AP Elections: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఏపీ హైకోర్టు గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వానికి సీఈసీ షాక్ ఇచ్చింది. పోలింగ్ కు ముందు నిధులు విడుదల చేయవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ముగిసిన 13వ తేదీ తర్వాత మాత్రమే నిధులు విడుదల చేయాలని ఎన్నికల కమిషన్ పేర్కొంది.
ఏపీ సీఎస్ ఇచ్చిన వివరణతో ఈసీ సంతృప్తి చెందలేదు. ఈ రోజు 10వ తేదీ అయిపోయింది. 14వ తేదీన నిధులు విడుదలకు నేటికీ పెద్ద తేడా ఏముందని ఈసీ ప్రశ్నించింది. శుక్రవారం మధ్యాహ్నం తాము ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ రికార్డు చేసిందని ఈసీ గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో మే 13వ తేదీ తర్వాత మాత్రమే నిధులు విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు