రాష్ట్రంలో ప్రజలు ఎటు వైపు నిలుస్తారు? ఎలాంటి తీర్పు ఇస్తారు? ఏ పార్టీకి.. ఏ నేతకు జై కొడతారు? అంటే .. రెండు నెలల కిందట వైసీపీ అని వినిపించింది. అనేక సర్వేలు కూడా.. ఇదే చెప్పాయి. కానీ, అప్పట్లోనే చెప్పుకొన్నట్టు.. మేనిఫెస్టోలు వచ్చాక.. మారుతుందని.. ప్రజల నాడి వేడి పెరుగుతుందని అన్నట్టుగా మేనిఫెస్టోలు వచ్చాక.. మరోసారి నాడి మారింది. వైసీపీ ప్రస్తుతం ఇస్తున్న సంక్షేమాన్ని పిసరంత పెంచి ఇస్తానని చెబుతోంది. పెద్దగా మార్పులు లేవు.
బడుగులు ఆశించినంత బ్రహ్మాండాలేవీ కూడా.. వైసీపీ వండి వార్చలేదు. ఇక, టీడీపీ కూటమి పార్టీల విషయానికి వస్తే.. ఊహించనివి కూడా ఇందులో చేర్చారు. వైసీపీ మేనిఫెస్టోకు కొనసాగింపుగా.. కాపీగా ఉందన్న ప్రచారాన్ని పక్కన పెడితే.. చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలో.. కనక వర్గం.. కాసుల వర్షం కూడా కురిపించారు. తాను అధికారంలోకి వస్తూ వస్తూనే 4000 పింఛను ఇస్తానన్నారు. ఇది తాజాగా ఆయన చేస్తున్న ప్రధాన ప్రచారం.
ఇక, మెగా డీఎస్సీ వేస్తామన్నారు. 20 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే.. మహిళలను ఆకర్షించేందుకు.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రకటించారు. ఇది పెద్ద ఎత్తున మహిళలను టీడీపీ వైపు కనెక్ట్ చేసే అంశంగా చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ పరిణామాల ను లెక్కిస్తే.. వైసీపీ మేనిఫెస్టో తేలిపోతోంది. దీంతో ఓటర్ల నాడి మారిందనే చెప్పాలి. కట్ చేస్తే.. ఇంకేముంది.. మాదే విజయమని టీడీపీ నేతలు చెబుతున్నారు.
కానీ, ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. పవనాలు మారుతున్నాయన్న ప్రచారం ఉన్నా… ఓటరు దేవుడు ఎవరిని కరుణిస్తారనే విషయం మాత్రంసస్పెన్స్గానే ఉంది. ఎందుకంటే.. వైసీపీ ఇచ్చిన మేనిఫెస్టోలో కొద్దిగా ఊపు మాత్రమే ఉంది. పోనీ.. టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టోపై మనసు పెడదామా? అంటే.. భారీ ఎత్తున ప్రకటించారు. దీనిని ఎలా నమ్మాలనేది.. వైసీపీ చేస్తున్న యాంటీ ప్రచారం.
ఈ తరహా ప్రచారం వైసీపీపై టీడీపీ చేయలేక పోతోంది. దీంతో వెంటనే భూములు, రేషన్కార్డులు అంటూ.. ప్రత్యేక ప్రస్తావన తీసుకువచ్చింది. అయితే.. దీనిపై ప్రజల్లో విశ్వాసం కలిగినట్టు కనిపించడం లేదు. అలాగని వైసీపీ వైపే పూర్తిగా మొగ్గు చూపించడం లేదు. సో.. ఎలా చూసుకున్నా.. పవనాలు మరుతున్నాయి కానీ.. సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. మరో నాలుగు రోజులు ఇంతే పరిస్థితి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.