దర్శకుడు కొరటాల శివ.. లాక్ డౌన్ తర్వాత రీసెంట్ గా ఆచార్య సినిమాని సెట్స్ మీదకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా కోకాపేట లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే మెగాస్టార్ లేకుండా సీన్స్ను ఫినిష్ చేసాడు కొరటాల. కాగా రీసెంట్ గా చిరంజీవి ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు. చిరు మీద సోలో సాంగ్ తీసినట్టు సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయన్గా నటిస్తోంది.
కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ కంటిన్యూ గా షూటింగ్ సాగుతోంది. త్వరలో మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అవబోతోంది. దాంతో ఆచార్య సినిమా షూటింగ్లో పాల్గొనడానికి రాజమౌళి ఒకే చెప్పాడట. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కి జంటగా నటించడానికి రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ సినిమాని సమ్మర్ కి రిలీజ్ చేయాలని కొరటాల గట్టిగా ఫిక్సైయ్యాడు. లాక్ డౌన్ కి ముందే ఒక సాంగ్ తో పాటు 40 శాతం షూటింగ్ కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో మేజర్ పార్ట్ కంప్లీట్ అవుతుందట. అందుకే నెక్స్ట్ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఒక వైపు నుంచి జరుగుతుందని సమాచారం. ఇక కొరటాల నెక్స్ట్ సినిమాని అల్లు అర్జున్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ అయింది. కాగా 2021 విజయదశమి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షీటింగ్ జరపబోతున్నారని తాజా సమాచారం.
Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!