Trinayani December 22 2023 Episode 1117: ఏంటి ఎద్దులయ్య అదేదో ఉయ్యాల అయినట్టు దాన్ని అలా పట్టుకో ని ఊపుతున్నావు అని దురంధర అంటుంది. మీకే తెలుస్తుంది మాత అంటూ ఆ యమపాశమును కోరలమ్మ చుట్టూ వేస్తాడు ఎద్దులయ్య. ఇంతలో పావని మూర్తి కుండలు తీసుకుని వస్తాడు. కుండలు దేనికి తెచ్చావు అని దురంధర అంటుంది. మనం వేరే కాపురం పెట్టుకున్నాం దూర్ అందుకే తెచ్చాను అని పావన మూర్తి అంటాడు. ఆఖరికి మట్టి కుండలో వండుకునే గత వచ్చిందా బాబాయ్ అని సుమన అంటుంది. చెల్లి బాబాయ్ ఏదో తమాషాకి అంటే నువ్వు ఇంకా రెచ్చగొడతావ్ ఏంటి అని నైని అంటుంది. అది సరే విషయం చెప్పండి అని తిలోత్తమ అంటుంది.
కోరలమ్మకి పూజ చేయాలన్నా ఎద్దులయ్యే చెప్పాలి అని సుమన అంటుంది. కొబ్బరి పీచుతీసుకురా మాత చెప్తాను అని ఎద్దులయ్య అంటాడు.నేను చేస్తాను అంటూ హాసిని ఆత్రంగా వెళుతుంది. ఇదేంటి మమ్మీ దీనికి ఇంత తొందర అని వల్లభ అంటాడు.మనలో ఎవరు చేస్తారు చూడాలని ఆత్రం ఎక్కువ రా దానికి అని తిలోత్తమ అంటుంది.ఎద్దులయ్య అపమృత్యువుని ఆభరణంగా చేసుకొని ఎవరు మెడలో వేసుకుంటారు అని నైని అంటుంది.
అదే మన తాడ అక్క మెడలో వేసుకోవడానికి చావు నువ్వు ఎవరు మెడలో కోరి వేసుకుంటారు చెప్పు అని సుమన అంటుంది. కోరలమ్మకి హారతి ఇచ్చిన తరువాత ఆ కుండలో మంటలు వెలుగుతాయి అప్పుడు అపవృత్యువు ఎవరికో తెలిసిపోతుంది మాత అని ఎద్దులయ్య అంటాడు. అమ్మో కోరలమ్మ కోరలు చూస్తేనే ఎవరిని తీసుకు వెళ్తుందో అని భయం వేస్తుంది అల్లుడు అని పావన మూర్తి అంటాడు. అ విశాలక్షి గారడీ పిల్ల మాయలు మాకు చెప్పకు ఆవిడ దగ్గర నేర్చుకున్న విద్యలు మాకు చూపించకు అని తిలోత్తమ అంటుంది.అవును ఆ పిల్ల దగ్గరే ఎద్దులయ్య నేర్చుకుని మనకు మృత్యువు ఉందని భయపెడుతున్నాడు అని సుమన అంటుంది. సుమన ఎందుకు అలా అంటున్నావ్ మృత్యుదేవత ఎవరిని వరిస్తుందో ఎవరికి తెలుసు మన వెన్నంటే ఉన్నా మనం కనిపెట్టలేము అని విశాల్ అంటాడు. మనిషి కోరకంగా చెప్పి మమ్మల్నిని ఇంకా అబ్బాయి పెట్టకండి అని తిలోత్తమ అంటుంది. ఇంతలో హాసిని కొబ్బరి పీచు తీసుకువచ్చి వాళ్లకు పెట్టు గడ్డి అని ఇస్తుంది. ఏయ్ మేము గడ్డి ఎందుకు తింటాం అని వల్లభ అంటాడు. రే ముందు నోరు ముయ్యరా అని తిలోత్తమ అంటుంది. అది సరే కుండలో నుంచి మంటలు ఎలా వస్తాయి అని విక్రాంత్ అంటాడు. నైనీ అమ్మ కూరలమ్మ కి హారతి ఇచ్చేటప్పుడు గాయత్రీ పాప చేత కుండలో కర్పూరం వేయించండి అని ఎద్దులయ అంటాడు.
