బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. రోజులు గడిచే కొద్దీ ఈ కేసుపై కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. అయితే నిన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలని కేంద్రానికి సిఫార్సు చేసిన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో కేంద్రం ఈ సిఫార్సును అంగీకరించినట్లు తెలుస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమవుతున్న నేపథ్యంలో సీబీఐ విచారణ కీలకం కానుంది. సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ కొన్ని రోజుల కిందట బాలీవుడ్ నటి రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెల్సిందే. ఇక అప్పటినుండి ఈ కేసు కొత్త మలుపులు తిరుగుతూ ఈరోజు సీబీఐ విచారణకు చేరుకుంది. చివరికి ఈ కేసు ఎటు వెళుతుందో చూడాలి.