Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఆదివారంతో ముగిసిన సంగతి తెలిసిందే. 105 రోజులపాటు సాగిన ఈ షోలో 19 మంది టైటిల్ కోసం పోటీపడ్డారు. ఈ పంతొమ్మిది మందిలో చాలామంది సీరియల్ నటీనటులు.. సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు.. సింగర్స్.. యూట్యూబర్ ఉండగా చివరకి యూట్యూబర్ పల్లవి ప్రశాంత్.. టైటిల్ విన్నర్ గెలవడం జరిగింది. బిగ్ బాస్ షో జరుగుతున్నంతకాలం.. మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అనంతరం అన్నపూర్ణ స్టూడియో బయట జరిగిన దాడులు పూర్తిగా నెగిటివ్ షోపై తీసుకురావడం జరిగింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ తర్వాత టైటిల్ ప్రకటించాక.. షో నుండి బయటకు వస్తున్న కంటెస్టెంట్ల వాహనాలపై దాడులు జరగటం తెలిసిందే.
చాలామంది కారుల అద్దాలు పగిలిపోయాయి. ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. అయితే ఎక్కడ ప్రశాంత్ నీ సైలెంట్ గా వెళ్ళిపోవాలని పోలీసులు సూచించిన ర్యాలీగా వెళ్లడంతో అతనిపై కేసు నమోదు అయ్యి.. జైలు పాలు కావడం జరిగింది. ఇంకా ఇదే కేసులో 16 మందిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ షో నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకోవాలి అంటూ సిపిఐ నారాయణ తాజాగా హైకోర్టుకి లేఖ రాశారు. షో ముగిశాక జరిగిన గొడవలో పల్లవి ప్రశాంత్ అతని సోదరుడు అభిమానులపై కేసు నమోదు చేసిన… బాధ్యులైన షో నిర్వాహకులపై చర్యలు తీసుకోలేదన్నారు.
షోలో కంటెస్టెంట్ల ఆటలు వికృత చేష్టలు మనుషులను కలుషితం చేసే విధంగా ఉన్నాయని… స్పష్టం చేయడం జరిగింది. గతంలోనే సీపీఐ నారాయణ బిగ్ బాస్ షో బ్యాన్ చేయాలని కోర్టునీ ఆశ్రయించారు. అంతేకాదు యాంకర్ నాగార్జునపై కూడా మండిపడ్డారు. బిగ్ బాస్ షో బ్రోతల్ హౌస్ అని విమర్శించారు. వందమంది వయసులో ఉన్న వారిని ఒకే ఇంటిలో పెట్టి గేమ్ ఆడించటం ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని.. సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటీవల షో ముగిసిన గొడవ జరిగిన తర్వాత కూడా.. నారాయణ మండిపడ్డారు. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి తాజాగా బిగ్ బాస్ షో బ్యాన్ చేయాలని.. హైకోర్టుకి నారాయణ లేఖ రాయడం సంచలనంగా మారింది.