రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జల వివాదాల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఏపీ అర్థంపర్థంలేని నిరాధార ఆరోపణలు చేస్తోంది అంటూ మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టు విషయంలో ఏపీ అనవసర రాద్ధాంతం అని, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తప్పుడు విధానాలను అనుసరిస్తుంది అంటూ… మండిపడ్డారు. అపెక్స్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అటు కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా సమాధానం చెప్పాలని డిసైడ్ అయ్యారు.
పరిస్థితి ఇలా ఉండగా గోదావరి మిగులు జలాలో మరో 1000 టీఎంసీలు తెలంగాణకు దక్కాలి అని కేసిఆర్ పేర్కొన్నారు. అంతేకాకుండా విభజన చట్టం ప్రకారం తెలంగాణ కు దక్కిన వాటా ప్రకారమే రాష్ట్రంలో ప్రాజెక్టులు కడుతున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. సముద్రంలో కలిసే రెండు వేల టీఎంసీల లో తెలంగాణకు 1000 టీఎంసీలు కేటాయించాలని కోరారు. సాగునీటి విషయంలో మొదటి నుండి తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ని పిలిచి అన్నం పెట్టి మరీ మాట్లాడాను… రెండు రాష్ట్రాల రైతుల కోసం ప్రాజెక్టు లు కట్టుకుందామని సలహా ఇచ్చాను, వృధాగా సముద్రం పాలవుతున్న నీటిని రైతుల పొలాలకు మల్లిద్దాం అని చెప్పిన ఏపీ ప్రభుత్వం కయ్యానికి దిగుతుంది అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేయడం సరి కాదని స్పష్టం చేశారు. దేనికైనా సిద్ధమే అని నిరూపించుకోవడం కోసం నెక్స్ట్ జరగబోయే అపెక్స్ సమావేశంలో ఏపీ ప్రభుత్వం నోరు మూయించేలా, వారి అర్థ రహిత వాదనలను తిప్పికొట్టేలా సమాధానం చెపుతాం. తెలంగాణ ప్రాజెక్టుల గురించి మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కల్పిస్తాం’’ అని ముఖ్యమంత్రి కేసిఆర్ స్పష్టం చేశారు.