Preity Zinta ప్రీతి జింటా టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీకి స్పెషల్గా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఆమె ఇప్పటి వరకు హిందీతో పాటు పంజాబీ, తెలుగు, ఇంగ్లీష్ మూవీస్ లో నటించి తనకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. 1998 సంవత్సరంలో దిల్సే మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ.. ఈ మూవీతో ఫిలింఫేర్ ఉత్తమ యాక్ట్రస్ డెబ్ల్యూ పురస్కారం అందుకుంది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో నటించిన క్యా కెహనా మూవీలో నటించిన తన నటనతో విమర్శలకు ప్రశంసలు అందుకుంది. ప్రీతి.. ఆమె నటనతో చాలా చాన్స్లు సొంతం చేసుకుంది. ప్రీతి ఒక యాక్ట్రస్ కాకుండా సామాజిక సేవకురాలు సైతం. ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీంకు సహ యజమానిగా వ్యవహరించింది. తన విషయాలపై వచ్చే కామెంట్స్ పై ఎప్పటికప్పుడు ముక్కు సూటిగా స్పందించే ఈ భామ.. ఎక్కువగా మీడియాలో నిలిచేవారు. అనంతరం ఆమె ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. ఇండియన్ మాఫియా గురించి ఆమె చేసిన కామెంట్స్ వల్ల కోర్టులో సాక్షిగా నిలబడి ధైర్యంగా సాక్ష్యం చెప్పింది ప్రీతి. ఇందుకు గానూ ఆమె గాడ్ ఫ్రే ఫిలిప్స్ బ్రేవరీ అనే అవార్డును సైతం అందుకుంది.
కర్మనే నమ్ముతుందంట..
షూటింగ్ లేని టైంలో ఆమె ఎక్కువగా తన స్వగ్రామంలోనే ఉండేవారు. అనంతరం 2006 లో తన కుటుంబంతో సహా ముంబయికి షిప్ట్ అయ్యింది. ఇక మతం గురించి ఎన్నడు మాట్లాడని ఆమె.. కేవలం దేవుడి కర్మ ఫలిలాతను ఎక్కువ నమ్ముతాను అంటూ చెప్పేది.
సరోగసితో తల్లి అయిన ప్రీతి..
ఇక ఆమె తాజాగా తన ఫ్యాన్స్కు ఓ గుడ్న్యూస్ చెప్పింది. సరోగసి ద్వారా తాను ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయినట్టుగా పేర్కొంది. ఈ విషయం చెబుతూ తన భర్త జీన్తో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పిల్లలకు జై జింటా, గియా జింటా అని పేరు పెట్టినట్టు చెప్పింది. ఇక ఇందుకు సహకరించిన డాక్టర్స్, నర్సులు, వైద్య సిబ్బందికి సైతం ఆమె థ్యాంక్స్ చెప్పింది.