ఆ పిల్ల చేతనే ఎందుకు వేయించాలి అని సుమన అంటుంది. గ్రహదోషం ఉన్నవారు వేస్తేనే మంటలు వస్తాయి అని ఎద్దులయ్య అంటాడు. పాపకి గ్రహ దోషం ఉందా అని నైని అంటుంది. చెల్లి ముందు అయితే కర్పూరం వేయించు తర్వాత చూద్దాం అని హాసిని అంటుంది. నైనీ కుండల్లో కొబ్బరి పీచు పెడుతుంది విశాల్ కుండలో గాయత్రి చేత కర్పూరం వేస్తాడు.నైని కోరలమ్మకి హారతి ఇస్తుంది. అలా హారతి ఇవ్వగానే కుండలో మంటలు చెలరేగుతాయి వాటిని చూసి అందరూ భయభ్రాంతులవుతారు. ఎవరు వెలిగించలేదు మంటలు ఎలా వచ్చాయి అని విక్రాంత్ అంటాడు. చెప్పాను కదా పుత్ర గ్రహదోషం ఉన్నవారు వేస్తే వెలుగుతాయి అని ఎద్దులయ్య అంటాడు. వాటిని ఆర్పి వేస్తే సరిపోతుంది కదా అని కిలోత్తమ అంటుంది. అలా ఆర్పకూడదు మాత అని ఎద్దులయ్య అంటాడు. అది అలాగే మండుతూ ఉంటే ఎలాగని విశాల్ అంటాడు. విశాల్ బాబు సూర్యాస్తమయం అయ్యి నిండు చంద్రుడు వచ్చేదాకా మంటలు వెలుగుతూనే ఉంటాయి అని ఎద్దులయ్య అంటాడు. ఇంతలో యమపాశం ఆ కుండల చుటు తిరిగి పైకి వెళ్తుంది. అది పామా తాడ అలా పాక్కుంటూ వెళ్తుందేంటి అని పావనమూర్తి భయపడతాడు. గండం ఎవరికి వస్తుందో వారి దగ్గరికి వెళ్తుంది మాత అని ఎద్దులయ్య అంటాడు.
పైన ఎవరు లేరు కదా అని సుమన అంటుంది. పైన ముగ్గురు పిల్లలు ఉన్నారు అని నైని పరుగెత్తుకు వెళుతుంది. కట్ చేస్తే, తీరా అందరూ పైకి వెళ్లి చూసేసరికి అక్కడ యమపాశం కనిపించదు.ఎక్కడికి వెళ్ళింది యమపాశం కనిపించట్లేదేంటి అని విక్రాంత్ అంటాడు. రేయ్ అదే మొన్న పాము అనుకున్నావా కనిపించడానికి తాడు ఎక్కడికి వెళ్లిందో ఏమో అని వల్లభ అంటాడు. కోరలమ్మ పూజ అని హడావుడి చేసిన ఎద్దులయ్యే చెప్పాలి అని విక్రాంత్ అంటాడు. చెప్పు ఎద్దులయ్య పాషము ఎటు వెళ్ళింది అని నైని అంటుంది. ఎక్కడికి వెళ్ళలేదు మాత చుట్ట చుట్ట కొని ఉంది అని ఎద్దులయ్య అంటాడు. ఎక్కడ అని విశాల్ అంటాడు. అటు చూడండి బాబు అని ఎద్దులయ్య చూపిస్తాడు. టీవీ మీద ఎవరు పెట్టారు ఎద్దులయ్య తీసేయ్ అని విశాల్ అంటాడు. అమ్మో నేను తీయను అని వల్లభ అంటాడు. నువ్వు పెద్ద కండబలం ఉన్న వాడు అనుకుంటున్నావా నిన్ను తీయమనడానికి నువ్వు గమ్మునుండవోయ్ అని హాసిని అంటుంది. ఎద్దులయ్య ఆ యమపాషాన్ని తీస్తాడు. పాశం తీయగానే టీవీలో గాయత్రి పాప ఫోటో కనిపిస్తుంది. అదేంటి గాయత్రీ విశాల్ బాబు చేతిలో ఉంటే టీవీలో ఎలా కనిపిస్తుంది అని నైని షాక్ అవుతుంది. నాకు అర్థం అయిపోయింది అక్క కోరలమ్మ పూజ ఫలితం అనుకోవాల్సిందే అని సుమన అంటుంది. అర్థమయ్యేలా చెప్పు సుమన అని తిరువత్తమ అంటుంది.
ఏముంది అత్తయ్య కోరలమ్మ పూజ ఫలించి గండం ఎవరికో తెలిసిపోయింది అది గాయత్రి పాపకి అని సుమన అంటుంది. లేదు అలా జరగకూడదు అని విశాల్ గాయత్రిని గట్టిగా పట్టుకొని కంగారుపడుతూ ఉంటాడు. లేదు గాయత్రి పాప పక్కన ఇంకెవరో కనిపించారు వాళ్ళు ఎవరో తెలిస్తే గండం ఎవరికో తెలుస్తుంది అని నైని అంటుంది. ఎవరు ఉన్నారు మాకు ఎవరు కనిపించలేదు అని తిలోత్తమ అంటుంది. అది ఎవరో నాకు స్పష్టంగా కనపడలేదు అని నైనీ అంటుంది. శివ భక్తుడైన ఎద్దులయ్యే చెప్పాలి అని విక్రాంత్ అంటాడు. ఆ కుండలో మంట ఆరితే గాని నైని అమ్మకు అవగతం అవుతుంది అని ఎద్దులయ్య అంటాడు. ఆ మంటలు సాయంత్రం దాకా ఆగవు అన్నావు కదా అని విశాల్ అంటాడు. నీళ్లు పోసి ఆర్పేస్తే అని సుమన అంటుంది. అలా ఆర్పకూడదు చేతులు వాడకూడదు అని ఎద్దులయ్య అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది