అయ్యప్ప అనగానే శబరిమల గుర్తుకు వస్తుంది. కార్తీకమాసం దగ్గరకు రావడం భక్తులు మాలలు ధరించడం ప్రారంభకానున్నది. ఇక శబరిమలలో నవంబర్ 16 నుంచి శబరిమల స్వామి అయ్యప్ప మండల పూజలు ప్రారంభం కానున్నాయి.
ఈసారి మండల పూజలకు మాల వేసుకుని.. టికెట్టు కొనుక్కుని నేరుగా వెళ్ళే అవకాశం లేదు. నవంబర్ 16 నుంచి శబరిమల స్వామి అయ్యప్ప మండల పూజలు ప్రారంభం కానున్నాయి. ఈసారి మండల పూజలకు మాల వేసుకుని.. టికెట్టు కొనుక్కుని నేరుగా వెళ్ళే అవకాశం లేదు. కరోనా మహమ్మారి కారణంగా శబరిమల స్వామి అయ్యప్ప దర్శనాలకు కేరళ ప్రభుత్వం ప్రత్యెక నిబంధనలు చేసింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. దాని ప్రకారం.. రోజుకు 1,000 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. సెలవు రోజులు, మకర సంక్రాంతి సమయంలో గరిష్ఠంగా 5వేల మంది వరకు భక్తులకు అవకాశం కల్పిస్తారు.
కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ మండల, మకరవిళక్కు సీజన్లో పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతి ఉంటుంది. దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్-19 టెస్ట్ చేయించుకోవాలి. నెగెటివ్ సర్టిఫికెట్ ఉన్నవారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ఆలయం వద్ద విధులు నిర్వర్తించేవారికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయితే కనుక, వారికి చికిత్స కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తాఋ. ఒకవేళ, వారు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవాలని భావిస్తే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తారు. మండల పూజలకు నవంబరు 16న ఆలయం తెరుస్తారు. డిసెంబరు 27 వరకు భక్తులను అనుమతిస్తారు. తర్వాత మూడు రోజుల పాటు మూసివేసి తిరిగి మకరవిళక్కు పూజల కోసం తెరిచి జనవరి 20న పడిపూజ తర్వాత మూసివేస్తారు.