ఆయన మంత్రి వైసిపిలో యంగ్ ఎమ్మెల్యే.. అన్నింటికీ మించి ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అనుచరుడు. జగన్ ఆయనను బాగా నమ్ముతారు. చాలా చిన్న వయసులోనే ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది. ఆ ఎన్నికల్లో ఓడిపోయినా గత ఎన్నికల్లో జగన్ పట్టుబట్టి మరీ అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చారు. తొలిసారి గెలిసిన సదురు యువ ఎమ్మెల్యేకు జగన్ ఎక్కడా లేని ప్రాధాన్యత ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే జిల్లాలో మంత్రికి, ఎమ్మెల్యేలకు, సీనియర్లకు మించిన ప్రాధాన్యత ఆ యువ ఎమ్మెల్యేకు దక్కింది.
అనూహ్యంగా జగన్ కేబినెట్లో మంత్రి పదవి కూడా దక్కింది. వైసీపీలో కీలక నేతగా ఉన్న వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ అనుగ్రహం కూడా ఆ యువ ఎమ్మెల్యేకు ఉంది. అలాంటి ఓ ఎమ్మెల్యే కు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు వస్తుందా ? అంటే డౌట్ గానే ఉంది. ఇప్పటికే ఆయన ఎమ్మెల్యేగా ఉన్న అసెంబ్లీ సీటును మలసాని భరత్ కుమార్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు ఇచ్చేశారు. భరత్ కుమార్ రాజకీయాలకు కొత్త. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అనకాపల్లి నుంచి వైసీపీ అభ్యర్థిగా భరత్ పోటీ చేస్తారని వైసిపి వర్గాలు చెబుతున్నాయి.
మూడో జాబితాలోనే పార్టీ అధిష్టానం ఈ విషయం వెల్లడి చేసింది. ఆ తర్వాత మరో మూడు జాబితాలు మొత్తంగా వైసిపి నుంచి ఆరు జాబితాలు వచ్చాయి. ఇందులో అమర్నాథ్ పేరు ఏ జాబితాలోనూ లేదు. పైగా ఆయన ఎలమంచిలి, చోడవరం, పెందుర్తి సీట్లను ఆప్షన్ గా ఉంచుకున్నారు. అయితే ఈ మూడు సీట్లలో సెట్టింగ్ ఎమ్మెల్యేలను కదపకూడదని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ మార్చినా కూడా గుడివాడకు అక్కడ సీటు ఇవ్వరని ప్రచారం జరుగుతోంది. అమర్నాథ్ గాజువాక నియోజకవర్గ ప్రాంతంలో ఉంటున్నారు.
చివరకు గాజువాక సీటు అయిన ఇస్తారని ఆయన ఆశలు పెట్టుకుంటే అక్కడ మరో ఇన్చార్జ్ని తెచ్చిపెట్టారు. అయితే అనకాపల్లి పార్లమెంటు నుంచి అమర్నాథ్ 2014లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే అక్కడ విపక్షాలు కాపు సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని బరిలోకి దింపితేనే గుడివాడను ఎంపీగా పోటీ చేయిస్తారని లేకపోతే అక్కడ కూడా ఛాన్స్ లేదని అంటున్నారు. ఏది ఏమైనా అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే కథ ఇలా ఉండటం వైసిపి వర్గాలనే ఆశ్చర్యపరుస్తుంది. జగన్ తాను నమ్ముకున్న అనుచరుడికి
ఎలా న్యాయం చేస్తారో ? ఎవ్వరికి అర్థం కావడం లేదు.