంతలో ఆర్య వర్ధన్ అక్కడికి వచ్చి అమ్మ ఇదిగో వాళ్ళు డబ్బులు ఇచ్చారు అని శివునికి ఇస్తాడు. నా దగ్గర ఎందుకు నాన్న నీ కాడే ఉండని ఇక మీదట నుంచి అన్ని నువ్వే చూసుకోవాలి కదా ఉంచు నీ దగ్గరే పనికొస్తాయి అని అంటుంది. ఇప్పుడే నా దగ్గర ఎందుకమ్మా నీ దగ్గరే ఉండని ఆర్య సుగుణకి డబ్బులు ఇచ్చేస్తాడు. ఉష ఇంకా అయిపోయినట్టేనా ఇంకా ఏమైనా కావాలా అని ఆర్య అంటాడు. అయిపోయినట్టే అన్నయ్య కానీ ఇంకో పది ప్లేట్లు బోండాలు వెయ్యి అని ఉష అంటుంది. అలాగేనమ్మా అని ఆర్య బోండాలు వేస్తూ ఉంటాడు. ఇంతలో దివ్య వచ్చి అమ్మ నేను డ్యూటీ కి వెళ్లి వస్తాను అని దివ్య అంటుంది.
దివ్య ఆఫీస్ కి వెళ్తున్నావా అని ఆర్య అంటాడు. అవును నువ్వు పంపించిన డబ్బులు పెట్టి అమ్మ నన్ను ఇంజనీరింగ్ చదివించింది కదా ఎమ్మెస్సీ కూడా చేయించింది అందుకనే పెద్ద కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చింది ఆఫీస్ కి వెళ్లొస్తాను అని వెటకారంగా అంటుంది దివ్య. అన్నయ్య అడిగినదానికి తిన్నగా సమాధానం చెప్పక వంకర టింకర్ గా మాట్లాడుతావేంటే అని సుగుణ అంటుంది. లేకపోతే ఏంటమ్మా ఆఫీసుకి అంటే నేను ఏం చదివానని ఆఫీస్ కి వెళ్తాను అది నీ కొడుకు చెప్పు కోట్లు తీసుకురాలేదు మా మీద పెత్తనం చెల్లాయించడానికి అని దివ్య అంటుంది.కట్ చేస్తే ఛాయా నాకు డ్యూటీ దొరికింది స్వీట్ తీసుకో అనే రోహిత్ అంటాడు. ఆ మాటకే ఛాయ పకపక్క నవ్వి ఏం మాట్లాడుతున్నావ్ రోహిత్ కోట్లల బిజినెస్ మనకు ఉండగా చిన్న ఉద్యోగం చేయాల్సిన అవసరం నీకేంటి నీకేమైనా పిచ్చా మా అన్నయ్యకు తెలిస్తే బాగోదు కావాలంటే మన కంపెనీలోనే పని చేయి అని ఛాయా అంటుంది.
ఆ కోట్ల డబ్బు నువ్వు మీ అన్నయ్య అక్రమంగా సంపాదించింది నాకు అక్కర్లేదు నేను నా కాళ్ళ మీద నిలబడి సొంతంగా డబ్బు సంపాదించాలి అంతేగాని మీరు ఇచ్చే డబ్బుతో నేను తిని బ్రతకకూడదు అది పాపపు సోము అని రోహిత్ అంటాడు. నీకు అంతలా చేయాలి అనిపిస్తుంది కదా సరే ఏ కంపెనీలో నీకు ఉద్యోగం వచ్చింది అని ఛాయా అంటుంది. ఆర్య వర్ధన్ ఇండస్ట్రీలో అనే రోహిత్ అంటాడు.ఇంత బ్రతుకు బతికి ఇంటానిక చచ్చినట్టు నువ్వు పోయి పోయి ఆర్య వర్ధన్ ఇండస్ట్రీలో పని చేస్తావా దానికంటే నువ్వు అమెరికా వెళ్లి అక్కడే మన బిజినెస్ చూసుకుంటే సరిపోతుంది కదా అని ఛాయా అంటుంది.
వెళదాము అంటే నేను రానని అంటున్నావు కదా నీ అంత తేలిగ్గా నేను బంధాలను పెంచుకోలేను అందుకే నీకోసమే ఇక్కడే ఉండి డ్యూటీ చేయాలనుకుంటున్నాను మీరు చేసే పాపాల నుంచి కాస్తైనా బయటపడాలి అంటే ఆర్య వర్ధన్ దగ్గరే పని చేసి తనకు కాస్త కూసో సహాయ పడితే చేసిన పాపాలు బ్యాలెన్స్ అయితాయి అని రోహిత్ అంటాడు. నువ్వు ఆ ఆర్య వర్ధన్ దగ్గర డ్యూటీ చేస్తే నా ఆహాన్ని తీసుకెళ్లి వాడి పాదాల ముందు పెట్టినట్టు ఉంటుంది దానికంటే అవమానం ఇంకోటి ఏదైనా ఉంటుందా చూడు రోహిత్ నువ్వు కట్టిన తాళికి విలువ ఇచ్చి నిన్ను భర్తగా ఒప్పుకుంటున్నాను కాదు కూడదనే నువ్వు అక్కడే పని చేస్తే బాగోదు అని వార్నింగ్ ఇస్తుంది ఛాయా. ఛీ మీరు అసలు మనుషులేనా నేను పని చేసుకుని బ్రతకని వరా నను అని కోపంగా వెళ్ళిపోతాడు రోహిత్. ఏంటి మీ ఆయనకు కోపం వచ్చినా సరే నీకోసం ఒప్పుకున్నట్టున్నాడు అని మానస అంటుంది. ఒప్పుకుంటాడు బంధాలకు ఆయన విలువ ఎక్కువగా ఇస్తాడు అందుకే కదా నేను చెప్పినట్టు వింటున్నాడు అని ఛాయా అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది